ఆ సీనియర్ హీరో సైలెంట్ గా పూర్తి చేశాసాడే

Akkineni-Nagarjuna-Completed-Shootiong-For-His-Upcoming-Movie-Andhra-Talkies.jpg
ఒక  సీనియర్  హీరో సినిమా మొదలవుతుందంటే అంతో ఇంతో హంగామా ఉంటుంది. ఓపినింగ్ కే భారీగా ఖర్చు అవుతుంది. ఫ్యాన్స్ కి కూడా ఓపినింగ్ నుండే సినిమా అప్డేట్స్ అందుతాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి నాగార్జున సినిమా మొదలెట్టేసి ఒక షెడ్యుల్ కూడా పూర్తి చేసేసాడు. అవును సోలోమన్ అనే దర్శకుడితో సినిమా చేస్తున్న నాగ్ ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఓల్డ్ సిటీలో ఐదు రోజుల పాటు ఓ స్మాల్ షెడ్యుల్  ఫినిష్  చేసేశాడు.

నిజానికి నాగ్ కి ఈ ఇయర్ హీరోగా అస్సలు కలిసి రాలేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న 'మన్మథుడు 2' డమాల్ అనిపించుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఎక్కువ హంగామా లేకుండానే నెక్స్ట్ సినిమా ను సైలెంట్ గా మొదలెట్టేసాడేమో అనిపిస్తుంది. అయితే సినిమాలో నాగ్ పోలిస్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో తిప్పి కొడితే నాగ్ ది ఇరవై నిమిషాల పాత్ర అనే టాక్ కూడా ఉంది.

మాల్దీవుల్లో బిగ్ బాస్ సెక్సిణి హీనా ఖాన్ చిలౌట్

Hindi-bigboss-Heena-Khan-in-Bikini-Andhra-Talkies.jpg
అందం.. వివాదం ఒకే ఒరలో ఇమిడితే రచ్చ రచ్చస్యే. ఆ రెండిటినీ తనలో ఇముడ్చుకున్న బ్యూటీ  హీనా ఖాన్. తనవైన అందచందాలతో కుర్రకారు గుండెల్లో కొలువు దీరింది ఈ అమ్మడు. బిగ్ బాస్ - హిందీ సీజన్ ని వేడెక్కించి నిరంతర వార్తల్లో వుంటూ హల్ చల్ చేసిన హీనా ఖాన్ ప్రస్తుతం సెలబ్రేషన్  మోడ్ లో ఉంది. మాల్దీవుల్ని తనదైన శైలిలో మతడ పెట్టేస్తోంది. వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిన హీనా ఖాన్ అక్కడ ఎగ్జోటిక్ ప్రదేశాల్ని చుట్టేస్తోంది.  అక్కడ బీచ్లలో బికినీలో హల్చల్ చేసింది. టూ పీస్ బికినీ వేసుకుని బీచుల్లో తిరుగుతూ హీనా ఖాన్ చేసిన హంగామా మామూలుగా లేదు. టూపీస్ బికినీతో పాటు తలపై వైట్ హాట్ పెట్టుకుని హొయలు పోయిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.

ఓ వైపు బీచ్ లో అందాల్ని ఎర వేస్తూ హంగామా చేస్తూనే మరో పక్క హెవీ వర్కవుట్స్ తో అక్కడి పర్యాటకుల మతిపోగొట్టింది. హీనా ఖాన్ ఈ ట్రిప్ కి సంబంధించిన ఫొటొలని తాజాగా సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

నచ్చుతుందా లేదా అనే టెన్షన్ ఉంది: రాజమౌళి

Director-Rajamouli-Speech-at-Mathu-Vadalara-Movie-Pre-Release-Event-Andhra-Talkies
ఎంఎం కీరవాణి తనయులు శ్రీ సింహ.. కాల భైరవ 'మత్తు వదలరా' సినిమాతో తమ అదృష్టాన్ని పరీక్షించుకొబోతున్నారని తెలిసిందే.  ఈ సినిమాతో సింహా హీరోగా పరిచయం అవుతున్నాడు.  ఇప్పటికే గాయకుడిగా కొన్ని పాటలు పాడిన కాల భైరవ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మారుతున్నాడు.  ఈమధ్యే విడుదలైన 'మత్తు వదలరా' ట్రైలర్ అందరినీ ఆకర్షించింది.

ఈ సినిమా క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 25 న రిలీజ్ అవుతోంది. అన్నయ్య కొడుకుల సినిమా కావడంతో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.  ప్రస్తుతం 'RRR' షూటింగ్ తో బిజీగా ఉన్నప్పటికీ డిసెంబర్ 25 న మాత్రం 'షూటింగ్ మానేస్తా మానేస్తా'.. అంటూ సినిమా చూస్తానని ట్విట్టర్ ద్వారా ఇదివరకే వెల్లడించారు.  ఇదిలా ఉంటే రీసెంట్ గా 'మత్తు వదలరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.  ఈ కార్యక్రమానికి రాజమౌళి హాజరయ్యారు.

హన్సికలో అన్ని కోణాలు ఉన్నాయా?

Romanti-Poster-from-Simbu-and-Hansika-Maha-Movie-Andhra-Talkies
ఆపిల్ అందం హన్సిక కు కొన్నేళ్లగా కలిసి రావడం లేదు. సినీ ఛాన్సులున్నా సక్సెస్ లు అందుకోవడంలో వెనుకబడుతోంది. సీనియారిటీ అవకాశాలు తెస్తున్నా! సక్సెస్ ల పరంగా  నేటి తరం నాయికలతో పోటీ పడలేకపోతుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో మహా- పార్టనర్ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది.  రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. అయితే ముందుగా మహా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే శర వేగంగా చిత్రీకరణ పూర్తిచేసే పనిలో ఉంది యూనిట్. ఇటీవలే ప్రచారంలో భాగంగా హన్సిక పోస్టర్లను రిలీజ్ చేసారు. హాన్సిక డిఫరెంట్ షెడ్స్ ఉన్న గెటప్ లలో దర్శనమిచ్చిన పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో  వైరల్ గా  మారాయి.

ఈ దశాబ్ధపు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'బాహుబలి 2' కాదా?

Biggest-Bollywood-Hero-Aamir-Khan-Dangal-is-biggest-blockbuster-of-the-decade--Andhra-Talkies
దక్షిణాది చిత్రాలంటే బాలీవుడ్ వాళ్లకు ఎప్పుడూ చిన్న చూపే ఉండేది. తెలుగు సినిమాలను తక్కువగానే చూసేవారు. బాలీవుడ్ దర్శకనిర్మాతలు దశాబ్దాల పాటు ఇలానే ఆలోచించారు. భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనే ధోరణి ఇప్పటికీ చెరిగిపోలేదు అనడానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి. మద్రాసీలు సాంబార్ ఇడ్లీ అంటూ ఇప్పటికీ కామెడీలు చేస్తారు అక్కడ. అయితే ఉత్తరాదికి బాలీవుడ్ కి ధీటుగా సౌత్ సినిమా ఎదుగుతోంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ వాళ్ల వైఖరి మారుతోంది. అయినా ఇంకా మనపై అలసత్వం అలానే ఉంది.

`బాహుబలి` వంటి సెన్సేషన్ తర్వాతా యావత్ సినీ ప్రపంచం మొత్తం తెలుగు సినిమావైపు చూస్తున్న విషయం తెలిసిందే. హిందీ వాళ్లు మన సినిమాల్ని రీమేక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. అయితే దీనిని కేవలం బిజినెస్ కోణంలో మాత్రమే చూస్తున్నారా? అంటే అవుననే అర్థమవుతోంది. మనం ఎదుగుతున్నా ఆ విషయాన్ని బాలీవుడ్ బిగ్గీస్ మరోసారి మరుగున పడేసే ప్రయత్నం చేశారు.

సన్యాసిని అవ్వాలనుకుని ఈ వేషాలా?

Sexy-Heroin-Jacqueline-Fernandez-wanted-to-be-a-nun-Andhra-Talkies
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వాళ్లు.. ఇంజినీర్ కాబోయి డైరెక్టర్ అయిన వాళ్లను చూసాం కానీ.. సన్నాసిని కాబోయి కథానాయిక అయినవాళ్లను ఎక్కడైనా చూశారా?  ప్చ్.. అలాంటావిడను మీకు పరిచయం చేయాల్సిందే.

ఇంతకీ ఎవరావిడ? అంటే.. ఇంకెవరూ జాకీ అలియాస్ జాక్విలిన్. సాహో చిత్రంలో ఒకే ఒక్క బ్యాడ్ బోయ్స్.. స్పెషల్ నంబర్ తో కుర్రాళ్ల కళ్లను కట్టి పడేసిన ఈ బ్యూటీ గతం పరిశీలిస్తే ఊహించని షాక్ తగుల్తుంది. అసలు సన్యాసినులు తిరిగే చోట స్తోత్రం అంటూ ప్రార్ధనలు జరిపే చోట పెరిగిన ఈ అమ్మడు ఉన్నట్టుండి బోయ్స్ వాలు చూపుల గాలానికి చిక్కుకుని విలవిలలాడిందట. మనసు ఏకాగ్రత గతి తప్పాయని చెప్పింది.

చుక్కలు చూపిస్తున్న ఇస్మార్ట్ గాళ్

Tollywood-movie-Ismart-Girl-Asking-Shocking-Remuneration-Andhra-Talkies
దీపం ఉండగానే చక్కదిద్దుకోవడం మన అమ్మణ్ణులకు అలవాటే. అయితే ఈ భామ మాత్రం పరిశ్రమలో ప్రవేశించిన కేవలం రెండు మూడేళ్లకే పారితోషికంలో చుక్కలు చూపించేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఆరంభం లక్షల్లో పారితోషికంతో సరిపెట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా కోటికి ఏమాత్రం తగ్గననేస్తోందట. దీంతో తనను సంప్రదిస్తున్న నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయని సమాచారం.

అసలింతకీ ఎవరీ భామ? అంటే.. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ఎవరో చెప్పాల్సిన పనేలేదు. ఫ్యాన్స్ చాలా ఈజీగానే గెస్ చేయగలరు. తనవైన ఒంపుసొంపులు అందాల ఆరబోతతో పిచ్చెక్కించేస్తున్న ఈ అమ్మడు.. టాలీవుడ్ లో తెలివైన గేమ్ ఆడుతోంది. వరుసగా తనవైపు వచ్చిన ఏ క్రేజీ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వచ్చింది వచ్చినట్టే చుట్టబెట్టేస్తోంది.

