మలైకా అందుకు పనికి రానంటోందిగా

Malaika-Arora-Khan-on-Item-Songs-Andhra-Talkies
Malaika-Arora-Khan-on-Item-Songs-Andhra-Talkies
మలైకా అరోరా.. ఈ పేరు వినగానే సెన్సేషనల్ ఐటెం సాంగ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. 20 ఏళ్ల క్రితం దిల్ సే మూవీలో షారూక్ ఖాన్ తో కలిసి 'ఛయ్య ఛయ్య' పాటలో నర్తించినప్పటి నుంచి ఇప్పటివరకూ.. ఐటెం సాంగ్స్ తోనే ఫుల్ ఫేమస్ అయిపోయింది.

దబాంగ్ మూవీలో 'మున్నీ బద్నాం హుయి' అంటూ చేసిన స్పెషల్ సాంగ్ తర్వాత విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్ అని తీస్తే.. 'కెవ్వు కేక'లు పెట్టించేసింది. దీనికంటే ముందే తెలుగులో మహేష్ బాబుతో అతిథి మూవీలో 'రాత్రయిన నాకు ఓకే' అంటూ చిందులేసింది. ఇలా మలైకా పేరు చెబితే పాటలు తప్ప గుర్తుకొచ్చే సినిమా రోల్ ఏదీ ఉండదు. మరి ఈ విషయంలో మలైకా ఏమనుకుంటోందో అడిగితే.. దిమ్మదిరిగి బొమ్మ కనిపించే ఆన్సర్ చెప్పింది మలైకా అరోరా.

అనసూయకు టైము లేదు బాసూ

Anasuya-Refuses-For-NTR-Bigg-Boss-Show-Andhra-Talkies-Telugu
వారానికి జూనియర్ ఎన్టీఆర్ కనిపించేది ఓ రెండు రోజులు మాత్రమే. కాని మిగతా రోజులంతా ఆ షోలో ఉన్న కంటెస్టంట్లే నెట్టుకురావాలి. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు వర్షన్ ను మరింత రంజింపచేయడానికి మనోళ్ళు కొత్త కంటెస్టంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా లోపలకి పంపిస్తారని టాక్ వచ్చంది. ఇందులో ప్రముఖంగా హాట్ యాంకర్లైన అనసూయ మరియు రష్మి పేర్లు వినిపించాయి.

అయితే ఈ బిగ్ బాస్ అంటేనే కాస్త పేరున్న సెలబ్రిటీలు కంగారుపడుతున్నారు. ఎందుకంటే అక్కడ మేకప్ లేకుండా కనిపించాలి అలాగే ఒరిజినల్ గా ఎలా ఉంటారో కూడా తెలిసిపోతుంది. అందుకే చాలామంది ఈ అవకాశాన్ని వద్దని అంటున్నారట. ఇప్పుడు అనసూయ కూడా నో చెప్పేసింది. ''నాకు నా సినిమా కమిట్మెంట్లు.. యాంకరింగ్ వలన.. చాలా బిజీగా ఉన్నాను. అసలు డేట్లు ఖాళీగా లేవు. కాబట్టి బిగ్ బాస్ చేయలేను'' అంటూ చెప్పేసింది అనసూయ. అయితే బిగ్ బాస్ లో ఉన్నోళ్ళందరూ ఖాళీగా ఉన్నవారేనా అనసూయా? కాదులే బేబి.

ఇకపోతే పోసాని అండ్ రష్మి కూడా ఈ బిగ్ బాస్ కు నో చెప్పేసినట్లు టాక్ వస్తోంది. కాకపోతే మరో ఇద్దరు సెలబ్రిటీలతో ఇప్పుడు బిగ్  బాస్ వారు సంప్రదింపులు జరుపుతున్నారట. కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడి ఒప్పించేందుకు కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి బిగ్ బాస్ షో మాత్రం ధనరాజ్ క్రియేట్ చేస్తున్న కాంట్రోవర్శీలు.. ముమాయత్ ఓవర్ యాక్షన్.. సమీర్ పంచులతో జరిగిపోతోంది. 

నాగబాబు... కెల్విన్ అయిపోయాడే!

