లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?



లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?

What-is-the-situation-of-the-film-industry-after-the-lockdown-Andhra-Talkies
లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?
కోవిడ్-19 వ్యాప్తితో దాదాపుగా అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో అందరం ఒక్కసారిగా ఇంట్లో కూర్చుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. ఈ లాక్ డౌన్ ప్రతి ఒక్క సంస్థపై ఆర్థికంగా ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటలీ.. స్పెయిన్.. యూకె.. యూఎస్ఎ దేశాల్లో. కొన్ని ఇతర ఐరోపా దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.

ఈ వ్యాధి ప్రభావం మనదేశంపై కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇది కొత్త మార్పులకు దారితీయవచ్చు. ప్రస్తుతం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేందుకు ప్రజలు భయపడి ఇంట్లోనే అందుబాటులో ఉండే సినిమాలతోనో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు ప్రజలు వెళ్తారేమో కాని యావరేజ్ సినిమాలు అనే పదం ఇకపై కనిపించకపోవచ్చు

RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్!


RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్!

Director-Rajamouli-Movie-RRR-Team-Using-Lockdown-For-Movie-Promotions-Andhra-Talkies
RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్!
ఒక సినిమాను నిర్మించడం వేరు.. దానికి సరైన ప్రచారం కల్పించి ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడం వేరు. చాలామంది ఈ ప్రచారం విషయంలో వెనకబడతారు.  ఓపెనింగ్స్ లేక సినిమా హిట్ అయ్యే అవకాశాలు జారవిడుచుకుంటారు.  అయితే రాజమౌళి మార్కెటింగ్ టెక్నిక్స్ మాత్రం ఎప్పుడూ కొత్తపుంతలు తొక్కుతూ ఉంటాయి.  నిజానికి  రాజమౌళి మార్కెటింగ్ వల్లే తన సినిమాల క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది.  'బాహుబలి' సమయంలో రాజమౌళి అనుసరించిన మార్కెటింగ్ టెక్నిక్స్ చాలామందిని అబ్బురపరిచాయి.  ఇప్పుడు 'RRR' విషయంలో లో కూడా అలాంటి ఎత్తుగడతోనే ముందుకు వెళ్తున్నారు.

కరోనా దెబ్బకు షూటింగులు ఆగిపోయాయి. ప్రమోషన్లు కూడా ఆపారు. లాక్ డౌన్ కావడంతో దాదాపుగా ప్రజలంతా ఇంటిపట్టునే ఉంటూ కాలం గడుపుతున్నారు.  అయితే ఈ లాక్ డౌన్ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేందుకు రాజమౌళి టీమ్ రెడీ అయింది.  మొదట మోషన్ పోస్టర్ తో వచ్చారు. టైటిల్.. మోషన్ పోస్టర్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. నిన్న చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో విడుదల చేశారు.  ఇది కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. చరణ్ కు ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్టుకు యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ దక్కుతోంది.

మోస్ట్ పెయిడ్ హీరోయిన్స్ జాబితాలో పూజ..


మోస్ట్ పెయిడ్ హీరోయిన్స్ జాబితాలో పూజ..

Popular-Heroin-Pooja-on-most-paid-heroines-list-Andhra-Talkies
మోస్ట్ పెయిడ్ హీరోయిన్స్ జాబితాలో పూజ..
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగిపోతుంది పూజ హెగ్డే. వరుస హిట్లతో టాప్ హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాతో పాటు అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే తాజా కథనాల సమాచారం మేరకు.. ఈ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హీరోయిన్ గా నటించడానికి పూజ భారీ పారితోషికాన్ని తీసుకుంటుందట. అదికూడా హీరో అఖిల్ కంటే హీరోయిన్ పూజకే ఎక్కువ చెల్లిస్తున్నారట నిర్మాతలు బన్నీవాసు వాసు వర్మలు. ఇక హీరోకంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలోకి పూజ  చేరిందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న పూజ బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుందని గుసగుసలాడుతున్నారు. మరి పూజ ఈ సోషల్ మీడియా వార్తలపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఎద సొంపులను ఎరగా వేస్తున్న ఆదా శర్మ


ఎద సొంపులను ఎరగా వేస్తున్న ఆదా శర్మ

sexy-heroin-Adah-Sharma-Glamourous-pose-Andhra-Talkies
ఎద సొంపులను ఎరగా వేస్తున్న ఆదా శర్మ
ఆదా శర్మ...ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది హార్ట్ ఎటాక్ అనే చెప్పాలి. తన నటనతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. అల్లు అర్జున్ తో సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా నటించింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా తెలుగులో మెయిన్ హీరోయిన్ అవకాశాలైతే రాలేదనే చెప్పాలి. కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయింది. ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ అడపాదడపా చిత్రాలలో నటించింది.

 ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి పేరు ఉంది. ఈమె సినిమాలకన్నా ఎక్కువగా తన ఫోటోలతో ఫ్యాన్స్ కు మత్తెకిస్తుంది. ఎక్కువగా ఫోటోషూట్ లు చేస్తూ తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమవుతున్నారు. ఎంతో కొంత వినోదం కలిగించడం కోసం తమ సోషల్ మీడియా ద్వారా సెలెబ్రెటీలు తమ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ భామ కూడా తన అభిమానుల కోసం ఒక ఫొటో అప్ లోడ్ చేసి కుర్రకారుకు ఊపు తెప్పిస్తున్నది. ఎద సొంపులను చూపిస్తూ మత్తెక్కించే కళ్ళతో కుర్రాళ్లకు ఎర వేస్తున్నట్లు ఫొటోకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు


ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు

Gates-Are-Closed-For-Indian-Movies-Andhra-Talkies
ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు
కరోనా ధాటికి కుదేలవుతున్న రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. మిగతా రంగాల కంటే ముందు దీనిపైనే కరోనా ప్రభావం పడింది. నెల కిందట్నుంచే సినిమాల వసూళ్లు పడిపోయాయి. తర్వాత ఏకంగా థియేటర్లే మూసేశారు. షూటింగులు ఆగిపోయాయి. రిలీజ్లు ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో తెలియట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ నెలాఖరు వరకు థియేటర్లను మూసేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనూ థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ నెల రెండో అర్ధంలో అయినా పరిస్థితి మారుతుందేమో అని చూస్తున్నారు. ఇండియా లో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కనీసం మే ఆరంభం నుంచి అయినా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. వేసవిలో అత్యంత ముఖ్యమైన ఈ నెలలో అయినా వసూళ్ల పంట పండించుకోవచ్చని భావిస్తున్నారు.

బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..??


బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..??

heroin-anushka-shetty-mega-chance-so
బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..?
'బాహుబలి' సినిమాతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. కింగ్ నాగార్జున నటించిన 'సూపర్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించిన స్వీటీ శెట్టి తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అరుంధతి పంచాక్షరీ భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ మూవీల్లో నటించి తాను ఎలాంటి ఛాలెంజింగ్ పాత్ర అయిన చేయగలనని నిరూపించుకుంది. అయితే స్వతహాగా సౌమ్యురాలైన అనుష్క మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించే ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట.