అల్లుడితో విభేదాలు.. మామతో సినిమా

Director-Goutham-Meenon-Movie-With-Rajini-Kanth-Andhra-Talkies
విభిన్న ప్రేమ కథ చిత్రాల దర్శకుడిగా పేరున్న గౌతమ్ మీనన్ చాలా గ్యాప్ తర్వాత ధనుష్ హీరోగా 'ఎన్నయ్ నోకి పాయుమ్ తోట' తెరకెక్కించాడు. కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. సినిమాను ఎట్టకేలకు ఈనెల 29న విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. సినిమా విడుదల వాయిదా పడటం మరియు ఇతర కారణాల వల్ల గౌతమ్ మీనన్ మరియు ధనుష్ ల మద్య విభేదాలు ఉన్నాయంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఒక వైపు ధనుష్ తో వివాదం అంటూ రాస్తున్న మీడియా సంస్థలు మరో వైపు రజినీకాంత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది అంటూ వార్తలు రాస్తున్నాయి. చాలా కాలంగా వీరిద్దరి కాంబోలో ఒక సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. అయిదు ఆరు సంవత్సరాల క్రితమే వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉన్నా కూడా ఏదో కారణం వల్ల సెట్ అవ్వలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వారిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది.

మలైకా డ్రెస్సు మహా చిలిపిది బాబూ..!

Sexy-Heroin-Malaika-Arora-Wardrobe-Malfunction-Andhra-Talkies
బాలీవుడ్ సినిమాల గురించి తెలిసిన వారికి మలైకా అరోరా పేరు తెలిసే ఉంటుంది.  ఇక తెలుగువారికి కూడా మలైకా పరిచయమే. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' లో కెవ్వు కేక పాటకు నర్తించి కెవ్వుకేక అనిపించింది.  ఈ లేటు వయసు భామకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.  బికినీ ఫోటోలను పోస్ట్ చేస్తూ..  కుర్ర బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.  తాజాగా ఈ భామ ఒక స్టోర్ లాంచ్ కు హాజరైంది.  అక్కడ జరిగిన ఒక సంఘటన వైరల్ గా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈమధ్య ముంబైలో ఒక స్టోర్ ను లాంచ్ చేశారు.  ఈ కార్యక్రమానికి మలైకా అరోరా.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. కరణ్ జోహార్.. అనన్య పాండే తదితరులు హాజరయ్యారు. ఎప్పటిలాగే మలైకా చాలా హాటుగా ఉండే డ్రెస్ లో కార్యక్రమానికి హాజరైంది. బెల్ బాటం స్టైల్ ప్యాంట్.. బ్లేజర్ ధరించింది. బ్లేజర్ కు బటన్స్ లేకుండా అందాల ప్రదర్శన చేస్తూ హాటు లేడీ తరహాలో కనిపించింది.  అయితే కొన్ని డ్రెస్సులు ధరించినప్పుడు అవి మన మాట వినవు.  వాటికి కూడా కొంత చిలిపిదనం ఉంటుంది. చిన్నపిల్లలకు నిక్కర్ జారిపోతూ ఉంటుంది కదా.. సరిగ్గా అలాంటిదే.  మలైకం టాప్ కొంచెం పక్కకు జరిగి 'కనిపించాల్సిన హాటు కంటే మరింత హాటు షో' గా మారింది. దీంతో ఆ అందాలను ఫోటోగ్రాఫర్లు హై ఎండ్ కెమెరాలతో బంధిస్తూ రెచ్చిపోయారు.  అనుకున్నదానికంటే డ్రెస్ డిస్కౌంట్ ఎక్కువగా ఉందని.. కెమెరాలు ఎగబడుతున్నాయని గ్రహించిన మలైకం మెల్లగా పక్కకు నడుచుకుంటూ వెళ్లి తన అనవసర డిస్కౌంట్ ను తెలివిగా తగ్గించింది.

రామ్ గోపాల్ వర్మ ఇంటర్నేషనల్ ఛాలెంజ్

Ram-Gopal-Varma-International-challenge-andhra-talkies
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని పెద్ద ఫైటర్ అవ్వాలనుకున్న ఆర్జీవీ కల నెరవేరలేదు. బ్రూస్లీ సినిమాలు చూసి కరాటే ప్రాక్టీస్ చేసి.. అంత పెద్ద మార్షల్ కింగ్ అవ్వాలనుకున్నా కుదరలేదు. బ్రూస్లీ అవ్వాలన్న తన డ్రీమ్ నెరవేరలేదని ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ అన్నారు. అది సరేకానీ.. తన ఫేవరెట్ మార్షల్ స్టార్ బ్రూస్ లీ కథతో సినిమా తీయాలన్న ఆర్జీవీ కల నెరవేరేది ఎప్పటికో చూడాలి.

అదంతా అటుంచితే.. ఇన్నాళ్టికి ఆర్జీవీకి- మార్షల్ ఆర్ట్స్ .. ఆర్జీవీకి బ్రూస్ లీకి  ఉన్న కనెక్షన్ తో ఓ ఇంటర్నేషనల్ సినిమా రాబోతోంది. `ఎంటర్ ది గర్ల్ డ్రాగన్` పేరుతో ఈ సినిమాని రెడీ చేస్తున్నాడు. ఇందులో లేడీ బ్రూస్లీ విన్యాసాల్ని చూపించబోతున్నాడు. టీజర్ ను బ్రూస్ లీ జయంతి కానుకగా ఈనెల 27 న 3:12 పీఎం రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే నెల డిసెంబర్ 13న ట్రైలర్ వదులుతాడట. అది కూడా ట్రైలర్ ని  బ్రూస్ లీ సొంత నగరం చైనా- ఫోషన్ సిటీలో రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సీనియర్ నటి రమ్యకృష్ణపై రకరకాల రూమర్లు..!

Speculations-on-About-Most-Powerfull-Heroin-Ramya-Krishna-movie-Offers-in-Telugu-Film-Industry-Andhra-Talkies
గత కొంతకాలంగా సీనియర్ నటి రమ్యకృష్ణపై రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ రేంజు అమాంతం మారిపోయింది. మోస్ట్ పవర్ ఫుల్ శివగామి పాత్రలో నటించాక తన ఇమేజ్ పదింతలైంది. అందుకు తగ్గట్టే వరుస అవకాశాలతో భారీగా ఆర్జిస్తోందని ప్రచారమవుతోంది. అయితే ఇదంతా నిజమే కానీ.. ప్రస్తుతం రమ్యకృష్ణ కెరీర్ పరంగా ఫలానా సినిమా చేస్తున్నారు? అన్న దానిపై స్పష్టమైన క్లారిటీ అయితే లేదు.

అప్పట్లో శివగామి పాత్రకు కొనసాగింపుగా ఫిక్షన్ కథతో తీస్తున్న సినిమాలో  నటిస్తున్నారని పోస్టర్లు రివీలయ్యాయి. ఆ సినిమా రిలీజ్ కి రాలేదింకా. ఈలోగానే రమ్యకృష్ణ నటించిన పలు తమిళ చిత్రాలు రిలీజై వెళ్లాయి. ఇప్పుడు టాలీవుడ్ లోనూ క్షణం తీరిక లేనంతగా వరుసగా సినిమాలకు కమిటవుతున్నారని ప్రచారమవుతోంది. పైగా తెలుగు ఫిలిం సర్కిల్స్ లో రమ్య రెగ్యులర్ గా ప్రత్యక్షమవుతుండడంతో చెన్నయ్ వదిలిన రమ్యకృష్ణ ఇక్కడ మరోసారి పూర్తిగా బిజీ అయిపోతోందంటూ ప్రచారం మొదలైంది.

మాజీ సీఎం మనవడితో ఓ రాత్రంతా గడిపా... శ్రీ రెడ్డి విసిరిన మరో సంచలనం...!!

Spending one night with the grandson of former CM ... Another sensation thrown by Sri Reddy
Spending one night with the grandson of former CM ... Another sensation thrown by Sri Reddy 
శ్రీరెడ్డి అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ ని కుదిపివేస్తున్న సంచలనం. ఆమె ఎపుడు ఎవరినిపై తన రాయి విసురుతుందో ఎవరికీ తెలియదు. దాంతో ఎవరికి వారు భయంగా చూస్తున్నారంతే. ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్ అనుకుంటున్న కాస్టింగ్ కౌచ్ ని చాలా పెద్ద ఎత్తున శ్రీరెడ్డి బయటపెడుతోంది. దాంతో సినీ ప్రముఖులు పలువురు భుజాలు తడుముకుంటున్నారు. శ్రీరెడ్డి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అనడంతో పెద్ద కుటుంబాలు సైతం నోరు విప్పలేకపోతున్నాయి.

తాజాగా నాచురల్ స్టార్ నాని మీద ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇపుడు కోలీవుడ్లొ ఓ సినీ ప్రముఖుడి మీద తన బాణాలను ఎక్కుపెట్టింది. ఆ సినీ ప్రముఖుడు ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి స్వయంగా మనవడు, ఇపుడు డీఎంకే అధినేత స్టాలిన్ కి కొడుకు, డీఎంకే యువ విభాగానికి అధినేత.

కమెడియన్స్ తో సినిమా నిర్మించనున్న హీరో

Tollywood-Hero-Sundeep-Kishan-to-Produce-a-Movie-with-Comedians-Andhra-Talkies
ప్రస్తుతం కామెడీ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన రావడంతో ఇప్పుడు కమెడియన్స్ ను పెట్టి సినిమాలు చేసే పనిలో ఉన్నారు నిర్మాతలు. ఈ లిస్టులోకి హీరో సందీప్ కిషన్ కూడా చేరబోతున్నాడు. అవును ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సందీప్ ఇటివలే 'నిను వీడను నీడను నేనే' సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం నిర్మాతగా ఓ కామెడీ సినిమాను నిర్మించే పనిలో ఉన్నాడట ఈ కుర్ర హీరో. ఇటివలే మీడియాతో ఆ విషయాన్ని పంచుకున్నాడు కూడా. రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి లతో ఓ కామెడీ సినిమా ప్లాన్ చేస్తున్నానని ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని అన్నాడు.

ఇక ప్రస్థానం హిందీలో ఫెయిల్ అవ్వడంపై కూడా రెస్పాన్స్ అయ్యాడు. ఎప్పుడో చూసేసిన కథ అక్కడ వారికి కొత్తగా ఎలా అనిపిస్తుంది. తెలుగులో మనకి అది కొత్త కథతో వచ్చిన మంచి సినిమా కానీ ఈ గ్యాప్ లో అక్కడ ఇలాంటి కథలతో సినిమాలు వచ్చే ఉంటాయి కదా. సో అదే మెయిన్ రీజన్ అయి ఉండొచ్చని తెలిపాడు.

సైరా ను మించిన సూపర్ స్టార్ బిజినెస్?