Naga-Babu-seems-to-have-appealed-Media-not-to-circulate-his-photograph-as-that-of-Calvin-Andhra-talkies-telugu
తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకించి తెలుగు సినీ ఇండస్ట్రీ టాలీవుడ్ ను అతలాకుతలం చేసేస్తున్న డ్రగ్స్ దందాలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఈ విషయాలన్నీ నిజమో - కాదో తెలియదు గానీ... తెరపైకి వచ్చిన ప్రతి అంశంపైనా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ - ఆయన బృందం సభ్యులను ఊటంకిస్తూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఈ విషయాల్లో కొన్నింటినీ స్వయంగా దర్యాప్తు బృందమే విడుదల చేసిందన్న వాదన కూడా లేకపోలేదు. అయితే పూర్తి వివరాలను అందించకుండా... ఆయా విషయాలకు సంబంధించిన క్లూలు విడుదల చేస్తూ దర్యాప్తు అధికారులు కేసుకు ఉన్న ప్రాధాన్యాన్ని అటు జనానికి ఇటు ప్రభుత్వానికి తెలిసేలా చేశారన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఈ క్రమంలో ఈ దందాతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఇప్పటికే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సినిమాటోగ్రాఫర్ శ్యాం కే. నాయుడులను సిట్ అధికారులు విచారించారు. ఈ విచారణ సందర్భంగా పోలీసులు ఓ వ్యక్తి ఫొటోను పూరీ జగన్నాథ్ ముందు పెట్టినట్లుగా వార్తలు వినిపించాయి. సదరు ఫొటో ఇటీవల జరిగిన జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్కు చెందినదని అందులో కెల్విన్ ఉన్నాడని ప్రచారం జరిగింది. ఇదే అదనుగా సదరు ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఇతడేనంటూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. అసలు పోలీసులు ఏ ఫొటోను పూరీ ముందు పెట్టారో అసలు అలాంటి ఘటన విచారణలో జరిగిందో లేదో కూడా ఒక్క సిట్ సభ్యులతో పాటు పూరీకి మాత్రమే తెలుసు. అలాంటిది తమ సమక్షంలోనే విచారణ జరిగిందన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి కెల్వినేనని ఇతడే కెల్విన్ అంటూ ఓ ఫొటోను ప్రసారం చేశాయి.

అయితే ఆ ఫొటో కెల్విన్ ది కాకపోగా... బెంగళూరుకు చెందిన నాగబాబు అనే వ్యక్తిదట. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే మీడియా ఛానెళ్లకు ఫోన్ చేసి మరీ వివరిస్తే గానీ జరిగిన పొరపాటు తెలియలేదట. తెలుగు న్యూస్ ఛానెళ్లలో తన ఫొటో వస్తున్న విషయాన్ని తెలుసుకున్న నాగబాబు... దానిని నిర్ధారించుకుని అక్కడి నుంచే ఆయా మీడియా సంస్థలకు ఫోన్ చేశాడట. మీరు చూపిస్తున్న ఫొటో కెల్విన్ ది కాదు.. ఆ ఫొటో తనదేనని  కావాలంటే... మెయిల్ ఐడీ - బ్యాంక్ ఖాతా - ఫేస్ బుక్ ఖాతాలను పరిశీలించాలని కూడా నాగబాబు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు ఫోన్ నేపథ్యంలో.. ఇప్పుడదంతా వట్టిదే అని తేలిపోయింది. నిజనిజాలు నిర్దారించుకోకుండా మీడియా మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రోడ్లపైనే పలు మార్లు ఆ పని చేసిన ఆలియా భట్!

Alia-Bhatt-had-to-PEE-in-public-because-of-Imtiaz-Ali-Andhra-Talkies-telugu
సినిమాల కోసం ఈ మధ్య మరీ రియలిస్టిక్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి. నటీనటులు కూడా వాస్తవ ప్రపంచంలో ఉన్న సీన్స్ ను సినిమాల్లో చూపేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. యాక్టర్స్ నుంచి వస్తున్న సపోర్ట్ ను చూసి.. ఫిలిం మేకర్స్ కూడా వాస్తవికతను తెరపై ఆవిష్కరించేస్తున్నారు.