పీకే రూటే సపరేటు.. అందరివీ చప్పట్లు ఈయనది గంట



పీకే రూటే సపరేటు.. అందరివీ చప్పట్లు ఈయనది గంట

Power-Star-Pawan-Kalyan-Salute-to-All-For-Janata-Curfew-Success-Andhra-Talkies
పీకే రూటే సపరేటు.. అందరివీ చప్పట్లు ఈయనది గంట
సినిమాల్లో పవర్ స్టార్ రాజకీయాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ నిజంగా ఏది చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. సినిమాల్లో తనదైన స్టైల్ తో లక్షలాది మంది అభిమాన ధనాన్ని సంపాదించుకున్న పవన్... రాజకీయాల్లోనూ తనదైన ప్రత్యేకతనే చాటుకునేందుకే యత్నించారు తప్పించి... అందరూ నడిచిన దారిలో మాత్రం నడవలేదు. ఈ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినా కూడా పవన్ వెనుకాడలేదనే చెప్పాలి. అయినా ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకనుకుంటున్నారా? ఏ విషయంలో అయినా పవన్ రూటు సపరేటే. అందుకు నిదర్శనంగా నిలుస్తున్న ఘటన ఆదివారం జరిగింది కాబట్టే ఈ ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది.

కరోనా వైరస్ విస్తరణను కట్టి చేసే క్రమంలో ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు దేశం మొత్తం మద్దతుగా నిలిచింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంటి నుంచి బయటకు రాకుండా అంతా స్వీయ నిర్బంధాన్నే పాటించారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని మోదీ పిలుపు ఇవ్వగా... ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశం మొత్త చప్పట్లతో మారుమోగింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన దాదాపుగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు చప్పట్లు చరిచి మోదీ పిలుపునకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఏప్రిల్ లో అయినా థియేటర్స్ తెరుచుకుంటాయా...?


ఏప్రిల్ లో అయినా థియేటర్స్ తెరుచుకుంటాయా...?

Are-Theaters-Will-Open-In-April-Andhra-Talkies
ఏప్రిల్ లో అయినా థియేటర్స్ తెరుచుకుంటాయా...?
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వల్ల దేశ వ్యాప్తంగా మల్టీ ఫ్లెక్సులు థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కొన్ని వందల కోట్ల మేర నష్టాలు చవిచూసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిర్మాతల మండలి సూచన మేరకు చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు నిలుపుదల చేసుకున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న చిత్రాలు తమ షూటింగ్ లను నిలుపుదల చేసుకోగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నాయి. మన దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులలో గణనీయమైన క్షీణత వచ్చేవరకు ప్రచార కార్యక్రమాలు కూడా నిలిపి వేశారు. కరోనా పరిస్థితులు మారేలా కనిపించకపోవడం తో మార్చి 25న రిలీజ్ కావాల్సిన చిత్రాలు ఏప్రిల్ నెలకు పోస్ట్ పోన్ అయ్యాయి. కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తన ప్రభావాన్ని తగ్గించుకునేలా కనబడకపోవడం తో ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్న సినిమాలను కూడా తరువాతి వారాలకు వాయిదా వేయబోతున్నట్లు ప్రకటించాయి.

కరోనా వల్ల దివాలు తీసిన హీరోయిన్ శ్రియా సరన్!


కరోనా వల్ల దివాలు తీసిన హీరోయిన్ శ్రియా సరన్!

Where-Does-Shriya-Saran-Stay-Andhra-Talkies
కరోనా వల్ల దివాలు తీసిన హీరోయిన్ శ్రియా సరన్!
సినీ ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పాటు అగ్రకథానాయకిగా వెలుగొందిన హీరోయిన్ శ్రియా సరన్. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ మహేష్బాబు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ప్రభాస్ రవితేజ.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రియ ఈ మధ్య జోరు తగ్గించిందనే చెప్పాలి. యంగ్ జనరేషన్ ఎంట్రీతో శ్రియకు అవకాశాలు తగ్గాయి. అయితే ఇప్పటికీ అవకాశం వచ్చినప్పుడు సీనియర్ హీరోల సరసన నటిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. సినిమాల్లోనూ నటిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తోంది. రష్యాకి చెందిన బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కొసఛీవ్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే ఆండ్రూతో కలిసి మ్యూజిక్ షోస్లో పాల్గొంటున్న శ్రియ..సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ అందాల ఆరబోతలో కుర్ర హీరోయిన్లకు నేను ఏమాత్రం తీసిపోనంటూ గుర్తు చేస్తూ ఉంటుంది.

కరోనా అయితే నాకేంటి అంటున్న స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల


కరోనా అయితే నాకేంటి అంటున్న స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల

Director-Sekhar-Kammula-On-Corona-Virus-Andhra-Talkies
కరోనా అయితే నాకేంటి అంటున్న స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. సామన్య ప్రజానీకం దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ కరోనా దెబ్బకు ఇల్లు దాటాలంటేనే పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లోని స్టార్ హీరోలు సైతం తమ షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఇళ్లకే పరిమితమై కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. నేపథ్యంలో సెలబ్రెటీలు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని తమ అభిమానులకు సూచిస్తున్నారు. తమ వంతు సామాజిక బాధ్యతగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఓ స్టార్ డైరక్టర్ మాత్రం కరోనాకి భయపడకుండా తన మూవీ షూటింగ్ను కానిచ్చేస్తున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సున్నితమైన కథలను తన స్టైల్ లో చూపించే శేఖర్ కమ్ముల.

కరోనా: మార్చి 31వరకూ థియేటర్ల బంద్ కు ఫిక్స్


కరోనా: మార్చి 31వరకూ థియేటర్ల బంద్ కు ఫిక్స్

Theaters-Closing-Till-Mar-31st-Due-To-China-Virus-Corona-Andhra-Talkies
కరోనా: మార్చి 31వరకూ థియేటర్ల బంద్ కు ఫిక్స్
కరోనా కల్లోలం ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంబించి పోయింది. ఈ శతాబ్ధంలోనే ఇంతటి ప్రమాదకరమైన మరో వైరస్ ఇంకేదీ లేదని డిక్లేర్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ హై అలెర్ట్ ప్రకటించడం అటుపై అన్ని దేశాల్లోనే రెడ్ అలార్మ్ మోగిపోవడం తెలిసిందే. ఇక ఈ ప్రభావం అన్ని మార్కెట్లు.. వ్యాపారాల తో పాటు వినోదరంగంపైనా అంతే దారుణంగా పడింది. ఇండియన్ సినిమా కుదేలైపోయింది. ఇక టాలీవుడ్ లోనూ పరిస్థితి ఎంతో ధైన్యంగా ఉంది.

సినిమా తెరకెక్కి అన్ని ఫార్మాల్టీస్ పూర్తయినా రిలీజ్ చేయలేని పరిస్థితి. అప్పటికే ఆడుతున్న సినిమాని ఆడనివ్వలేని పరిస్థితి. థియేటర్లు షట్ డౌన్. షూటింగులు బంద్. ఇది అత్యవసర పరిస్థితిగా మారింది. ఇక థియేటర్ల బంద్ వల్ల ఎగ్జిబిటర్ రంగం కుదేలైపోయే పరిస్థితి ఉంది. అయినా పరిశ్రమ 24 శాఖలు తెలంగాణ- ఆంధ్ర ప్రభుత్వాల నిర్ణయానికి కట్టుబడి ఉన్నాయి. ఎగ్జిబిటర్లు.. పంపిణీ వర్గాలు.. నిర్మాతలు థియేటర్ల బంద్ కి సహకరిస్తున్నారు.

అమలాపాల్ మళ్ళీ పెళ్లి చేసుకుందా...?


అమలాపాల్ మళ్ళీ పెళ్లి చేసుకుందా...?

Amalapal-Raguvaran-B-Tech--Girl-Marries-For-The-2nd-Time-Andhra-Talkies
అమలాపాల్ మళ్ళీ పెళ్లి చేసుకుందా...?
నాగచైతన్య హీరోగా నటించిన 'బెజవాడ' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి అమలాపాల్. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో క్రేజ్ తెచ్చుకుంది. రామ్ చరణ్ తో 'నాయక్' - అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మెగా హీరోలతో నటించినా ఎందుకో కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో తమిళ - మళయాల ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది ఈ భామ. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్ళి చేసుకుని అందర్ని ఆశ్చర్య పరిచింది. కానీ వీరి బంధం ఎక్కువకాలం నిలబడలేదు. వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటే అయింది. దీని మీద అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చేర్చే జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తీసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వి.ఐ.పి2 - ఆమె చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా మంచి పేరును తెచ్చి పెట్టాయి.