Is-Tollywood-Movie-Sarileru-Neekevvaru-Crossed-Syeraa-Business-In-Hindi-Andhra-Talkies
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాదిన ఇతర భాషల్లో సైరా మంచి బిజినెస్ చేసింది. కానీ హిందీ లో మాత్రం ప్రీ బిజినెస్ పరంగా అంచనాలు  అందుకో లేకపోయింది. లెజెండరీ అమితాబచ్చన్ కీలక పాత్ర పోషించిన  మార్కెట్ పరంగా అంతగా కలిసి రాలేదు. బాహుబలి రేంజు బిజినెస్ ఆశిస్తే .. అసలు సైరా ను అక్కడ పంపిణీ వర్గాలు లైట్ తీస్కోవడం ఆశ్చర్య పరిచింది. ఒక తెలుగు స్వాతంత్య్ర సమర యోధుడి కథను ఉత్తరాది జనం ఆదరించరని హిందీ మార్కెట్ వర్గాలు భావించాయి. ఇక ప్రచారం పరంగానూ సైరా టీమ్ వెనకబడడం .. పబ్లిసిటీ సమయంలో వరుణుడు వెంటాడడం అన్నీ మైనస్ అయ్యాయి.

అయినా సైరా హిందీ రైట్స్ 9 కోట్లకు అమ్ముడు పోయాయని ఫర్హాన్-తడాని బృందం తో కొణిదెల టీమ్ భాగస్వామ్య డీల్ కుదుర్చుకున్నారని ప్రచారమైంది. ఇప్పటివరకూ ఈ డీల్ చిరు కెరీర్ లోనే ది బెస్ట్. హిందీ రైట్స్ పరంగా రికార్డు అనే చెప్పాలి. ఇప్పటివరకూ నాన్ బాహుబలి కేటగిరీలో ఏ తెలుగు హీరో సినిమా ఇన్ని కోట్లకు బాలీవుడ్ లో అమ్మడు పోయింది లేదు. ఆ రకంగా చిరు ఇమేజ్ కి తిరుగు లేదనే చెప్పాలి.

వివాదాస్పద నటి పాత్రలో శ్రీరెడ్డి!

Sexy-Actor-Sree-Reddy-In-Shocking-Role-Andhra-Talkies
టాలీవుడ్ నటి శ్రీరెడ్డి పేరు తెలియని తెలుగువారు దాదాపుగా ఉండకపోవచ్చు.  క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేసి మీడియా దృష్టిని.. ప్రజల ఆకర్షించిన శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ వద్ద అర్థనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.  అయితే అప్పటి నుంచి తెలుగులో శ్రీరెడ్డికి అవకాశాలు రాలేదు. ఒకరిద్దరు అవకాశాలు ఇస్తామని పబ్లిక్ గా ప్రకటించారు కానీ వాటిసంగతి ఏమైందో తెలియదు.

తాజాగా శ్రీరెడ్డికి 'క్లైమాక్స్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో ఒక అవకాశం దక్కింది. తెలుగు రాజకీయాలపై ఒక సెటైర్ లాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీరెడ్డి ఒక వివాదాస్పద నటి పాత్రలో నటిస్తోందని సమాచారం.  ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్.. పృథ్విరాజ్.. శివశంకర్ మాస్టర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  రీసెంట్ గా 'క్లైమాక్స్' టీమ్ కొన్ని స్టిల్స్ విడుదల చేసింది.  ఈ ఫోటోలలో శ్రీరెడ్డి ఎప్పటిలాగే గ్లామరస్ గా కనిపిస్తోంది.  ఈ స్టిల్ లో 30 ఇయర్స్ పృథ్వి ఒక స్వామీజీ గెటప్ లో ఉన్నారు.   రాజేంద్ర ప్రసాద్ పొడవాటి గడ్డం పెంచి మోడరన్ గెటప్ లో ఉన్నారు.

ఆ కబురు తర్వాత

Tollywood-Heroin-Kalyani-Priyadarshan-Andhra-Talkies
నట వారసురాలు కళ్యాణి ప్రియదర్శన్ ని చూస్తే చాలా అమాయకంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈమధ్య ఆమె పెళ్లి కబుర్లూ అదే పనిగా వినపడుతున్నాయి. ఈ రెండు విషయాలపైనా మరోసారి క్లారిటీ ఇచ్చుకున్నది.

"నేను తెరపై అమాయకంగా కనిపిస్తానేమో కాని, బయట అలా ఉండను. ఇక పెళ్లి కబురంటారా? నేను ఓ వ్యక్తిని ఇష్టపడుతున్న మాట నిజం. తననే పెళ్లాడతా. అయితే దానికి ఇంకా సమయం ఉంది. ఎవరో కూడా అప్పుడే చెప్తా" అంటున్నది.

నేను వైవిధ్యానికే ఓటు వేస్తా | I vote for diversity :

Regina_Cassandra-I vote for diversity
ఫామ్ లోకి వచ్చినా రాకపోయినా విభిన్నమయిన పాత్రల్ని ఎంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటుంది రేజీనా కేసెండ్ర. అదే విషయాన్ని అడిగితే నిజాయితీగా సమాధానమిచ్చింది. గ్లామర్ పాత్రలనేవి ఎప్పుడైనా, ఏభాషలోనైనా చెయ్యవచ్చు. కానీ భిన్నమైన అవకాశాలు ఎప్పుడో కానీ రావు.

"ఎవరు"లో నెగెటివ్ రోల్, "ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా" లో లెస్బియన్ పాత్ర అందుకు ఉదాహరణలు. ఇటువంటి వైవిధ్యం గల పాత్రలు చేయాలన్నది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం" అంటున్నది.

సల్మాన్ ఖాన్ సలహాలు తీసుకోకుండా ఉండలేను!

సినీరంగంలో తనకు సలహాలు ఇచ్చేది, తన గురించి ఆలోచించేది సల్మాన్ ఖానే అంటూ మరోమారు నొక్కి,నొక్కి చెప్పింది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. "ఆయన్ను సలహాలు అడగడానికి అస్సలు ఏమాత్రం ఇబ్బందిపదను. అలాగే అతను కూడా ఏదో చెప్పానులే అన్నట్లు కాకుండా చక్కగా ఉపయోగపడే సలహాలు ఇస్తుంటారు" అంటున్న జాక్వెలిన్ తన నటన కంటే డ్యాన్సే ప్రేక్షకులకు బాగా నచ్చినట్లు ఉంది" అంటూ నవ్వులు విసిరింది..

నిర్మాత అవతారమెత్తుతున్న టాలీవుడ్ హీరోలు

Heros-Becoming-tollywood-Producers-Andhra-Talkies
గతంలో హీరోలు వేరేగా నిర్మాతలు వేరేగా ఉండేవారు. అయితే ఎన్టీఆర్.. ఎఎన్నార్.. కృష్ణ లాంటి కొందరు పెద్ద స్టార్ హీరోలు నిర్మాణ రంగంలోకి ప్రవేశించి సూపర్ హిట్ సినిమాలతో తమ సత్తా చాటారు. మురళిమోహన్.. మోహన్ బాబు లాంటి సీనియర్లు కూడా చాలాకాలం నిర్మాతలుగా కొనసాగారు. ఈ జెనరేషన్లో నిర్మాతలుగా మారిన హీరోలు చాలామందే ఉన్నారు.

ఇప్పటికీ హీరోలుగా నటిస్తున్న సీనియర్ హీరోలలో చూసుకుంటే అక్కినేని నాగార్జున చాలా ఏళ్ళ నుంచి సినిమాలు నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన నాగార్జున ఇప్పటికీ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువమంది సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల లో నాగ్ ఒకరు. 'మనం' లాంటి క్లాసిక్ ఫిలిమ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.  నందమూరి బాలకృష్ణ ఈమధ్యే నిర్మాతగా మారి ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించారు. అయితే ఆయనకు విజయం దక్కలేదు.

RRR కి బాహుబలి తరహాలోక్రేజ్ రావడం లేదే

Rajamouli-movie-RRR-Not-Getting-Craze-Like-Bahubali-Andhra-Talkies
రాజమౌళి సినిమాల విజయంలో మిగతా అన్ని అంశాలతో పాటుగా మార్కెటింగ్ కూడా కీలకపాత్ర పోషిస్తుందని పలువురు ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి బాహుబలి లో బ్లాక్ బస్టర్ అయ్యే కంటెంట్ ఉన్నమాట నిజమే కానీ దాంతో  పాటుగా అసాధారణమైన మార్కెటింగ్ వ్యూహం తోడైంది కాబట్టి ఆ రేంజ్ విజయం లభించిందని వారు చెప్తుంటారు. సినిమాలో ఉన్న ఎలాంటి అంశాలను ప్రేక్షకులకు ముందే చెప్పాలి.. ఏవి సస్పెన్స్ గా మెయింటెయిన్ చెయ్యాలి అనే విషయంలో రాజమౌళికి సాటిలేదని అంటుంటారు. ఈ విషయంలో తడబడడం వల్లే చాలామంది దర్శకులు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతుంటారు.

అయితే రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'RRR' చిత్రం విషయంలో మాత్రం ప్రస్తుతం అనుకున్నంత బజ్ లేదని అంటున్నారు. 'బాహుబలి' సినిమా ప్రకటించిన నాటి నుంచే ఆ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం కనిపించింది. ఆ సినిమా గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండేది. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో రెండవ భాగంపై దేశవ్యాప్తంగా అసాధారణమైన ఆసక్తి వ్యక్తం అయింది.  అయితే ఇప్పుడు 'RRR' విషయంలో జనాల్లో క్యూరియాసిటీ ఉంది కానీ 'బాహుబలి' రేంజ్ హైప్ మాత్రం కనిపించడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

చరణ్ ను చంపేసి ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటుందట!

Sexy-Heroin-Kajal-Agarwal-Wants-to-Marry-Prabhas-Andhra-Talkies
ఈమద్య కాలంలో మంచు లక్ష్మీ టాక్ షో గురించి మీడియాలో ప్రముఖంగా వింటూ ఉన్నాం. ఆమె సెలబ్రెటీల నుండి బోల్డ్ సమాధానాలను రాబడుతూ వారి సీక్రెట్ లను కెమెరా ముందు ఆవిష్కరిస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్స్ ను తన షో లో ఇంటర్వ్యూ చేసిన ఈ అమ్మడు ఇటీవల సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను కాజల్ నుండి మంచు లక్ష్మి రాబట్టడంలో సక్సెస్ అయ్యింది.

నా కెరీర్ లో ఇష్టమైన హీరో రానా. ఆయనతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతాను. రానాతో పని చేయడం చాలా ఫన్నీగా ఉంటుంది అలాగే చాలా కష్టంగా కూడా ఉంటుంది. అయితే రానా నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అందుకే ఆయన ఇష్టమైన హీరో అంది. నేను ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా నాతో పాటు ఒక చిన్న దేవుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం నాతో ఉంటే ఇంట్లో ఉన్నట్లుగానే అనిపిస్తుంది.