ఇప్పటికే వాస్తవ సంఘటనలు.. వాటి ఆధారంగా రూపుదిద్దుకునే సినిమాల కౌంట్ తెగ పెరిగిపోతే.. ఇప్పుడు బాలీవుడ్ కుర్ర బ్యూటీ ఆలియా భట్ మరీ ధైర్యం చేసేసింది. ఓ సినిమా కోసం పబ్లిక్ ప్లేస్  లలో మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా చెబుతోంది ఆలియా. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో రూపొందుతున్న హైవే చిత్రంలో నటిస్తోంది ఆలియా భట్. ఇది రోడ్ జర్నీ మూవీ కావడంతో.. ముందుగా ఫలానా ప్లేస్ లో షూటింగ్ చేయాలనే డెసిషన్స్ ఏమీ లేవని చెప్పిన ఆలియా.. అలా హైవే మీద వెళుతుండగా.. ఎక్కడ లొకేషన్.. లైటింగ్ బాగుంటే.. అక్కడ షూటింగ్ చేశామని చెప్పింది.

'ఇది ఓ గొరిల్లా టైపు షూటింగ్. నేను పబ్లిక్ ప్లేస్ లలోనే మూత్ర విసర్జన చేయాల్సి వచ్చేది. రోడ్లపైనే పలు మార్లు ఆ పని చేశాను. జోక్ ఏంటంటే.. జనాలకు నా వెనుక భాగం తప్ప మరేమీ కనిపించదు' అంటూ తన మీద తానే జోకులు వేసుకుంటోంది ఆలియా భట్.

More Read : Andhra Talkies information latest

Tags : Telugu NewsTelugu Cinema NewsTelugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie ReviewsTollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

ముమైత్ ఖాన్ విచారణకు రావట్లేదు: అకున్ సబర్వాల్

Sexy-Actor-Mumaith-Khan-Enquiry-date-not-Confirmed-Akun-Sabarwal-Andhra-Talkies-Telugu
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 19  నుంచి  27 వరకు ఒక్కొక్కరిని సిట్ అధికారులు విచారించనున్నారు. మొదటగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రేపు ఉదయం 10.30 నిమిషాలకు సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే ఈ విచారణ నుంచి ముమైత్ ఖాన్ కు మినహాయింపు లభించిందని ఎక్సైజ్ (ఎన్ ఫోర్స్ మెంట్) డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పారు.  ముమైత్ ఖాన్ మినహా అందరూ విచారణకు హాజరు అవుతారన్నారు. డ్రగ్స్ మాఫియాపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

నోటీసులు తీసుకున్న వారిలో ముమైత్ఖాన్ మినహా అందరూ హాజరవుతారని ముమైత్ ఖాన్ ఓ షోలో ఉన్నందున ఆమె విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదని సబర్వాల్ తెలిపారు. ఒక్కో రోజు ఒక్కొకరిని విచారిస్తామని అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని అకున్ చెప్పారు. డ్రగ్స్ కేసులో కొత్తవాళ్లకు నోటీసులు ఇవ్వలేదని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఓ టీవీ చానల్లో బిగ్ బాస్ కార్యక్రమంలో  ముమైత్ ఖాన్ పాల్గొనడం వల్లే స్వయంగా సిట్ ఎదుట హాజరు అయ్యేందుకు మినహాయింపు లభించినట్లు తెలుస్తోంది.

కాగా డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఈ నెల 19 నుంచి 27 మధ్య సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకానున్న సంగతి తెలిసిందే. కెల్విన్ కాల్ లిస్ట్ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్శాఖ నోటీసులు జారీచేసింది. ఈ నెల 19న పూరీ జగన్నాథ్ - 20న హీరోయిన్ ఛార్మి - 22న సుబ్బరాజు - 23న శ్యాం కే నాయుడు సిట్ ఎదుట హాజరుకాబోతున్నారు. ఇక హీరో రవితేజ ఈ నెల 24న సిట్ ముందు హాజరు కాబోతున్నారు. ఈ నెల 25న చిన్నాను - 26న నవదీప్ - 27న తరుణ్ - 28న తనీష్ - నందులను సిట్ విచారించనుంది.
More Read : Andhra Talkies information latest

Tags : Telugu NewsTelugu Cinema NewsTelugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie ReviewsTollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

డ్రగ్స్ మత్తులో తూగుతున్న తెలుగు ఇండస్ట్రీ నటీనటులు! ముందువరసలో రవితేజ్ - పూరి జగన్ - ఛార్మి??