కరోనా వైరస్ ఆ హీరోయిన్ కి మేలు చేసిందంట


కరోనా వైరస్ ఆ హీరోయిన్ కి మేలు చేసిందంట

China-Virus-Corona-HelpS-For-That-Heoine-Andhra-Talkies
కరోనా వైరస్ ఆ హీరోయిన్ కి మేలు చేసిందంట
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ప్రజలు గడప దాటి బయటకి రావాలంటే పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద ప్రభావం చూపింది. ముఖ్యంగా కోట్ల రూపాయల లావాదేవీలతో కూడిన సినీ రంగం మీద మరింత ఎఫెక్ట్ చూపింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సినీ నటులు తమ సినిమా షూటింగ్ లను అర్ధాంతరంగా ముగించుకొని ఇంటికే పరిమితమయ్యారు. కొంతమంది సెలబ్రెటీలు అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తూ జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోని ఒక భామకు మాత్రం మేలే చేసిందంట.

వివరాల్లోకి వెళ్తే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న ఒక యువ కథానాయకి కరోనా వల్ల షూటింగులు నిలిచిపోయి విరామం దొరకడంతో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తుందంట.

నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్న స్టార్ హీరో

నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్న స్టార్ హీరో

Implications-For-The-producers-Because-Of-star-hero-Andhra-Talkies
నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్న స్టార్ హీరో
ఆ స్టార్ హీరో వల్ల నిర్మాతలకు చెమటలు పట్టేయడం గ్యారెంటీ. ఏదో ఒక విషయంలో రెగ్యులర్ గా లొల్లు పెడుతూ సదరు హీరో గారు వేసే వేషాలకు ఏం చేయాలో పాలుపోని సన్నివేశం ఎదురవుతోందట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో అన్నది అటుంచితే .. అతడితో నిర్మాతలకు ఇంకా ఎలాంటి చిక్కులు వచ్చి పడుతున్నాయి? అని ఆరాతీస్తే.. అబ్బో .. ఒకటా రెండా? బోలెడన్ని ఉన్నాయి.

సదరు హీరో ఇప్పటికే పలువురు హీరోయిన్లతో ఎఫైర్లు నడిపాడు. రకరకాల వివాదాల్లో చిక్కుకున్నాడు. లవ్ బ్రేకప్ తో పాటు కెరీర్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇక నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకుని సమయానికి షూటింగుకి వెళ్లకుండా ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి సినిమా అంతా అయిపోయాక ప్రమోషన్స్ కి రమ్మంటే ఎగ్గొట్టేస్తాడు. అతగాడి క్రమశిక్షణా రాహిత్యం వల్లనే కెరీర్ కూడా ఇప్పుడు డౌన్ ఫాల్ లో నడుస్తోంది. అయినా అతడు ఇప్పటికీ మారలేదుట. ఇంకా నిర్మాతల్ని ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. యాటిట్యూడ్ చూపిస్తూ నిత్యం నరకం పాల్జేస్తున్నాడట.

విజయ్ హీరోయిన్ కి అంత సీన్ ఉందా ...?


విజయ్ హీరోయిన్ కి అంత సీన్ ఉందా ...?

Actor-Ananya-Pandey-Sensational-Comments-On-Janvi-Andhra-Talkies
విజయ్ హీరోయిన్ కి అంత సీన్ ఉందా ...?
క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంకీ పాండే వారసురాలిగా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ అనన్య పాండే. అందం తో పాటు అభినయం కూడా ఈమె సొంతం. 'పతీ పత్నీ ఔర్ ఓహ్' 'అంగ్రేజీ మీడియం' చిత్రాలతో మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ బాలీవుడ్ భామ ప్రస్తుతం విజయ దేవరకొండ నటిస్తున్న మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'ఫైటర్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని కరణ్ జోహార్ భాగస్వామ్యంలో నటి చార్మ్ కౌర్ నిర్మిస్తున్నారు. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెలుగు తమిళం తోపాటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు.

కాగా ఈ చిత్రానికి మొదట విజయ్కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుందన్న ప్రచారం జరిగింది. గతంలో జాన్వీ కూడా విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ అంటూ ప్రస్థావించటం తో జాన్వీ విజయ్ జోడిగా నటించటం కన్ఫార్మ్ అని భావించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం లో నటించడం లేదని జాన్వీ ప్రకటించారు. పాన్ ఇండియా మూవీ కావడంతో జాన్వీ కాకపోయినా బాలీవుడ్ నటినే హీరోయిన్గా తీసుకోవాలని భావించిన చిత్రయూనిట్ మరో స్టార్ వారసురాలు అనన్య పాండేను తీసుకోవడం జరిగింది. ముంబైలో ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ ఈ మధ్యే పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగొచ్చింది.

ఆ లిస్టులో కనీసం సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా లేదా..?


ఆ లిస్టులో కనీసం సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా లేదా..?

Super-Star-Mahesh-Babu-No-More-Desirable-Man-Andhra-Talkies
ఆ లిస్టులో కనీసం సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా లేదా..?
ప్రముఖ వార్తాపత్రిక 'హైదరాబాద్ టైమ్స్' ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా "మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ 2019" జాబితాను విడుదల చేసింది. మహిళల విభాగం లో హీరోయిన్ సమంత మొదటి స్థానాన్ని పొందగా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ ప్రథమ స్థానంలో వరుసగా రెండోసారి నిలవడం విశేషం. అయితే హైదరాబాద్ టైమ్స్ విడుదల చేసిన 30మంది 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్' లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు లేదు. అవును మీరు చదివింది నిజమే.

మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ ఎంపికయ్యాడు ఓకే. కానీ అసలు 2012 2013 2015 సంవత్సరాలలో నెం.1 గా నిలిచిన మహేష్ బాబును లిస్టులోనే లేకుండా చేయడమే షాకింగ్. మహేష్ బాబు 2013లో ఇండియాకే మోస్ట్ డిజైరబుల్ పర్సన్ అలాంటి సూపర్ స్టార్ ని లిస్టులో నుండి తీసేయడం దారుణం అంటూ అభిమానులు బేజారవుతున్నారు. విజయ్ దేవరకొండ నెం.1 అయ్యాడు సరే కానీ మహేష్ బాబు పేరు కనీసం ముప్పై మంది లిస్టులో ఉండాలి కదా.. అని మహేష్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

నాలుగేళ్ల డేటింగ్ సంగతి బయటపెట్టిన విజయ్ దేవరకొండ భామ

నాలుగేళ్ల డేటింగ్ సంగతి బయటపెట్టిన విజయ్ దేవరకొండ భామ

Hero-Vijay-Devarakonda-Heroin-Sensational-On-Dating-Andhra-Talkies
నాలుగేళ్ల డేటింగ్ సంగతి బయటపెట్టిన విజయ్ దేవరకొండ భామ
సినీ రంగ ప్రముఖులు కానీ.. సెలబ్రిటీల తో మాట్లాడే సమయంలో వారి నుంచి వచ్చే సమాధానాలు ఎలా ఉన్నా.. మనం అడిగాం.. వారు చెప్పారన్నట్లుగా ఉంటుంది. మనం అడుగుతున్న విషయాలకు సంబంధించి వారు చెప్పే సమాధానాల వెనుక అసలు నిజం తెలిసినా.. తెలీనట్లుగా రాసుకోవటం మీడియాలో పని చేసే వారికి అనుభవమే. కొన్నిసార్లు మాత్రం అందుకు భిన్నమైన అనుభవం ఎదురవుతుంది. అలాంటి అనుభవమే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో విజయ దేవరకొండతో జతకట్టిన బ్రెజిల్ భామ ఇజాబెల్లే తో మాట్లాడినప్పుడు కలుగుతుంది.