దాసరి స్థానం కోసం చిరు ప్రయత్నాలా? ఏకి పారేసిన సినీ పెద్దమనిషి

Director-Tammareddy-Bharadwaj-Comments-on-Chiru-and-Jagan-Meeting-Andhra-Talkies.jpg
సినిమా రంగానికి చెందిన వ్యక్తి.. తన మనసుకు ఏమనిపిస్తే దాని గురించి చెప్పేయటం చాలా అరుదు. కనిపించని హద్దులెన్నో సినిమా రంగంలో ఉంటాయి. అలాంటివేళ నిష్ఠూరంగా ఉండే నిజాన్ని ధైర్యంగా చెప్పేయటం.. తర్వాత ఎదురయ్యే ఇబ్బందులకు సై అనటం చాలామంది చేయలేరు. ఈ కారణంతోనే మనకెందుకు వచ్చిందన్నట్లుగా రియల్ లైఫ్ లోనూ రీల్ మాటలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు.

ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. యూట్యూబ్ హడావుడి ప్రారంభంలోనే నా ఆలోచన పేరుతో అన్ని అంశాల మీద తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పే సినీ పెద్దమనిషి తమ్మారెడ్డి భరద్వాజ. తాజాగా ఆయనో ఆసక్తికర టాపిక్ మీద మాట్లాడారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు.. ఉప రాష్ట్రపతి వెంకయ్య వద్దకెళ్లి తాను నటించిన సైరా గురించి చెప్పటం తెలిసిందే. ఈ సందర్భంగా పలు రూమర్లు వినిపించాయి.

బిగ్ బీని వెంటాడుతోన్న క్రియేటివ్ డైరెక్టర్!

Tollywood-Creative-director-chasing-Big-Bee-Amithab-Andhra-Talkies
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సక్సెస్ చవి చూసి కొన్ని సంవత్సరాలైంది.  ఎంతో ఎఫర్ట్ పెట్టి చేసిన 'గోవిందుడు అందరివాడేలే'- 'నక్షత్రం' ఫలితాలు తీవ్ర నిరుత్సాహాన్నే మిగిల్చాయి. రెండేళ్ల నుంచి ఖాళీగానే ఉన్నాడు. రాసిన  స్క్రిప్టులేవీ వర్కవుట్ కాలేదు. దానికి తోడు బాలయ్య 'రైతు' సినిమా చేస్తానని మాటిచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో పట్టాలెక్కే అవకాశం లేదు. అందుకే ఇక లాభం లేదనుకున్న కృష్ణవంశీ తన క్రియేటివిటీని పక్కన బెట్టి రీమేక్ వైపు దృష్టి సారించిన సంగతి తెలిసిందే. మరాఠీ క్లాసిక్ హిట్టు 'నట సామ్రాట్' పై ఆయన కన్ను పడింది.

'రంగమార్తాండ' టైటిల్ తో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు రీమేక్ రూపంలో  తీసుకొస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్- రమ్యకృష్ణ జంటగా నటిస్తున్నారు. టైటిల్ లోగోను కూడా ఇటీవలే రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేసారు. ఇలాంటి జోనర్ ను రీమేక్ రూపంలో ఇప్పటివరకూ  ఏ టాలీవుడ్ డైరెక్టర్  టచ్  చేయలేదు. దీంతో కాస్త సాహసమే అయినప్పటికీ క్రియేటివ్ డైరెక్టర్ బుర్రకు పదునుపెట్టి రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నేషనల్  లెవల్లో గుర్తింపు తీసుకొచ్చే ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు సమాచారం. దీనిలో భాగంగా బాలీవుడ్  మెగాస్టార్ అమితాబ్ ని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇందులోనూ  బిగ్ బీకి  గురువు పాత్రకే ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది.

ఇదీ సంగతి! భిన్న ధృవాలు.. కలుసుకోవు!!

Hero-Naga-Chaitanya-Movie-with-Director-Dil-Raju-Andhra-Talkies
అక్కినేని నాగచైతన్య - దిల్ రాజు కాంబినేషన్ అనగానే జోష్ సినిమా గుర్తుకు వస్తుంది. చైతన్యను వెండితెరకు పరిచయం చేసిన నిర్మాతగా దిల్ రాజు పేరు అభిమానులకు స్ఫురణకు వస్తుంది. అయితే చైతూ కెరీర్ ప్రారంభమై ఏడెనిమిదేళ్లు పూర్తవుతున్నా ఇంకా తిరిగి ఆ జోడీ రిపీట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగించకుండా ఉండదు. పరిశ్రమ అగ్ర నిర్మాతతో చైతూ తిరిగి పని చేయకపోవడానికి కారణమేంటో అర్థం కాదు.

అయితే జోష్ తర్వాత తిరిగి ఆ ఇద్దరూ కలిసి పని చేసేందుకు చాలానే ప్రయత్నించినా కానీ ఏదీ కలిసి రాలేదు. `మజిలి` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చైతన్యతో దిల్ రాజు ఓ మూవీ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమాకి అన్నీ అడ్డంకులే. రష్మికను కథానాయికగా నటించమని సంప్రదిస్తే భారీ పారితోషికం డిమాండ్ చేసింది. అలాగే స్క్రిప్టులో సెకండాఫ్ మార్చాల్సిందిగా చైతన్య కోరారు. ఈప్రాసెస్ లోనే నాగచైతన్యకు శేఖర్ కమ్ముల వినిపించిన స్క్రిప్టు నచ్చి ఓకే చెప్పేశాడు. దీంతో ఇక దిల్ రాజు చైతన్యతో ప్రాజెక్టును వాయిదా వేయాల్సి వచ్చింది.

సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత రివ్యూలు రాయాలట!

Tollywood-Actor-Karthik-Raju-Speech-at-Operation-Gold-Fish-Successmeet-Andhra-Talkies
ఆది హీరోగా శషా చెట్రి హీరోయిన్ గా కార్తీక్ రాజు.. అబ్బూరి రవి.. పార్వతీశం.. నిత్యా నరేష్.. కృష్ణుడు ముఖ్య పాత్రల్లో నటించిన 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. రివ్యూలు కూడా మిక్స్ డ్ టాక్ తో వచ్చాయి. సినిమా విడుదలైన తర్వాత యూనిట్ సభ్యులు ప్రమోషనల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మరియు టెక్నీషియన్స్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అబ్బూరి రవి మాట్లాడుతూ అర్జున్ పండిట్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్న ఆదికి థ్యాంక్స్. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా కూడా ఆయన ఒక మంచి కథ అనే ఉద్దేశ్యంతో ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకోవడం అభినందనీయం అన్నాడు. సినిమాను తీయడానికి దర్శకుడు సాయి కిరణ్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఒక మంచి కథను తయారు చేసుకుని దాని కోసం చాలా కష్టపడ్డ దర్శకుడు సాయి కిరణ్ గారికి అభినందనలు అన్నాడు.

డిజిటల్ కట్టడి సీరియస్ గా తీసుకున్నట్టేనా

Tollywood-Producers-on-About-Digital-Streaming-Rights--Andhra-Talkies
నిర్మాతలకు అతి పెద్ద ఆదాయ వనరుగా మారిన డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కుల వ్యవహారం గురించి పరిశ్రమ సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలే అల వైకుంఠపురము పోస్టర్లో మీరు ఈ సినిమాను అమెజాన్ లో నెట్ ఫ్లిక్స్ లో చూడలేరు అని ప్రత్యేకంగా ప్రస్తావించడం పెద్ద చర్చకే దారి తీసింది. కేవలం నెల రోజుల నిడివిలో అమెజాన్ లాంటి సంస్థలు కొత్త సినిమాలు ఆన్ లైన్ లో పెట్టేయడంతో యావరేజ్ టాక్ వచ్చిన వాటిని థియేటర్లలో ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఫలితంగా నిర్మాతకు ఎలా ఉన్నా ఎగ్జిబిటర్లు బాగా దెబ్బ తింటున్నారు. దీనికి పరిష్కారం అగ్రిమెంట్ టైం లోనే నిడివి గురించి స్పష్టంగా రాసుకోవడం. ఇకపై శాటిలైట్ టెలికాస్ట్ తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ కు అనుమతి ఇవ్వాలని నిర్మాతలు డిసైడ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ అమలులో ఎంతమేరకు మన ప్రొడ్యూసర్లు నిజాయితీగా ఉంటారన్నది వేచి చూడాలి. మొన్న ఏప్రిల్ నుంచే కొత్త సినిమాలు 60 రోజుల తర్వాత మాత్రమే డిజిటల్ లో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

'సైరా' కు జగన్ 'మెగా' ట్రీట్ ఇచ్చేసినట్టే!

Megastar-Chiranjeevi-meets-ap-cm-jagan-Andhra-Talkies
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్రీట్ నిజంగానే అదిరిందని చెప్పాలి. గడచిన వారం రోజులుగా జగన్ చిరుల భేటీపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. జగన్ వద్దకు చిరు వెళ్లడానికి గల కారణాలు తెలిసినా కూడా... ఇంకా ఏదో ఉందంటూ ఆసక్తికర కథనాలు వినిపించాయి. అయితే అటు జగన్ గానీ ఇటు చిరు గానీ ఈ కథనాలను ఎంతమాత్రం పట్టించుకోకుండానే... ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ కంటే కాస్తంత లేట్ అయినా కూడా కలిశారు. ఒకరినొకరు అభినందించుకున్నారు. ఒకరినొకరు సన్మానించుకున్నారు. అంతేనా... అమరావతి పరిధిలోని తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మెగాస్టార్ కు జగన్ మరిచిపోలేని ట్రీట్ అయితే ఇచ్చేశారన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తనను కలిసేందుకు సతీసమేతంగా వచ్చిన చిరుకు తన సతీమణి వైఎస్ బారతితో కలిసి ఘన స్వాగతం పలికిన జగన్... మెగా దంపతులను తమ ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ తర్వాత జగన్ ను చిరు దుశ్సాలువాతో సత్కరించి బొకేను అందించగా... జగన్ కూడా అదే స్థాయిలో చిరుకు సత్కారం చేశారు. ఆ తర్వాత చాలా సేపు మాట్లాడుకున్న జగన్ - చిరు... జగన్ ఏర్పాటు చేసిన విందును ఇద్దరూ కలిసి స్వీకరించినట్లుగా సమాచారం. ఆ తర్వాత కూడా జగన్ - చిరులిద్దరూ చాలాసేపే మాట్లాడుకున్నా... వారి మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలేమిటన్న విషయం బయటకు రాకున్నా... తన తాజా చిత్రం సైరాను చూడాలని జగన్ ను చిరు కోరినట్టుగా సమాచారం. చిరు అభ్యర్థనకు జగన్ కూడా సానుకూలంగానే స్పందించినట్లుగా సమాచారం.