ఉన్నది ఉన్నట్లుగా.. పెద్దగా దాచి పెట్టుకోకుండా ఓపెన్ అయ్యే ఈ బ్యూటీ తాజాగా ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. ప్రేమ మాటను ప్రస్తావించినంతనే.. హీరోయిన్ల నోటి నుంచి రోటీన్ గా వచ్చే జవాబుకు భిన్నంగా ఇజాబెల్లే చెప్పింది. తానిప్పటి వరకూ ఎవరినీ ప్రేమించలేదని.. కాకుంటే చదువుకునే రోజుల్లో మాత్రం ఒక వ్యక్తితో నాలుగేళ్లు డేటింగ్ చేసినట్లు చెప్పింది.

వారసత్వ సంపదగా 800కోట్లు కొల్లగొట్టిన హీరో..

వారసత్వ సంపదగా 800కోట్లు కొల్లగొట్టిన హీరో..

How-Saif-Ali-Khan-earned-back-the-Rs-800-crore-ancestral-Pataudi-Palace-Andhra-Talkies
వారసత్వ సంపదగా 800కోట్లు కొల్లగొట్టిన హీరో..
సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ లో ఎంతటి పేరును కలిగి ఉన్నాడో.. అంతటి ఆస్తిని కూడా కలిగి ఉన్నట్లు ఇటీవలే తెలిసింది. పటౌడీ రాజుల వంశానికి చెందిన సైఫ్ ప్రస్తుతం పట్టాభిషిక్తుడై రాజు గా నియమితుడయ్యాడు. ఏంటి ఎప్పుడో గడిచిపోయిన పటౌడీ వంశ రాజుల గురించి ఇప్పుడు చెప్తున్నారు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే పొరపాటే. సైఫ్ అలీఖాన్ తాత ఇఫ్తీకర్ అలీఖాన్ దశాబ్దాల పాలన అనంతరం పటౌడీల వంశంలో చివరివాడిగా పేరొందాడు. అయితే ఇప్పుడా వంశ వారసుడు సైఫ్ అలీఖాన్ కు ఈ మధ్యే వారి వంశ రాజరికం దక్కింది.

అవును. ప్రస్తుతం పటౌడీల వంశ వారసుడు సైఫ్ మాత్రమే. పటౌడీల వంశంలోని పూర్వికులు దశాబ్దాల క్రిందట భారతదేశంలో పరిపాలన సాగించినప్పుడు పేరు ప్రఖ్యాతలతో పాటు ఆస్తులను కూడా సంపాదించి పెట్టారు. స్వాతంత్ర్యానికి ముందు చివరిగా పటౌడీల వంశ రాజు ఇఫ్తీకర్ అలీఖాన్. ఆయన పరిపాలనలో ఆస్తులతో పాటు భారీ అంతస్తులను కూడా నిర్మించారు. అందులో ఒకటి గుర్గావ్ లోని పటౌడీ ప్యాలెస్. రాజవంశీయుల ప్యాలెస్ కాబట్టి సుమారుగా 15ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని సమాచారం.

అయ్యో అవన్నీ పుకార్లేనా?

అయ్యో అవన్నీ పుకార్లేనా?

Thalapathy-Super-Star-Hero-Vijay-To-Collaborate-With-His-AR-Murugadoss-Andhra-Talkies
అయ్యో అవన్నీ పుకార్లేనా?
తమిళ సూపర్ స్టార్ విజయ్ ఈమద్య కాలంలో చాలా జోరుమీదున్నాడు. చేసిన ప్రతి సినిమాతో వంద కోట్లు రెండు వందల కోట్లను వసూళ్లు చేస్తున్న విజయ్ ప్రస్తుతం ‘మాస్టర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇంతటి సంచలన సూపర్ స్టార్ తో తెలుగు లేడీ డైరెక్టర్ సుధ కొంగర ఒక సినిమాను తెరకెక్కించబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. కాని ఆ వార్తలు అన్నీ పుకార్లే అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మాస్టర్ చిత్రం తర్వాత విజయ్ చేయబోతున్న సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండబోతుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విజయ్ కూడా మురుగదాస్ కే ఓటు వేయాలని భావిస్తున్నట్లుగా తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన విషయాన్ని బట్టి అర్థం అవుతోంది.

ఆ పోజు నాకూ నచ్చింది: కియారా


ఆ పోజు నాకూ నచ్చింది: కియారా

Sexy-Heroin-Kiara-Advani-switched-off-DM-notifications-post-her-viral-photoshoot-Andhra-Talkies
ఆ పోజు నాకూ నచ్చింది: కియారా
కెరీర్ పీక్స్ లో ఉండగానే టాప్ లెస్ ఫోటోషూట్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఈ మధ్య కాలంలో టక్కున గుర్తొచ్చే పేరు కియారా అద్వానీ. ఏంటి ఏమైంది అవకాశాలు తగ్గిపోయాయేమో అని అందరు అనుకున్నారు. కానీ అదేం కాదు ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ క్యాలెండరు కోసం టాప్ లెస్ పోజు చేసిందని తర్వాత తెలిసింది. ఫోటోకోసమే అంత చేస్తే మరి సినిమా కోసం ఇంకెంత చేస్తుందో అనిపిస్తుంది కదా..!

ఆ ఫోటోలో మాత్రం కియారాను చూసి కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఒక ఆకును మాత్రమే తన చేతులతో పట్టుకొని అడ్డం పెట్టుకున్న పోజు పై కియారాను విపరీతంగా ట్రోల్ చేసారు. మీమ్స్ తయారుచేసి సోషల్ మీడియా అంతా ఆమెను కొంతకాలం మోశారు. ఈ అమ్మడు ఆ టాప్ లెస్ పోజు గురించి అడిగినప్పుడల్లా.. "కొత్తగా ఉంటుందని ట్రై చేశా.. మీకూ నచ్చిందా.. అయితే నాకూ నచ్చింది" అంటూ సిగ్గుపడుతుంది.

'తెలుగు' అభిమానం బుక్ చేసిందా? | Andhra Talkies

'తెలుగు' అభిమానం బుక్ చేసిందా?

World-Famous-Lover-Movie-Effect-on-Aishwarya-Rajesh-Andhra-Talkies
'తెలుగు' అభిమానం బుక్ చేసిందా? | Andhra Talkies
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయాక తేరుకున్నా ప్రయోజనం ఏం ఉంటుంది? తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ సన్నివేశం అదే. కోలీవుడ్ లో బిజీగా ఉన్న సమయంలో  తెలుగులోనూ సత్తా చాటాలని ప్లాన్ చేసింది. తొలి ప్రయత్నంగా కౌశల్య కృష్ణమూర్తి అనే ఓ స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అటుపై మిస్ మ్యాచ్ అనే మరో సినిమాలో నటించింది. ఆ సినిమా నిరుత్సాహాన్నే మిగిల్చింది. ఇదే సమయంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన భార్య పాత్రలో నటించే ఛాన్స్ ఒడిసిపట్టుకుంది.