వెయిట్ లాస్ కు సంబంధించిన ఈ యాడ్ లో ప్రచారకర్తలుగా వ్యవహరించిన రాశి.. రంభలకు షాకిచ్చిన కోర్టు

Consumer-Court-Notices-To-Tollywood-Actress-Rashi-and-Ramba-For-Ads-Andhra-Talkies
టాలీవుడ్ లో ఒకప్పుడు తమ అందచందాలతో.. నటనతో ఆకట్టుకోవటమే కాదు.. ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపిన హాట్ భామలు రాశి.. రంభలకు తాజాగా కోర్టు షాకిచ్చింది. దీనికి కారణం.. వారిద్దరూ ఒక సంస్థకు చేసిన వాణిజ్య ప్రకటనగా చెప్పాలి. కలర్స్ అనే సంస్థలు ఈ నటీమణులు ఇద్దరూ నటించారు.

వెయిట్ లాస్ కు సంబంధించిన ఈ యాడ్ లో ప్రచారకర్తలుగా వ్యవహరించిన రాశి.. రంభలు చెప్పిన మాటలకు.. ఆ కంపెనీ సేవల్లో అంతరంపై తాను మోసపోయినట్లుగా ఒక వినియోగదారుడు విజయవాడ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. కలర్స్ సంస్థ ప్రకటనను వెంటనే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వాణిజ్య ప్రకటనతో మోసం చేయొద్దని హెచ్చరించటంతో పాటు జరిమానాను విధించారు. కలర్స్ సంస్థకు చెందిన ప్రకటనను ఎవరూ ప్రసారం చేయొద్దని.. వాటిని వెంటనే నిలిపివేయాలని కోర్టు పేర్కొంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరా: ఇతర భాషల్లో ఆదరిస్తారా?

Tollywood-Sye-Raa-Movie-in-Other-Languages-Andhra-Talkies
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మాణంతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం.  బడ్జెట్ కరెక్ట్ గా ఎంత.. ఎన్ని వందల కోట్లు అనే విషయం పక్కన పెడితే.. తెలుగులో మాత్రమే ఈ సినిమా సూపర్ హిట్ అయితే పెట్టుబడి మొత్తం రికవర్ కాదు అనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇతర భాషల్లో 'సైరా' పరిస్థితి ఏంటి?

తెలుగు ప్రేక్షకుల్లో మెగాస్టార్ కు తిరుగులేదు. ఇప్పటికీ చిరు చాలా పెద్ద స్టార్.  ఇక మెగా ఫ్యాన్స్ అండ ఎలాగూ ఉంటుంది.  సాధారణ ప్రేక్షకుల్లో కూడా చిరుపై ఎప్పుడూ అభిమానం ఉంటుంది.  ఆ విషయం చిరు రీ ఎంట్రీ సినిమాతోనే ప్రూవ్ అయింది. ఇక ఈ సినిమాలో చిరుతో పాటుగా అదనంగా ఎన్నో ఆకర్షణీయమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్స్ కు దిగులు ఉండదు.  ఇక సినిమాకు హిట్ టాక్ వస్తే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది.  అయితే మిగతా భాషల్లో మాత్రం ఇలాంటి పరిస్థితిని ఎంతమాత్రం ఆశించలేం.

గారాల చెల్లిని ఫిలిం స్కూల్ కి పంపిన అక్క జాన్వీ కపూర్

Sridevi-Janhvi-Kapoor-sets-sibling-goals-with-an-endearing-goodbye-post-for-Khushi-Kapoor-Andhra-Talkies.jpg
అక్క చెల్లెళ్ల అనుబంధం గురించి చెప్పాలంటే.. బాలీవుడ్ లో జాన్వీ - ఖుషీ కపూర్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళుతుంటారు. ఫ్యామిలీ ఫంక్షన్లకే కాదు.. డిన్నర్ పార్టీలు.. నైట్ పార్టీలకు కలిసి వెళ్లడం అలవాటు. చాలాసార్లు నగరంలో కలిసి షికార్లు చేస్తూ కెమెరాల కంటికి చిక్కారు. అలాగే ఇన్ స్టాగ్రమ్ లోనూ రెగ్యులర్ గా తమ బాండింగ్ కి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేస్తూ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తుంటారు.

అయితే ఆ సిస్టర్స్ మధ్య ఊహించని ఎడబాటు తప్పడం లేదు. ఇన్నాళ్లు జాన్వీ కపూర్ కెరీర్ గురించే ముచ్చటించుకున్న అభిమానులు ఇకపై ఖుషీ కపూర్ సినీ ఎంట్రీ గురించి ముచ్చటించుకునే టైమ్ వచ్చేసింది. అందుకే ఖుషీ నట శిక్షణ కోసం న్యూయార్క్ బయల్దేరింది. అయితే తనకు గుడ్ బాయ్ చెప్పడానికి జాన్వీ విమానాశ్రయానికి వెళ్లలేకపోయింది. అందువల్ల గారాల చెల్లి ఖుషీతో తాను కలిసి ఉన్నప్పటి ఓ ఫోటోని షేర్ చేసిన స్వీట్ మెసేజ్ ని పెట్టింది. ఆ ఫోటోలో అక్క చెల్లెళ్ల మధ్య  లవ్ లీ బాండింగ్ ఆకట్టుకుంటోంది. జాన్వీ తన చిట్టి చెల్లెలు నుదిటిపై ముద్దాడుతోంది. ఆ ఫోటోకి క్యాప్షన్ అదిరిపోయింది.

300 కోట్ల సాహో సినిమాలో ఇలాంటి పాటలా?

No-Buzz-To-Prabhas-Movie-Saaho-Songs-Andhra-Talkies
సాహో మొత్తానికి స్క్రీన్ పైకి వచ్చేసింది. డివైడ్ టాక్ ఖంగారు పెడుతున్నా మూడు రోజులకు అడ్వాన్స్ బుకింగ్ దాదాపుగా పూర్తయ్యింది కాబట్టి సోమవారం నుంచి ఎలాంటి రన్ ఉంటుందనే దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంది. ఇలాంటి రిపోర్ట్ రావడానికి సాహోలో ప్రతికూలాంశాలు చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా సంగీతం గురించిన నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. 300 కోట్ల బడ్జెట్ సినిమాకు సరైన రీతిలో సంగీత దర్శకులను సెట్ చేసుకోకపోవడం ఎంత ఖరీదైన తప్పో ఇవాళ అర్థమవుతోంది.

ఉన్న నాలుగు పాటలూ ఎవరికీ కనెక్ట్ కాలేక కేవలం విజువల్స్ కారణంగా మాత్రమే చూడబుద్ది అవుతున్నాయంటే మ్యూజిక్ విషయంలో సాహో చేసిన బ్లండర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో ట్యూన్ ఒక్కో సంగీత దర్శకుడు కంపోజ్ చేయడం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం పక్కరాష్ట్రం నుంచి జిబ్రాన్ ను ప్రత్యేకంగా తీసుకోవడం ఇవేవి అంతగా ప్లస్ కాలేకపోయాయి. ఏ ట్యూనూ పది కాలాల పాటు గుర్తుపెట్టుకునేలా లేకపోవడం సాహో మ్యూజిక్ లోని అతి పెద్ద ట్రాజెడీ.

ప్రభాస్ కు మళ్లీ జక్కన్న సెంటిమెంట్ దెబ్బ పడింది

Saho-hero-Prabhas-Continuous-Rajamouli-Sentiment-Andhra-Talkies
ప్రభాస్ 'సాహో' చిత్రం భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన విషయం తెల్సిందే. విడుదలైన ప్రతి చోట కూడా నెగటివ్ టాక్ నే మూట కట్టుకుంది. 350 కోట్ల బడ్జెట్ అంటూ భారీగా ప్రచారం చేయడంతో సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరాయి. మరో బాహుబలి ఖాయమని అంతా భావించారు. కాని టాక్ బ్యాడ్ గా వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఏ హీరో అయినా కెరీర్ బిగ్గెస్ట్ సక్సెస్ దక్కించుకోవడం ఆ తర్వాత అట్టర్ ఫ్లాప్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.

ఎన్టీఆర్.. నితిన్.. రవితేజ.. ప్రభాస్.. రామ్ చరణ్... సునీల్ ఇలా ప్రతి ఒక్కరు కూడా రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ లు చవిచూసిన వారే. ప్రభాస్ కు ఛత్రపతి చిత్రం తర్వాత చాలా కాలం వరకు సరైన సక్సెస్ రాలేదు. మళ్లీ ఇప్పుడు 'బాహుబలి' రెండు పార్ట్ లు చేసిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన 'సాహో' చిత్రం కూడా నిరాశ పర్చింది. రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలనుకున్న ప్రభాస్ కు సాధ్య పడలేదు.

యంగ్ టైగర్ జోడి దొరికిందా

Is-She-NTR-Love-Interest-In-RRR-Andhra-Talkies
టాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలై ఆరు నెలలు దాటినా ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ కి జోడి  సెట్ కాకపోవడం అభిమానులను టెన్షన్ లో పెడుతూ వచ్చింది.ప్రకటించినప్పుడు ఉన్న డైసీ ఎడ్గార్ జోన్స్ తర్వాత హ్యాండ్ ఇవ్వడంతో కథ మళ్ళి మొదటికి వచ్చింది. కథ ప్రకారం జూనియర్ పోషిస్తున్న పాత్ర బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించేలా ఉండటంతో దాన్ని మార్చే అవకాశం లేక తగిన బ్యూటీ కోసం రాజమౌళి వేట సాగిస్తూ వచ్చాడు.

ఫైనల్ గా హాలీవుడ్ నటి ఏమ్మా రాబర్ట్స్ దగ్గర బాల్ ఆగిందని కొద్దిరోజుల క్రితమే లీక్స్ వచ్చాయి. కాని అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. కాని అంతర్గత సమాచారం మేరకు పైకి ఇంకా చెప్పకపోయినా ఏమ్మా రాబర్ట్స్ ఫిక్స్ అయినట్టు తెలిసింది. త్వరలోనే సెట్ లో జాయిన్ అవుతుందని ఆలోగా చిన్న ప్రెస్ మీట్ లాంటిది పెట్టి కొన్ని అప్ డేట్స్ తో పాటు ఏమ్మా రాబర్ట్స్ కు సంబంధించిన ప్రకటన ఇవ్వొచ్చని తెలిసింది.

ఫోటో స్టొరీ: సెగలు రేపుతున్న శ్రీలంక బ్యూటీ

Hitest-Heroin-Jacqueline-Fernandez-Glamorous-Still-Andhra-Talkies
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెలియని హిందీ సినిమా ప్రియులు దాదాపుగా ఉండరు. ఇక హిందీ సినిమాలే చూడని తెలుగు ప్రేక్షకులకు జాక్వెలిన్ పేరు త్వరలోనే  తెలిసిపోతుంది. ఎందుకంటే సాహో లో 'బ్యాడ్ బాయ్' పాటకు ప్రభాస్ తో కలిసి స్టెప్పులు వేసింది.  బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్. ఇన్స్టా గ్రామ్ లో జాక్వెలిన్ కు 31.4  మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. హాట్ ఫోటోలతో వారిని రెగ్యులర్ గా థ్రిల్ చేయడం జాక్వెలిన్ హాబీ.

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ హాటు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటుంది.  తాజాగా జాక్వెలిన్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ స్టిల్ 'సాహో' బ్యాడ్ బాయ్ పాట లోనిదని వెల్లడించింది.  ఈ ఫోటోకు "ప్రభాస్ తో నా మొదటి తెలుగు పాట #బ్యాడ్ బాయ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ పాట చిత్రీకరణ జరిపిన ప్రదేశం అద్భుతంగా ఉంది. ఆ లొకేషన్ కు మించి అన్నట్టుగా జాక్వెలిన్ తన మోడరన్ డ్రెస్ తో చూపరుల మతి పోగొడుతోంది.  వైట్ టాప్.. పైన జిగేల్ మనే సిల్వర్ కాయిన్స్ డిజైన్.. నానో మీటర్ సైజ్ లో ఉండే డెనిమ్ షార్ట్ తో ఒక సెక్సీ పోజులో అలా పడుకుంది.  ఇయర్ రింగ్స్.. కాళ్ళకు కడియాలు.. చేతికి వాచ్.. ఇలా అన్ని యాక్సెసరీస్ జాక్వెలిన్ డ్రెస్ కు పర్ఫెక్ట్ గా సూటయ్యాయి. ఫ్లాట్ యాబ్స్.. కాళ్ళ అందాలు చూస్తే.. లోకల్ బ్యూటీలకు ఇంటర్నేషనల్ బ్యూటీలకు ఉండే తేడా ఇదే కదా అనిపిస్తుంది.

రాములమ్మ రెమ్యునరేషన్ ఎంత ?

Popular-Heroin-Vijayashanthi-Remuneration-For-Sarileru-Neekevvaru-Movie-Andhra-Talkies
హీరోయిన్ గా సెలవు తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించాక 13 ఏళ్ళు గ్యాప్ తీసుకున్న విజయశాంతి నిన్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో అడుగు పెట్టి మళ్ళీ తన అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. కనిపించీ కనిపించకుండా దర్శకుడు అనిల్ రావిపూడి తన లుక్ ని షేర్ చేయడం ఇప్పటికే వైరల్ అయ్యింది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలంటే ఒకరిద్దరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుని రికార్డు సృష్టించిన విజయశాంతి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుకు ఎంత తీసుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

సినిమా సర్కిల్స్ లో పిఆర్ ఓ గ్రూప్స్ మధ్య జరుగుతున్న చర్చల ప్రకారం ఇందులో పాత్రకు విజయశాంతి సుమారుగా రెండు నుంచి నాలుగు కోట్ల రూపాయలు మధ్య తీసుకుంటున్నారట. ఇది షాకింగ్ ఫిగరే. మాంచి డిమాండ్ ఉన్న గ్లామర్ హీరోయిన్లకె మహా అయితే రెండు లేదా రెండున్నర ముట్టజెబుతున్న తరుణంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఇంత ఆఫర్ చేయడం షాకే  కాని ఇవన్ని గాసిప్స్ రూపంలో చక్కర్లు కొడుతున్నవే.

జాతీయ అవార్డ్ వెనక అంత లాబీయింగ్ ఉందా?

Big-Gambling-Behind-National-Awards-Andhra-Talkies
66వ జాతీయ అవార్డులు ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. ఈ పురస్కారాల్లో `రంగస్థలం` చిత్రానికి అన్యాయం జరిగిందని.. ముఖ్యంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉత్తమ నటుడు అవార్డు రావాల్సింది కాస్తా లాబీయింగ్ వల్ల బాలీవుడ్ హీరోలకు ఆ ఛాయిస్ వెళ్లిపోయిందని ప్రచారమవుతోంది. అయితే అంతగా లాబీయింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అంటే బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ ఇదంతా చేశారని తెలుగు సినీమీడియాలో చర్చ సాగుతోంది.

చిట్టిబాబు పాత్రలో చెవిటి కుర్రాడిగా రఫ్ అండ్ రగ్గ్ డ్ లుక్ తో రామ్ చరణ్ గొప్పగా నటించారు. గోదారి యాస కట్టుబాట్లు ఉన్న కుర్రాడిగా అద్భుతంగా నటించి మెప్పించాడు. దాంతో పోలిస్తే బాలీవుడ్ స్టార్లు అంత గొప్పగా ఏం నటించారు.. అంటూ మెగాభిమానుల్లోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే రామ్ చరణ్ ఎంత చేసినా సీనియర్ నటుడు పరేష్ రావల్ అవార్డు రాకుండా అడ్డుకున్నాడట..!

కింగ్ ఖాన్ డాటర్ టైమొచ్చినట్టేనా?

Suhana-Khan-all-set-to-make-her-acting-debut-Andhra-Talkies
బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ వెల్లువపై నిరంతరం వాడి వేడిగా చర్చ సాగుతోంది. 2019లో ఇప్పటికే ఓ అరడజను స్టార్ కిడ్స్ తెరకు పరిచయం అయ్యారు. మరో నలుగురైదుగురు రెడీ అవుతున్నారన్న సమాచారం ఉంది. ఇందులో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ వారసులు ఇద్దరూ జాబితాలో ఉన్నారు.  సుహానాఖాన్- ఆర్యన్ ఖాన్ వెండితెరకు పరిచయం అయ్యే సమయం ఆసన్నమైందన్న ప్రచారం సాగుతోంది.

ముందుగా సుహానా ఖాన్ ఎంట్రీ ఉంటుంది. ఇప్పటికే సుహానా లండన్ లోని ఆర్డింగ్లి కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే సోదరుడు ఆర్యన్ తో కలిసి నటనలో సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసిందని తెలుస్తోంది. ఇక ఎలానూ చదువు పూర్తయింది కాబట్టి ఇక బరిలో దిగడమే ఆలస్యం. కథానాయికగా ఆరంగేట్రానికి డాడ్ షారూక్ నుంచి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మామ్ గౌరీ ఖాన్ ఎంతో ఎగ్జయిటింగ్ గా ఆ క్షణం కోసం వేచి చూస్తోంది. ఇలాంటి వేళ ముందుగా ప్రీప్రాక్టికల్స్ లో భాగంగా సుహానా ఏం చేసిందో తెలుసా?

బ్యూటీలంతా బెల్లీ డ్యాన్స్ మీద పడ్డారే!

Heroines-Crazy-About-Belly-Dance-Andhra-Talkies
ప్రెజెంట్ జెనరేషన్ లో గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న భామలందరూ ఫిట్ నెస్ పై ఫోకస్ చేస్తున్నారు.  ఈ విషయం అందరికీ తెలిసిందే. తిండైనా మానుకుంటారు.. మేకప్పైనా వేసుకోకుండా కనిపిస్తారు కానీ కసరత్తులు చేయకపోతే రోజు గడవదు అన్నట్టుగా ఉంది పరిస్థితి.  యోగానో.. వెయిట్ ట్రైనింగో.. ఏరోబిక్సో.. జుంబా డ్యాన్సో.. ఏదో ఒకటి తప్పకుండా చేయడం భామలకు అలవాటుగా మారింది.  అయితే ఈమధ్య మరో ట్రెండ్ కూడా మొదలైంది. అదే బెల్లీ డ్యాన్స్.. అదేదో సినిమాలో 'నాకు బెల్లం అంటే ఇష్టం' అన్నట్టుగా ఈ పాపలందరూ 'నాకు బెల్లీ డ్యాన్స్ అంటే ఇష్టం అంటున్నారు.

ఇప్పటికే ఈ బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటున్న భామల లిస్టు చాలా పెద్దది.  శ్రీదేవి డాటర్ జాహ్నవి కపూర్.. అనన్య పాండే.. షారూఖ్ డాటర్ సుహానా లాంటివారు బెల్లీ డ్యాన్స్ లో మెళకువలు నేర్చుకోవడంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు.  ఈ లిస్టు చెప్పుకుంటూ పోతే చేంతాడంత అవుతుంది.  ఈ లిస్టులో తాజాగా బ్యూటిఫుల్ రకుల్ కూడా జాయిన్ అయింది.  రకుల్ ప్రస్తుతం హిందీ లో 'మర్జావా' అనే చిత్రంలో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా.. రితేష్ దేశ్ ముఖ్ ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్.  ఈ సినిమాలో ఒక పాట కోసం బెల్లీ డ్యాన్సింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టిందట.  అంతే కాదు తను రెగ్యులర్ గా చేసే ఎక్సర్ సైజులకు లిస్టులో ఇది మరో ఎక్సర్ సైజ్ అని చెప్పుకొచ్చింది.  ఫ్లాట్ యాబ్స్.. బెటర్ డ్యాన్సింగ్ స్కిల్స్  కోసం ఈ బెల్లీ డ్యాన్స్ ను ఇకపై కంటిన్యూ చేస్తానని చెప్తోంది.

నటుడిని అయితే నేను నాలా ఉండకూడదా? - విజయ్ దేవరకొండ

Arjunreddy-Hero-Vijay-Devarakonda-About-His-Personal-Behavior-Andhra-Talkies
విజయ్ దేవరకొండ తన నటనతో పాటు యాటిటూడ్ తో కూడా యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అందరు హీరోల మాదిరిగా కాకుండా విజయ్ దేవరకొండ విభిన్నంగా ఆలోచిస్తాడని.. విభిన్నంగా ఉంటాడని ఆయన అభిమానులు అనుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి అందరు హీరోలకు తాను డిఫరెంట్ అంటూ చెప్పకనే చెప్పాడు. నేడు 'డియర్ కామ్రేడ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత ప్రవర్తన గురించి స్పందించాడు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నేను హీరో అయిన తర్వాత నన్ను కొందరు ఇలా చేయవద్దు.. అలా ప్రవర్తించవద్దు.. ఇలా మాట్లాడాలి అంటూ నాకు కొన్ని బౌండరీస్ పెట్టే ప్రయత్నం చేశారు. కాని నేను వాటిని పట్టించుకోదల్చుకోలేదు. నటుడిని అయినంత మాత్రాన నేను నాలా ఉండకుండా ఎలా ఉంటాను. ఎప్పుడైనా నేను నాలాగే ఉండాలనుకుంటాను. ఇతరుల మాదిరిగా ఎందుకు ఉండాలి. అందరు కూడా ఎవరికి వారు యునిక్ గా ఉంటారు. కాని చిన్నప్పటి నుండి కూడా ఒకే తరహా యూనిఫామ్.. ఒకే తరహా సమాధానాలు అంటూ అందరిని ఒకేటే మాదిరిగా చేస్తున్నారు.

జయలలితగా క్వీన్ కంగన రంగ ప్రవేశం

Bollywood-hot-heroin-Kangana-Ranaut-to-prep-for-Jayalalithaa-biopic-in-Manali-Andhra-Talkies
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలితపై వరుసగా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. అయితే వీటిలో క్వీన్ కంగన నటించనున్న బయోపిక్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఏ.ఎల్.విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగు.. తమిళ భాషల్లో తలైవి పేరుతో హిందీలో జయ పేరుతో త్రిభాషా చిత్రంగా రూపొందనుంది. `జడ్జిమెంటల్ హై క్యా` నిర్మాత ఆర్.శైలేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్- రజత్ అరోరా సంయుక్తంగా స్క్రిప్టు పనులు చేస్తున్నారు.