టాలీవుడ్ లో ఇదే బిగ్ ఛాన్స్ కావడంతో వెనకా ముందు ఆలోచించకుండా విజయ్ కు భార్యగా.. ఓ బిడ్డకు తల్లి పాత్రలో నటించింది. అందులో  నేచురల్ పెర్సామెన్స్ తో ఆకట్టుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ఫలితం రివర్స్ అయ్యింది.  పైగా ఐశ్వర్య రోల్ కేవలం ఒక సెక్షన్ ఆడియెన్ కే కనెక్టయ్యేలా తీర్చిదిద్దడం తనకు మైనస్ గా మారింది. ఇప్పుడు లేటయినా ఆ తప్పుల్ని గ్రహించిందో ఏమో! భవిష్యత్ లో అమ్మ పాత్రలను చేయనంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వచ్చిన గుర్తింపు చాలు అంటూ వచ్చిన తల్లి పాత్రలను రిజెక్ట్ చేస్తోందట. అంతకుముందు కోలీవుడ్ ప్రయత్నాలు చేసినా అవన్నీ ఇప్పుడు బెడిసికొడుతున్నాయట.

కరోనాపై టాలీవుడ్ లో స్క్రిప్టులు రెడీ!


కరోనాపై టాలీవుడ్ లో స్క్రిప్టులు రెడీ!

China-Corona-Virus-Starts-To-Inspire-Filmmakers-Andhra-Talkies
కరోనాపై టాలీవుడ్ లో స్క్రిప్టులు రెడీ!
సహజంగా వైరస్ లపై కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయడం హాలీవుడ్ కే పరిమితం. ఇలాంటి కథలు అక్కడే పుడతాయి. ఉన్న వైరస్ లపై...ఫ్యూచర్ లో పుట్టుకొచ్చే వైరస్ లపై పరిశోధన నేపథ్యం...వైరస్ లపై ఎలా పోరాడాలి? ఇలాంటి వైపరిత్యాల వేళ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటివన్నీ సినిమాగా చూపించడం అంటే అదో సవాల్. అలాంటి స్క్రిప్ట్ లను ఆసక్తికరంగా  వండి వార్చే ట్యాలెంట్ హాలీవుడ్ రైటర్లకు.. దర్శకులకే ఉంది.  రెసిడెంట్ ఈవిల్ ఫ్రాంఛైజీ తరహాలో జాంబీ మూవీస్ ఇందుకు చక్కని ఎగ్జాంపుల్.

ప్రస్తుతం కరోనా (కొవిడ్-19) ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయానక వైరస్ గా పాపులరైంది. మూడు దేశాలు మినహా దాదాపు ప్రపంచాన్ని చుట్టేసింది ఈ మహమ్మారీ. శాస్త్ర వేత్తల మేథస్సుకే సవాల్ గా మారిన వైరస్ ఇది. ప్రపంచవ్యాప్తంగా దీని భారిన పడిన వారిలో మరణాల సంఖ్య గణనీయంగా పెరుగడం భయపెట్టేస్తోంది.

నీకంటే వీధి కుక్కలు బెటర్..సురేఖా వాణి ఫైరింగ్!

నీకంటే వీధి కుక్కలు బెటర్..సురేఖా వాణి ఫైరింగ్!

Actor-Surekha-Vani-Shocking-Comments-Netizens-Andhra-Talkies
నీకంటే వీధి కుక్కలు బెటర్..సురేఖా వాణి ఫైరింగ్!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి గురించిన పరిచయం అవసరం లేదు. తెలుగు-తమిళ చిత్రాల్లో అడపాదడపా అవకాశాలు అందుకుంటున్న ఈ సీనియర్ నటి బుల్లితెర యాంకర్ గానూ పాపులర్. సురేఖ ఎందుకనో ఇటీవల `ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్` అన్న చందంగా చెలరేగడం చర్చకొచ్చింది.

తాజాగా నెటిజనుల నుద్ధేశించి సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంతకీ ఆవిడ ఏమన్నారు? అంటే.  ``నీ కంటే వీధి కుక్కలు లైఫ్ ను చాలా బాగా లీడ్ చేస్తాయి`` అంటూ ఓ రేంజులో విరుచుకుపడడం వేడెక్కిస్తోంది. అయితే సురేఖ ఉన్నట్టుండి ఇంతగా ఫైర్ అవ్వడానికి కారణమేమిటి? అంటే.. అందుకు బలమైన రీజనే ఉంది. తనను ఉద్ధేశించి కొందరు నెటిజనులు వల్గర్ కామెంట్స్ చేశారని తెలుస్తోంది.  నటిగా ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైమ్ లోనే మంచి పేరు తెచ్చుకున్న సురేఖా వాణి దుబాయ్ శీను- బొమ్మరిల్లు- బృందావనం- రెడీ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. అక్కగా.. వదినగా సహాయక పాత్రల్లో సురేఖ అలరించింది.

శివ గ్యాంగ్ లో చైన్ తెంచి ఫైట్లు చేసే బ్యాచ్ లో ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ ఉన్నారా?


శివ గ్యాంగ్ లో చైన్ తెంచి ఫైట్లు చేసే బ్యాచ్ లో ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ ఉన్నారా?  

Director-Puri-Jagannath-With-Nagarjuna-During-Shiva-Movie-Andhra-Talkies
శివ గ్యాంగ్ లో చైన్ తెంచి ఫైట్లు చేసే బ్యాచ్ లో ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ ఉన్నారా? 
అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ శివ సంచలనాల గురించి తెలిసిందే. నైన్టీస్ లో గ్రేట్ మ్యూజికల్ హిట్ చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున డీసెంట్ పెర్ఫామెన్స్ కి ఫిదా కాని వాళ్లు లేరు. ఇక ఇళయరాజా మాస్టర్ క్లాస్ మ్యూజిక్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టరే. ఇక నాగార్జున బ్యాచ్ లో నటించిన స్నేహితులు అందరూ టాలీవుడ్ లో దశాబ్ధాల పాటు స్టార్లుగా వెలిగారు.

అదంతా సరే కానీ.. శివ గ్యాంగ్ లో చైన్ తెంచి ఫైట్లు చేసే బ్యాచ్ లో ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ ఉన్నారా?  ఒకవేళ ఉంటే తెలుగు వెర్షన్ లో ఎక్కడా కనిపించలేదేమిటి?  తాజాగా రివీలైన `శివ` మూవీ క్లాసిక్ ఫోటోలో పూరి ఆ గ్యాంగ్ లో కనిపించారు? ఇదెలా సాధ్యం? అన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయి. అయితే విషయం ఆరా తీస్తే పూరీకి సంబంధించిన చాలా విషయాలు తెలిశాయి. ఈ మూవీకి పూరి కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే. ఆర్జీవీ వద్ద శిష్యుడిగా పని చేశారు. అయితే శివ హిందీ వెర్షన్ రీమేక్ కి మాత్రం శివ గ్యాంగ్ లో పూరి కూడా ఓ చిన్న పాత్రలో నటించేశారట. ఇక పూరీ తాను డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలో ఇలా మెరిసి అలా వెళ్లిపోతుంటాడన్న సంగతి తెలిసిందే.

అనుష్కకి యాక్టింగ్ రాదన్న స్టార్ డైరెక్టర్!


అనుష్కకి యాక్టింగ్ రాదన్న స్టార్ డైరెక్టర్!

Director-Puri-Jagannadh-Shocking-Comments-On-Anushka-Andhra-Talkies
అనుష్కకి యాక్టింగ్ రాదన్న స్టార్ డైరెక్టర్!
15ఏళ్ల క్రితం కేవలం యోగా టీచర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యి ఏకంగా టాలీవుడ్ నే ఏలింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ అన్న పిలుపందుకుంది. స్టార్ హీరోలకు దీటుగా రాణిస్తూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటింది. బంపర్ బాక్సాఫీస్ కలెక్షన్లతోనూ తనలోని ధీరత్వం ఏంటో చూపించింది. ఈ భామ ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి. మంగుళూరుకు చెందిన ఈ బ్యూటీ అరుంధతి.. రుద్రమదేవి.. భాగమతి లాంటి చిత్రాలతో గొప్ప నాయిక అన్న పేరు తెచ్చుకుంది.

2005లో నాగార్జున హీరోగా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన `సూపర్` సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. సూపర్ హాట్ అందాలతో ఆరంభమే మాయ చేసింది. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన `విక్రమార్కుడు` సినిమాతో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అటుపై వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ తిరుగులేని అగ్ర కథానాయికగా ఎదిగారు.

రీమేక్ నిర్మాతలకు భయమేస్తోందా ?

రీమేక్ నిర్మాతలకు భయమేస్తోందా ?

Tollywood-Producers-Fear-On-Remake-Movies-Andhra-Talkies
రీమేక్ నిర్మాతలకు భయమేస్తోందా ?
టాలీవుడ్ లో ప్రస్తుతం అరడజను పైగా రీమేక్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో వెంకటేష్ నారప్ప పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' రామ్ 'రెడ్' నితిన్ 'అంధదున్' ఇలా పెద్ద లిస్టే ఉంది. అయితే మేకింగ్ లో ఉన్న ఈ రీమేకులు ఎంత వరకూ క్లిక్ అవుతాయనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న గా మిగిలింది. దీనికి రీజన్ లేటెస్ట్ గా వచ్చిన కొన్ని రీమేక్స్ బోల్తా కొట్టడమే. వరుణ్ తేజ్ 'వాల్మీకి' బెల్లంకొండ 'రాక్షసుడు' మాత్రమే హిట్ అనిపించుకున్నాయి.

కెరీర్ లో ఇప్పటి వరకూ రీమేక్ చేయని దిల్ రాజు ఏరికోరి మరీ తమిళ్ క్లాసిక్ '96' సినిమాను తెలుగులో శర్వానంద్ సమంతల తో రీమేక్ చేసాడు. ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఒరిజినల్ దర్శకున్నే తీసుకున్నాడు కానీ రిజల్ట్ తేడా కొట్టింది. కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' కూడా అంతే. ఎన్ని మార్పులు చేసి తీసినా సంక్రాంతి బరిలో ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇవే కాదు గతంలోనూ రీమేక్ సినిమాలు ఆడింది చాలా తక్కువే.

జక్కన ముహూర్తానికే కుర్ర హీరోల సినిమాలు !

Young-Hero-Movies-On-Director-Rajamouli-Release-Date-Andhra-Talkies
జక్కన ముహూర్తానికే కుర్ర హీరోల సినిమాలు !

జక్కన ముహూర్తానికే కుర్ర హీరోల సినిమాలు !

రాజమౌళి ఏదైనా డేట్ ఫిక్స్ చేశాడంటే దానికి ఓ ప్రాముఖ్యత ఉంటుందనేది నమ్మాల్సిందే. బాహుబలి సిరీస్ లకు కూడా మంచి డేట్స్ ముందే లాక్ చేసుకొని రిలీజ్ చేసారు జక్కన్న. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ విషయంలోనూ అదే చేసాడు. ఆగస్ట్ లో సినిమాలు పెద్దగా రిలీజ్ కానీ టైం చూసి జులై 30 న డేట్ లాక్ చేసుకున్నాడు. కట్ చేస్తే షూటింగ్ డిలే అవ్వడం తో సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపాడు.

దీంతో రాజమౌళి ముందు పెట్టిన డేట్ ఫ్రీ గా ఉంది. అందుకే ఇప్పుడా డేట్ ను లాక్ చేసుకొని జక్కన్న ముహుర్తానికే సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నారు కుర్ర హీరోలు. ఇప్పటికే నితిన్ తన 'రంగ్ దే' కోసం ఈ డేట్ ని లాక్ చేసుకున్నట్లు సమాచారం. మరో వైపు వరుణ్ తేజ్ కూడా తన 10వ సినిమాను అదే డేట్ కి రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడట. ఇంకా ఐదు నెలలు ఉండటం తో నిర్మాతలు అల్లు వెంకటేష్ సిద్దు డేట్ ని లాక్ చేసుకునే పనిలో ఉన్నారట.

ఏయ్ పిల్లా.. కమ్ముల సార్ మార్క్ మెలోడీ

-Ay-Pilla--Lyrical--A-Mesmerizing-Melody-From--Love-Story-Andhra-Talkies
ఏయ్ పిల్లా.. కమ్ముల సార్ మార్క్ మెలోడీ

ఏయ్ పిల్లా.. కమ్ముల సార్ మార్క్ మెలోడీ

అక్కినేని నాగ చైతన్య.. సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'లవ్ స్టోరి'. ఆసక్తికరమైన కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుండి 'ఏ పిల్లా' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు పవన్.Ch సంగీతం అందిస్తున్నారు. ఈ పాటకు సాహిత్యం అందించినవారు చైతన్య పింగళి. పాడినవారు హరిచరణ్. "ఏయ్ పిల్లా పరుగున పోదామా ఏ వైపో జంటగా ఉందామా రారా కంచే దుంకి చక చక ఉరుకుతూ ఆ రంగుల విల్లుని తీసి నీ వైపు వంతెన వేసి రావా" సింపుల్ పదాలతో సాహిత్యం ఆహ్లాదకరంగా సాగింది. ఈ పాటకు తగ్గట్టుగా పవన్ ఓ మంచి ట్యూన్ అందించారు. హరిచరణ్ కూడా చక్కగా పాడారు. స్లో సాంగ్స్.. మెలోడీస్ ఇష్టపడేవారికి నచ్చుతుందేమో కానే ఈ పాట మిగతావారికి ఒక్కసారి వినగానే కనెక్ట్ అయ్యేది కాదు. తినగతినగ వేము తియ్యనుండు తరహాలో వినగ వినగా ఏయ్ పిల్లా నచ్చవచ్చు!

ఫోటో స్టోరీ: గ్లామర్ తో సంపుతున్న కసాండ్రా

Photo-Story-Sexy-Heroin-Regina-Cassandra-Strikes-a-Heart-String-Andhra-Talkies
ఫోటో స్టోరీ: గ్లామర్ తో సంపుతున్న కసాండ్రా

ఫోటో స్టోరీ: గ్లామర్ తో సంపుతున్న కసాండ్రా

రెజీనా కసాండ్రా ఖాతాలో హిట్లు ఉన్నాయి.. తెలుగు ప్రేక్షకులలో చక్కటి గుర్తింపు సాధించిన భామే కానీ ఎందుకు స్టార్ హీరోయిన్ లీగ్ లోకి మాత్రం చేరలేకపోయింది. పోయినేడాది అడివి శేష్ సినిమా'ఎవరు' సినిమాతో ఓ మంచి హట్ ను తన ఖాతాలో వేసుకుంది. సినిమాలతో ఊరుకోకుండా సోషల్ మీడియా ఫైర్ డిపార్ట్ మెంట్ సభ్యురాలిగా అంతర్జాలం అల్లకల్లోలం అయ్యేలా మంటలు పెట్టే డ్యూటీలు.. అందులోనూ ఓవర్ టైమ్ చేస్తూ ఉంటుంది.

ఈ సామాజిక మాధ్యమాలు ఎలా ఉంటాయంటే ఒక్కసారి పుసుక్కున నోరు జారి బీకామ్ ఫిజిక్స్ అన్నందుకు కలికాలం కంప్లీట్ అయ్యేదాకా ఆ పదం అజరామరంగా నిలిచి పోయేంత పదిలంగా ఉంచుతాయి. ఇక హాటు ఫోటోలు పోస్ట్ చేస్తే అవి కూడా అంతకంటే పదిలంగా మన తర్వాత పదో తరం కూడా వాటిని చూసి లొట్టలు వేసేంత స్థాయిలో ఉంటాయి. ఈమధ్య అలాగే రెజినా పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఈ ఫోటోలో రెజీనా ఓ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి టన్నుల కొద్ది అందాలను ధారపోస్తూ.. క్లోజ్ అప్ యాడుకు వచ్చే కత్తి లాంటి మోడల్స్ లాగా భలేగా నవ్వింది. డ్రెస్ లో హాట్ నెస్.. నవ్వులో కోల్డ్ నెస్ రెండూ కలిసిన రెజినా ఫోటో చూడకుండా.. ఇలాంటి ఫోటో స్టోరీలు చదవకుండా కేవలం కరోనా వైరసులు.. వుహాను నాన్ వెజ్ డిష్షుల న్యూసులే చూస్తూ ఉంటే కళాపోషణ కూసంతయినా లేనట్టే.