సెప్టెంబర్ లో సినిమా ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్న ఈ టీమ్ ఇప్పటికే కంగనకు లుక్ టెస్టులు చేసేందుకు రెడీ అవుతోంది. అందుకోసం కంగన స్వస్థలం మనాలి వెళ్లనున్నారు. అక్కడ లుక్ టెస్టులతో పాటు పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్ క్లాసులు ఉంటాయట. అలాగే కంగన ఇప్పటికే తమిళ భాషను నేర్చుకుంది. ఈ బయోపిక్ లో కంగన విభిన్నమైన గెటప్పుల్లో కనిపించాల్సి ఉంటుంది. జయలలిత యుక్తవయసులో ఉన్నప్పుడు.. కథానాయిక అయ్యాక.. నాయకురాలు అయ్యాక ఇలా రకరకాల లుక్ లలోకి మారాల్సి ఉంటుంది. అయితే అందుకోసం ప్రోస్థటిక్స్ మేకప్ ని ప్లాన్ చేశారు. హాలీవుడ్ మేకప్ స్పెషలిస్ట్ గ్యారీ ఓల్డ్ మన్ (డార్కెస్ట్ హవర్ 2017 మూవీ) ని ఈ సినిమా కోసం బరిలో దించుతారట. పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తారని తెలుస్తోంది.

కోడలిని తెగ ప్రమోట్ చేస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

RGV-Niece-Continuing-His-Legacy-Andhra-Talkies
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కుటుంబ బంధాలకు పెద్దగా విలువ ఇవ్వడని అంతా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడో భార్య నుండి విడిపోయిన వర్మ తన కూతురుతో కూడా చాలా లైట్ గానే ఉంటాడని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే తాజాగా వర్మ తన మేనకోడలు అయిన శ్రావ్య వర్మను సినిమాల్లో తెగ ప్రమోట్ చేస్తున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ను ప్రారంభించిన శ్రావ్య వర్మ తాజాగా నిర్మాతగా కూడా మారింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని శ్రావ్య వర్మ మరో నిర్మాతతో కలిసి నిర్మించింది. నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. తమ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నట్లుగా శ్రావ్య వర్మ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్బంగా ఆమె చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను అంటూ పేర్కొంది. దిల్ రాజు ఈ సినిమా నచ్చి సమర్పించేందుకు ముందుకు రావడంతో శ్రావ్య సంతోషాన్ని వ్యక్తం చేసింది.

నోరు పారేసుకుని అడ్డంగా బుక్కయిన కంగన!

Press-Club-of-India-Supports-Boycott-of-Heroin-Kangana-Ranaut-Andhra-Talkies
అయినదానికి కాని దానికి నోరు పారేసుకుంటే ఆ పరిణామం ఎలా ఉంటుందో ఇన్నాళ్టికి తెలిసొచ్చింది కంగనకు. తొందరపాటుతో నోరు జారింది. అది కూడా తనకు ప్రచారం చేసి ఇంతటి దానిని చేసిన మీడియానే తూలనాడింది. ఎదురు కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడింది. జర్నలిస్టులు ద్రోహులు.. సంఘంలో చెదలు.. సూడో సెక్యులరిస్టులు.. అంటూ ఒంటి కాలిపై చిందులేసింది. జర్నలిస్టుల్ని నేరస్తులు అని ప్రచారం చేస్తూ.. నేర పూరిత ప్రవర్తనతో బెదిరింపులకు పాల్పడ్డారంటూ కోర్టుల పరిధిలో పోరాటానికి సిద్ధమైంది. తనని బహిష్కరించడం నేరపూరితమైన చర్య.. అందుకు జర్నలిస్టులు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సవాల్ విసిరింది.

ఈ అడ్డగోలు వ్యవహారంతో కంగన ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ - ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా కంగనను బహిష్కరించడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కంగన అడ్డంగా బుక్కయ్యింది. ఇక కంగనకు.. ఆమె సోదరి రంగోలికి ఇలా అసభ్యంగా అనాగరికంగా మాట్లాడే అలవాటు ఉందని జర్నలిస్టులంతా ఏకమై ఎటాక్ చేయడంతో సీన్ మొత్తం రివర్సులో ఉందిప్పుడు. ఈ నేపథ్యంలో  కంగన నటించిన `జడ్జిమెంటల్ హై క్యా` రిలీజ్ పరిస్థితి ఏంటి?  కంగన వ్యవహారంతో జర్నలిస్టులు ఇప్పుడు ఈ సినిమాపైనా ప్రతీకారం తీర్చుకుంటారా? అన్న కొత్త సందేహాలకు తావిచ్చినట్టయ్యింది.

మరో మగాడిని పెళ్లి చేసుకునేందుకు అమెరికా వెళ్ళిన వైభవ్!

indian-gay-couple-marries-in-greece-andhra-talkies
పెళ్లికి అర్థం - పరమార్థం రెండూ మారిపోతున్నాయి. ఆడామగను సంసార బంధంతో ముడివేసి మానవజాతి మనుగడ కొనసాగేలా చేసేదే పెళ్లి. కానీ.. మారిన కాలంలో మానవజాతి మనుగడకు పెళ్లి అవసరమూ లేదు.. అసలు పెళ్లికి ఆడామగా కూడా అవసరం లేదనేలా ప్రపంచవ్యాప్తంగా విపరీతాలు చోటుచేసుకుంటున్నాయి. ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు పెళ్లి చేసుకోవడం వంటివి అనేక దేశాల్లో చూస్తున్నాం. అయితే.. ఇదంతా అలాంటి ఆలోచనలున్న మనుషుల మధ్యనో... లేదంటే అందుకు అనుమతించే దేశాల్లో అధికారుల ముందో జరుగుతున్నాయి. కానీ.. అమెరికాలో ఇద్దరు ప్రవాస భారతీయ పురుషులు మాత్రం రెండు కుటుంబాల అంగీకారంతో - బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకున్నారు.

టెక్సాస్ లో ఉంటున్న ఈ ఎన్నారైలు జైన సంప్రదాయంలో చాలా గ్రాండ్ గా తమ వివాహాన్ని జరుపుకున్నారు. ఈ జంటలో వైభవ్ అనే వ్యక్తి గే వివాహం కోసమే అమెరికాకు వెళ్లగా.. మరో భాగస్వామి పరాగ్ మెహతా అమెరికాలోనే పుట్టి పెరిగిన వ్యక్తి. వైభవ్ ఇండియా నుంచి 2011లో అమెరికా వెళ్లాడు. అక్కడి అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ రీసర్చ్ లో రీసర్చ్ అసోసియేట్ గా పనిచేస్తున్నాడు.

ఏడు గెటప్పులతో సర్ ప్రైజ్ చేయనున్ననాగశౌర్య!

Tollywood-Hero-Naga-Shourya-on-About-His-Role-in-Ashwardhama-Movie-Andhra-Talkies
సినిమా ఒకటే .. కానీ అందులో ఏకంగా ఏడు గెటప్పుల్లో నటించి సర్ ప్రైజ్ చేస్తాడట నాగశౌర్య. ఇటీవలే `ఓ బేబి`లో కామియోలో కనిపించినా చక్కని నటనతో ఆకట్టుకున్న శౌర్య ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఓ బేబి సక్సెస్ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ లో తాను చేస్తున్న ప్రాజెక్టుల గురించి ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశారు శౌర్య.

సొంత బ్యానర్ లో `అశ్వర్ధామా` చేస్తున్నా. అలాగే `ఊహలు గుసగుసలాడే` కాంబినేషన్ రిపీటవుతోంది.  అవసరాల దర్శకత్వంలో `ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి`  చిత్రంలో నటిస్తున్నా. ఇందులో  ఏడు గెటప్పుల్లో కనిపిస్తాను. ఒకే పాత్రలో ఏడు షేడ్స్ ని చూపించే ఛాన్స్ దక్కింది.  వీటితో పాటు `పార్థు` అనే వేరొక చిత్రంలోనూ నటిస్తున్నా.. అని సినిమాల క్యూ గురించి చెప్పారు శౌర్య. అలాగే అశ్వత్థామ చిత్రానికి కథ అందించాను. రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. దీనికి నా పేరు టైటిల్స్ లో వేసుకుంటున్నా.. ఇంతకుముందు ఛలో చిత్రానికి కథ అందించినా నా పేరు వేసుకోలేదు.. అని తెలిపారు.

నెట్ ఫ్లిక్స్ కు ఓ బేబీ.. అమెజాన్ నో బేబీ!

Oh-Baby-Becomes-Costly-On-Digital-Space-Andhra-talkies
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంతా లీడ్ రోల్ లో నటించిన 'ఓ బేబీ' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ఇప్పటికే హిట్ టాక్ వచ్చింది. అయితే ఎంత పెద్ద హిట్  సినిమా అయినా కొద్ది రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లోకి రావాల్సిందే. 'ఓ బేబీ' కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఈమధ్య మరీ సినిమా రిలీజ్ అయిన ముప్పై రోజులకే స్ట్రీమింగ్ చేయకుండా.. 50 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు ఒక రూల్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో ఇంట్లో సినిమా చూడాలనుకునే వారు 50 రోజులు వేచి చూడాల్సిందే.

ఫిలిం మేకర్స్ ఎన్ని ఎత్తులు వేసినా.. ఎన్ని రకాల ప్రమోషన్స్ చేసినా కొందరు కఠిన హృదయులైన ప్రేక్షకులు మాత్రం థియేటర్ కు పోకుండా ఇంట్లోనే చూడాలని మంకుపట్టుతో ఉంటారు. ఇక కొందరేమో తమ అభిమాన నటీనటుల సినిమాలను అమెజాన్ కే ఎక్కువమంది వినియోగదారులు ఉన్నారు. మాటిమాటికీ చూసి మళ్ళీ మళ్ళీ ఆ సినిమాను ఎంజాయ్ చేయ్యాలనుకుంటారు. వారందరూ అమెజాన్ ప్రైమ్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు.  'ఓ బేబీ' విషయంలో కూడా ఇప్పుడు అలాంటి ప్రేక్షకులు కొందరు ఉంటారు కదా. వారికి ఈసారి నిరాశ తప్పదు.

దెయ్యానికి దొరసానికి మధ్యలో బైకు

This-Friday-Movies-At-Tollywood-Box-Office-Andhra-Talkies
ప్రతి శుక్రవారం ఖచ్చితంగా రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ చేయాలని టాలీవుడ్ నిర్మాతలు కంకణం కట్టుకున్నట్టు ఉన్నారు. గత నెల రోజుల నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అందులో ఒకటి మాత్రమే పాస్ అవుతూ మిగిలిన వాటి వసూళ్ల మీద ప్రభావం చూపుతుండగా పోటీ విషయంలో నిర్మాతలు మాత్రం వెనక్కు తగ్గుమంటున్నారు. వచ్చే శుక్రవారం జులై 12న ఇదే పరిస్థితి మరోసారి రిపీట్ అయ్యేలా ఉంది.

ఎన్ని వస్తున్నాయనేది పక్కన పెడితే ప్రధానమైన పోటీ మాత్రం మూడింటి మధ్య ఉంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు రాజశేఖర్ రెండో అమ్మాయి శివాత్మికలను జంటగా పరిచయం చేస్తూ రూపొందిన దొరసాని కులాల అంతరాల మధ్య బ్యాక్ డ్రాప్ తో ప్రమోషన్ మొదలైనప్పటి నుంచి బాగానే ఆసక్తి రేపుతోంది

వర్మ నుండి మళ్లీ అలాంటి సినిమాలు చూడలేమా?

Cene-Critics-on-About-Ram-Gopal-Varma-Andhra-Talkies
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసి ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈయన కెరీర్ ఆరంభంలో తీసిన సినిమాలు ఒకొక్కటి అద్బుతాలు.. ఆణిముత్యాలు అని చెప్పుకోవచ్చు. తెలుగులో శివ సినిమా ఒక ట్రెండ్ ను సెట్ చేస్తే హిందీలో 'సత్య' చిత్రం బాలీవుడ్ స్థితినే మార్చేసింది. షోలే స్థాయి సక్సెస్ అంటూ బాలీవుడ్ ప్రముఖులు కూడా సత్యను పొగడ్తలతో ముంచెత్తారు. అంతటి గొప్ప సినిమాలను అందించిన వర్మ ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో చెప్పనక్కర్లేదు.

చెత్త సినిమాలు.. ప్రయోగాత్మక సినిమాలు అంటూ ఏకంగా పోర్న్ సినిమాలను కూడా వర్మ తీస్తున్నాడు. తాజాగా వర్మ తీసిన 'సత్య' సినిమా 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా బాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆ చిత్ర మధుర గుర్తులను నెమరవేసుకున్నారు. సత్య సినిమా హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు కూడా ఇన్సిపిరేషన్ గా నిలిచింది. అలాంటి సినిమాలు తీసిన వర్మ కాస్త శ్రద్ద పెడితే మంచి సినిమాలు తీయగలడు. కాని వర్మ ఎందుకు ఆఫీసర్.. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వంటి చెత్త సినిమాలు తీస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినీ ఛాన్సులు పేరుతో దారుణ మోసం

upcoming-Actress-Trying-For-Movie-Chances-Andhra-Talkies
సినీ ఛాన్సులు .. ఆడిషన్స్ అంటూ హడావుడి చేస్తూ దొరికినంతా దోచేస్తున్నారు కొందరు మోసగాళ్లు. అమాయక యువతీ యువకుల జేబులు ఖాళీ చేస్తున్న దర్జా దొంగలు పోలీసులకు చిక్కుతున్న ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. రీసెంట్ గానే సీరియల్స్ లో ఛాన్సులిప్పిస్తానంటూ తుమ్మల శ్రీదేవి అనే యువతి మోసం బట్టబయలైన సంగతిని మరువక ముందే మరో మోసం వెలుగులోకి వచ్చింది.

సినిమాల్లో  ఛాన్స్ పేరుతో ఓ వ్యక్తి వరుస మోసాలకు పాల్పడి లక్షల్లో సొమ్ములు వసూలు చేస్తున్నాడు. ఇప్పటికే పలువురిని మోసం చేసిన సదరు వ్యక్తిపై తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సదుం మండలం బయారెడ్డిపల్లెకు చెందిన చిట్టి పవన్ కల్యాణ్ డిగ్రీ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని వాట్సాప్ నంబరు ద్వారా హైదరాబాద్ కు చెందిన నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఛైర్మన్ ను అంటూ ఎస్.వి.ఎన్.రావ్ పరిచయం చేసుకున్నాడు. ఆ ఇద్దరూ కలిసి ఓ తెలివైన గేమ్ ప్లాన్ చేశారు.

ఆ హీరోయిన్ భర్త అరెస్ట్!

Prema-Pavuralu-Heroine-s-Husband-Arrested-Andhra-Talkies
ఒక్క సినిమాతో  భారీ పాపులార్టీని సొంతం చేసుకోవటం మామూలు విషయం కాదు. యావత్ దేశం మొత్తం ఆమెకు ఫిదా అయిపోయినప్పటికీ.. భారీ ఆఫర్లు వరుస పెట్టినప్పటికీ చలించకుండా ఒక్క సినిమాతో దూరమైన ఇమేజ్ ప్రేమపావురాలు ఫేం భాగ్యశ్రీ సొంతం.

అయితే.. తర్వాతి కాలంలో భర్తను హీరోగా పెట్టి సినిమాలు తీస్తానని చెప్పినా.. అదేమీ వర్క్ వుట్ కాలేదు. కాకుంటే మొదట్నించి ఇప్పటివరకూ ఒకటే రూల్ మీద ఉన్న నటిగా ఆమెను చెప్పాలి.ఇదిలా ఉంటే తాజాగా ఆమె భర్త హిమాలయ దాసానీని పోలీసులు అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.

గ్లాంబ్లింగ్ రాకెట్ కు సంబంధించిన ఆరోపణలతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ మీద విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకురావాల్సి ఉంది. తొలి చిత్రంతోనే టాప్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమె తన తొలి సినిమాకే ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు.

నాని పేరు చెప్పిన దొరసాని!

Shivatmika-Likes-Nani-andhra-talkies
సాధారణ ప్రేక్షకులైనా స్టార్ కిడ్స్ అయినా ఏదో ఒక హీరోనో హీరోయిన్ నో అభిమానించడం కామన్. ఒక్కోసారి  కొంతమంది సెలబ్రిటీలతో ప్రేమలో కూడా పడిపోతుంటాం.  మరీ ప్రేమ అనే పదం వాడితే పెద్దదైపోతుందేమో కానీ దాన్ని క్రష్ అనుకోవచ్చు.  రీసెంట్ గా తమ క్రష్ గురించి కొత్త హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ జోడీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

త్వరలో రిలీజ్ కానున్న 'దొరసాని' చిత్రంతో ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారనే సంగతి తెలిసిందే.  దీంతో ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.  రీసెంట్ గా అలాంటి ఒక ఇంటర్వ్యూలో ఆనంద్ దేవరకొండ ను తన క్రష్ గురించి చెప్పమంటే తడుముకోకుండా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే పేరు చెప్పాడు.  శివాత్మిక మాట్లాడుతూ కనీసం ఒక అరడజను పేర్లు చెప్పింది.  రణబీర్ కపూర్.. విక్కీ కౌశల్.. రణవీర్ సింగ్.. ఆదిత్య కపూర్ అంటే ఇష్టమని చెప్పింది.  టాలీవుడ్ లో దాదాపు అందరూ సెలబ్రిటీలు తనకు పరిచయం ఉండడంతో క్రష్ లేదని తెలిపింది.

సక్సెస్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న బ్యూటీ!

Shalini-Pandey-Not-Responds-on-Kabir-Singh-Movie-Andhra-Talkies
ఈ జెనరేషన్ లో హీరోలకైనా.. హీరోయిన్లకైనా అత్యంత అవసరమైనది పీఆర్.  అది సరిగ్గా ఉంటే కెరీర్ కు ఎంతో హెల్ప్ అవుతుంది.  పీఆర్ సరిగ్గా లేకపోయినా కెరీర్ ఏమీ క్లోజ్ అవ్వదు కానీ కొంత నష్టం అయితే తప్పనిసరిగా జరుగుతుంది.  ప్రస్తుతం హీరోయిన్ షాలిని పాండే అలానే జరుగుతోందనే టాక్ ఉంది.

ఎందుకంటే 'అర్జున్ రెడ్డి' లాంటి సెన్సేషనల్ హిట్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.  అదేంటో కానీ విజయ్ దేవరకొండ కు మేజర్ క్రెడిట్.. మిగతా క్రెడిట్ సందీప్ వంగాకు పోయింది కానీ షాలిని పాండేకు పెద్దగా క్రెడిట్ రాలేదు. అయినా షాలిని నటన సూపర్ అనే మాట నిజం.  విజయ్ దేవరకొండ కు పోటీగా నటించి అందరినీ మెప్పించింది.  అయినా పెద్దగా క్రెడిట్ దక్కకపోవడం ఆశ్చర్యమే.  ఆ సినిమాతో కొన్ని ఆఫర్లు వచ్చాయి కానీ అవన్నీ క్రేజీ అఫార్లయితే కాదు. ఇదిలా ఉంటే 'అర్జున్ రెడ్డి' హిందీ వెర్షన్ 'కబీర్ సింగ్' ఇప్పుడు సూపర్ హిట్ అయింది. హిందీ వెర్షన్ చూసిన వాళ్ళు కూడా కొందరు ఇప్పటికీ  విజయ్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక్కరు కూడా షాలిని పేరెత్తడం  లేదు.

ఈ పరిస్థితుల్లో కృష్ణ గారు మహేష్ వద్ద ఉండటం ఉత్తమం!

Superstar-Krishna-after-Vijaya-Nirmala-Death-Andhra-Talkies
సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ నిర్మల మరణంతో ఒంటరి వారు అయ్యారని.. శరీరాలు వేరైనా ప్రాణం ఒక్కటిగా వారిద్దరు ఇన్నాళ్లు బతికారంటూ ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు అన్నారు. కృష్ణ మరియు విజయ నిర్మలను దగ్గర నుండి చూసిన ఇమంది రామారావు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. బతికినంతకాలం ఇద్దరు కూడా ఒక్కటిగా బతికారు. అందుకే ఆమె మరణంను కృష్ణ జీర్ణించుకోలేక పోతున్నారు.

ఆమె మరణంతో ఖచ్చితంగా కృష్ణ చాలా కోల్పోయారు. ప్రస్తుతం కృష్ణగారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆయన టైంకు విశ్రాంతి తీసుకోవాలి.. మందులు వేసుకోవాలి... ఆహారం తీసుకోవాలి. లేదంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఆ విషయం తెలిసి కూడా ఆయన విజయ నిర్మల మరణంతో క్రుంగి పోయి తన రోజు వారి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తన ఆరోగ్యంను కూడా లెక్క చేయకుండా బాధ పడుతున్నారు. ఆయన పరిస్థితి చూస్తుంటే ప్రాణాలపై ఆశను వదిలేసినట్లుగానే అనిపిస్తుంది. ప్రస్తుతం ఆయనకు మంచి తోడు కావాలి. ఆయన్ను కంటికి రెప్పలా చూసుకునే కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆయనకు అవసరం.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...