ఫేడవుట్ బ్యూటీ ఎంత చేసినా ఏం లాభం?

Sexy-Heroin-Avika-Gor-Beauty-Looks-Andhra-Talkies
ఫేడవుట్ బ్యూటీ ఎంత చేసినా ఏం లాభం?

ఫేడవుట్ బ్యూటీ ఎంత చేసినా ఏం లాభం?

బుల్లితెరపై బాలనటిగా ఓ వెలుగు వెలిగి అటుపై పెద్దతెరపైకి ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. రాజ్ తరుణ్ `ఉయ్యాల జంపాల` సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తరవాత వరుసగా సినిమాల్లో నటించింది. అయితే సెంటిమెంటు పరిశ్రమకు కావాల్సిన హిట్టు లేకపోవడంతో అవకాశాలు లేకుండా పోయాయి. అలా అవికా గోర్ పరిశ్రమకు దూరమైంది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఏం చేస్తోంది? అంటే ఇటీవల పూర్తిగా జిమ్ కే అంకితమైపోయిందట. బొద్దుతనం నుంచి మారేందుకు చాలానే మేకోవర్ ట్రై చేసింది. తాజాగా రివీల్ చేసిన ఫోటోలు చూశాక అభిమానులు షాక్ తినాల్సిందే. అసలు ఆ బొద్దుగుమ్మనేనా.. ఇంతగా ఛేంజైంది? అని షాక్ తింటున్నారంతా. పూర్తిగా చబ్బీ లుక్ నుంచి మారిపోయి వారెవ్వా అనిపిస్తోంది.

తాజా ఫోటోషూట్ లో అవికా ఎంతో స్మార్ట్ గా కనిపిస్తోంది. అన్నట్టు ఈవిడ అవికాయేనా? అని డౌట్లు పుట్టుకొచ్చేలా ఆ ఐ లైనర్ .. షేడ్స్ చిక్ షేప్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు పూర్తిగా షేక్ చేసేందుకే బాడీని షేపప్ చేసిందని అర్థమవుతోంది. అయితే ఇంత శ్రమించినందుకు ఇప్పటికిప్పుడు టాలీవుడ్ లో అవకాశం ఇచ్చేది ఎవరు? అంటే ఇంకా సమాధానం రావాల్సి ఉంది. అన్నట్టు అప్పట్లో ఈ అమ్మడు కో-టీవీ ఆర్టిస్టుతో ప్రేమలో పడిందని ప్రచారమైంది. అందులో పరిణతి ఎంత? అన్నది మాత్రం బయటకు తెలియడం లేదు.

నితిన్ పెళ్లికి కరోనా ఎఫెక్ట్... వేదిక మారుతుందా?

Carona-Virus-Effect-on-Nithin-Marriage-Andhra-Talkies
నితిన్ పెళ్లికి కరోనా ఎఫెక్ట్... వేదిక మారుతుందా?

నితిన్ పెళ్లికి కరోనా ఎఫెక్ట్... వేదిక మారుతుందా?

టాలీవుడ్ లో పెళ్లికాని ప్రసాదులకు కొదవ లేదు. ఇటీవల ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకొని ఒక ఇంటివారు అవుతున్నారు. ఈ మధ్యనే తన సీక్రెట్ లవ్ ను ఓపెన్ చేసి.. తన పెళ్లి ముచ్చటను చెప్పేశారు హీరో నితిన్. పెద్దలు నిర్ణయించినట్లుగా ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్ కింద దుబాయ్ లో చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. దుబాయ్ లో పెళ్లి అనుమానంగా మారింది.

దీంతో.. పెళ్లి డేట్ మీద కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. నితిన్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లిని అనుకున్న తేదీన.. అనుకున్న ముహుర్తానికి జరపాలని డిసైడ్ అయ్యారట. కరోనా కారణంగా దుబాయ్ లో పెళ్లి ఇబ్బందిగా మారితే.. దాన్ని హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెబుతున్నారు.

ఇస్మార్ట్ భామకు మాస్ రాజా సినిమా లాభమేనా?

Heroin-Nidhhi-Agarwal-To-Romance-with-Ravi-Teja-Andhra-Talkies
ఇస్మార్ట్ భామకు మాస్ రాజా సినిమా లాభమేనా?

ఇస్మార్ట్ భామకు మాస్ రాజా సినిమా లాభమేనా?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమాలో రవితేజ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు.

రవి తేజ లాంటి సీనియర్ స్టార్ హీరో పక్కన ఇరవైల వయసుండే నిధి హీరోయిన్ గా సూట్ కాదేమోననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే మాస్ రాజా మాత్రం మొదటి నుంచి కొత్త హీరోయిన్లతో నటించేందుకు ఆసక్తి చూపించేవారు. కొన్నేళ్ళ క్రితం రవితేజతో ఎవరైనా కొత్త హీరోయిన్ నటిస్తే వారికి కెరీర్ లో మంచి బ్రేక్ వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉండేది. కానీ ఈమధ్య ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రవితేజ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరుస్తూ ఉండడంతో హీరోయిన్లకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు.  రవి తేజ కు జోడీగా నటించిన హీరోయిన్ల కెరీర్లు నత్తనడకన సాగుతున్నాయి. మరి ఈ ఇస్మార్ట్ భామకు రవితేజ సినిమా తర్వాత అవకాశాలు పెరుగుతాయో లేదో వేచి చూడాలి.

ఔట్ డేటెడ్ హీరోయిన్ కి అంత అవసరమా?

Heroin-Kajal-does-not-give-any-discount-for-Teja-Andhra-Talkies
ఔట్ డేటెడ్ హీరోయిన్ కి అంత అవసరమా?

ఔట్ డేటెడ్ హీరోయిన్ కి అంత అవసరమా?

హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం అయ్యింది. స్టార్ హీరోయిన్ గా చాలా సంవత్సరాలు వెలుగు వెలిగిన ఈ అమ్మడు ఈమద్య కాలంలో కాస్త ఫేడ్ ఔట్ అవుతుంది. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో మినహా మరే సినిమాలో కూడా ఈమె నటించడం లేదు. అయినా కూడా ఈ అమ్మడు తన పారితోషికంను తగ్గించుకోవడం లేదు. తన వద్దకు వచ్చిన నిర్మాతలకు భారీ పారితోషికం చెప్పి భయపెడుతుంది అంటూ ఇండస్ట్రీలో టాక్ ఉంది.

తాజాగా ఈ అమ్మడికి తేజ దర్శకత్వం లో గోపీచంద్ హీరోగా రూపొందబోతున్న అలిమేలుమంగ వెంకటరమణ చిత్రంలో ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే మూడు సార్లు తేజ దర్శకత్వం లో నటించిన కాజల్ మరోసారి నటించడం కన్ఫర్మ్ అయ్యిందని అనుకుంటున్న సమయం లో ఆ సినిమాలోకి గోపీచంద్ కు జోడీగా మరో హీరోయిన్ రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ చిత్రం కోసం కాజల్ అగర్వాల్ ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికంను డిమాండ్ చేసిందట.

మాజీ భర్తపై ప్రముఖ నటి కేసు

Suchitra-Krishnamoorthi-files-case-against-ex-husband-Shekhar-Andhra-Talkies
మాజీ భర్తపై ప్రముఖ నటి కేసు

మాజీ భర్తపై ప్రముఖ నటి కేసు

సుచిత్రా కృష్ణమూర్తి.. ప్రముఖ గాయని నటి రచయిత చిత్రకారిణి.. అన్ని రంగాల్లో అందెవేసిన చేయి గల బహుముఖ ప్రజ్ఞాశాలి. అయితే తాజాగా ఆమె తన భర్తపై కేసు పెట్టడం సంచలనమైంది.

1997లో ఆమె ప్రసిద్ధ దర్శకుడు శేఖర్ కపూర్ ను వివాహమాడారు. వీరికి కావేరి అనే కూతురు కూడా ఉంది. ఆమె కూడా తల్లి బాటలో సంగీతరంగంలో రాణిస్తోంది.

తాజాగా ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న పడకగదుల ఫ్లాట్ లో నటుడు కబీర్ బేడి భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఈ ఫ్టాట్ తన మాజీ భర్త శేఖర్ కపూర్ కు చెందిందని.. చట్ట ప్రకారం ఈ ఫ్టాట్ తమ కుమార్తె కావేరికి చెందుతుందని సుచిత్ర వాదిస్తోంది. నాలుగేళ్లుగా కబీర్ బేడిని ఇళ్లును ఖాళీ చేయాలని ఆమె కోరుతోంది. వాళ్లు ఖాళీ చేయకపోవడంతో తాజాగా ఆమె కోర్టును ఆశ్రయించారు.

మాజీ భర్త నుంచి రావాల్సిన ఆస్తి కోసం న్యాయపోరాటానికి దిగారు. ఈ మేరకు భర్త శేఖర్ కపూర్ కు నోటీసులు పంపించినా అతడు స్పందించకపోవడంతో కేసు పెట్టి కోర్టులో పోరాడుతోంది.

రెజీనా ఆ పాత్రకు సెట్ అవ్వలేదా?

Did-you-Ever-Imagine-Regina-Like-This-Andhra-Talkies
రెజీనా ఆ పాత్రకు సెట్ అవ్వలేదా?

రెజీనా ఆ పాత్రకు సెట్ అవ్వలేదా?

చెన్నై బ్యూటీ రెజీనా కెరీర్ డైలమా గురించి తెలిసిందే. ఐదారేళ్లుగా బండి నడిపిస్తున్నా.. ఏదీ అంత ఈజీగా లేదు. ఈ అమ్మడు నటించిన ఏ సినిమా సరైన విజయం సాధించలేదు. అయినా ప్లాప్ లతో సంబంధం లేకుండా అవకాశాలు ఒడిసిపట్టుకుంది. కానీ ఎందుకనో టైమ్ మాత్రం కలిసిరాలేదు. ఇన్నాళ్లు గ్లామర్ అవకాశాలిచ్చినా.. ఇటీవలే సిసలైన పెర్ఫామెన్స్ కి సంబంధించిన టెస్ట్ మొదలైంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఆ ఛాన్స్ కూడా లేకపోవడంతో సొంత గూటి(కోలీవుడ్)కి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూర్తిగా కోలీవుడ్ పైనే దృష్టి నిలిపింది. లక్కీగా మాతృభాష తనని బాగానే ఆదుకుంటోందని చెప్పాలి.

#PSPK26 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నచ్చనిది ఇదే!

No-Hungama-Over-Vakeel-Saab-First-Look-Andhra-Talkies
#PSPK26 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నచ్చనిది ఇదే!

#PSPK26 పవన్ కి నచ్చనిది ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా మూవీలో నటిస్తున్నారు అంటే ఫ్యాన్స్ లో హంగామా తెలిసిందే. ఆయన బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు అంటే ఫ్యాన్స్ కి పండగే. పైగా చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాడంటే ఆయన సినిమా కోసం ఎంతగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారో అంచనా వేయొచ్చు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. తన కెరీర్ 26వ సినిమాగా బాలీవుడ్ సూపర్ హిట్ `పింక్`ని రీమేక్ చేస్తున్నారు. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

మొన్న శంకర్..నేడు కమల్..ఏం జరుగుతోంది?

CBCID-Summons-to-Hero-kamal-haasan-Andhra-Talkies
మొన్న శంకర్..నేడు కమల్..ఏం జరుగుతోంది?

మొన్న శంకర్..నేడు కమల్..ఏం జరుగుతోంది?

ఇండియన్-2’ సెట్ లో  క్రేన్ ప్రమాదం వార్త కోలీవుడ్ ను కుదిపేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని షూటింగ్ స్పాట్ లో ఫోకస్ లైట్లున్న భారీ క్రేన్ తెగి కింద పడటంతో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ - ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్ - ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు దుర్మరణం చెందగా...మరో తొమ్మిదిమంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో చిత్ర టీం షాక్ కు గురైంది. నిబంధనలకు వ్యతిరేకంగా పరిమితికి మించిన భారీ క్రేన్ ను ఉపయోగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణ చేపట్టిన సీబీసీఐడీ...చిత్ర దర్శకుడు శంకర్ ను విచారణ జరిపారు. తాజాగా ఈ చిత్ర హీరో కమల్ హాసన్ విచారణకు హాజరుకావాలని సీబీసీఐడీ సమన్లు జారీ చేసింది. కేంద్ర ఆర్ధిక నేరవిభాగం కార్యా లయంలో మంగళవారం జరిగే విచారణకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని కమల్కు సమన్లు జారీ అయ్యాయి.

శ్రుతి అన్ స్టాపబుల్.. కానీ ఏం లాభం?

Heroin-Shruti-Hasan-Unstoppable-Photoshoots-Andhra-Talkies
శ్రుతి అన్ స్టాపబుల్.. కానీ ఏం లాభం?

శ్రుతి అన్ స్టాపబుల్.. కానీ ఏం లాభం?

సోషల్ మీడియా ట్రెండ్ లో నిరంతర ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ.. అందాల కథానాయికలు దూసుకెళుతున్న తీరు హాట్ టాపిక్. కెరీర్ కోసం పాట్లు ఇవి. నిరంతరం తమని తాము లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు ఇలా వేడెక్కిస్తూనే ఉంటారు. ఇక ఇతర భామల్లానే అందాల శ్రుతిహాసన్ ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.

రెగ్యులర్ ఫోటోషూట్లతో నిరంతరం ఇన్ స్టాగ్రమ్ ని హీటెక్కించేస్తోంది. తాజాaగా రివీల్ చేసిన ఫోటోలో కార్పొరెట్ లుక్ తో శ్రుతి అదరగొట్టింది. మునుపటి లానే తనలో అందాలు ఏమాత్రం తగ్గలేదని ఛాలెంజ్ విసురుతున్నట్టే కనిపిస్తోంది. ఆ సన్నజాజి నడుముపై ఠీవిగా అలా చేతులు వేసి ఎంత దర్జాగా నించుందో! సూదంటు చూపులతో గుచ్చేస్తోంది.

అయినా ఏం లాభం? ఇలా ఫోటోషూట్లతో వర్కవుటయ్యే రోజులు కావు ఇవి. సరైన అవకాశం రావాలి. వచ్చాక దాంతో బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా రీలాంచ్ లో నిలదొక్కకోవడం ఈజీ కానే కాదు. మరి డాడ్ కమల్ హాసన్ సూచనలు ఏవైనా తీసుకుంటోందా లేదా? అన్నది అటుంచితే శ్రుతి ప్రస్తుతం రవితేజ ససరసన క్రాక్ లో నటించనుంది. తమిళం- హిందీలోనూ సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తోంది.
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...