Tollywood-Celebs-involved-In-Drug-Mafia-Andhra-Talkies-telugu
అసలు స్కూల్ పిల్లలు.. కాలేజీ యువత మాత్రమే హైదరాబాదులో ఈ డ్రగ్స్ మత్తులో తూగుతున్నారు అనుకుంటే.. ఇప్పుడు ఈ డ్రగ్స్ వాడకంలో వీరందరినీ మించి టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా పెద్ద ఎత్తులో మత్తులో తూగుతున్నారని ఎక్సయిజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు చెబుతున్నారు. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ వీరందరి పేర్లనూ బట్టబయలు చేసింది.

ఆ ఛానల్ రిపోర్టు ప్రకారం.. కెల్విన్.. కుదూస్.. వాహెద్ అనే ముగ్గురు డ్రగ్ పెడ్లర్లు అరెస్టయిన తరువాత.. వారి ఫోన్ కాల్స్ వాట్సాప్ మెసేజస్ ఆధారంగా చాలా వివరాలు ఆధారాలు సేకరించి.. ఇప్పుడు టాలీవుడ్ లో ఏకంగా 19 మంది ప్రముఖులను లిస్ట్ అవుట్ చేశారట. హీరో రవితేజ.. డైరక్టర్ పూరి జగన్.. హీరోయిన్ ఛార్మి.. ఐటం బాంబ్ ముమాయత్.. కెమెరామ్యాన్ శామ్.కె.నాయుడు.. యాక్టర్ సుబ్బరాజు.. ఆర్ట్ డైరక్టర్ చిన్నా.. హీరోలు తరుణ్.. నవదీప్.. తనీష్.. నందు.. లకు ఇప్పుడు ఎక్సయిజ్ శాఖ నోటీసులు కూడా అందించినట్లు సదరు ఛానల్ పేర్కొంది.

ఇప్పుడు ఈ సెలబ్రిటీలు తమ డ్రైవర్ల ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్న సిసి టివి ఫుటేజీలూ.. అలాగే ఈ సెలబ్రిటీలు డ్రగ్ పెడ్లర్లతో సాగించిన వాట్సాప్ సంభాషణలు.. వగైరా వగైరా సాక్ష్యాలు ఉన్నాయట. అంతేకాదు.. వీరిలో కొంతమంది సెలబ్రిటీలు బ్యాంకాక్ వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంటే.. కొందరు విచారణకు తాము హాజరు కాకుండా లాయర్ ను పంపిస్తామని చెబుతున్నారట. అయితే ఎక్సయిజ్ శాఖ మాత్రం.. పర్సనల్ గా విచారణకు రావల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది.

వీరందరూ 19వ తారీఖు నుండి 27వ తారీఖు మధ్యన నాంపల్లి ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులో అధికారుల సమక్షంలో విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వీరు హాజరుకాకపోతే మాత్రం అరెస్టు చేసే అవకాశం కూడా ఉందట. ఇప్పటివరకు 12 మంది తెలుగు సెలబ్రటీలు నోటీసులు అందుకోగా.. వారిలో 10 మంది నోటీస్ తీసుకున్నట్లు ఎక్నాలెడ్జమెంట్ కూడా అందిందంట.

ఇప్పుడు ఈ సెలబ్రిటీల్లో ఎంతమంది విచారణకు హాజరు అవుతారు.. ఎంతమంది పలుకుబడిని వాడుకుని తప్పించుకుంటారు.. చూడాల్సి ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు వీరి పేర్లను ఎక్సయిజ్ ఎన్ఫోర్స్ మెంట్ శాఖ అఫీషియల్ గా ప్రకటించే ఛాన్సున్నట్లు ఆ ఛానల్ కథనం తెలిపింది.
Tollywood-Celebs-involved-In-Drug-Mafia-Andhra-Talkies-telugu

Tags : Telugu NewsTelugu Cinema NewsTelugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie ReviewsTollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

రచ్చబండ, బ్రతుకు జట్కాబండిలాంటి TV షోలపై విరుచుకుపడిన యండమూరి

Yandamuri-veerendranath-comments-on-TV-Shows-Andhra-Talkies-Telugu
ఈ మధ్య టీఆర్పీల కోసం టీవీషోలను భ్రష్ఠు పట్టించేస్తున్నారు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను నలుగురికి తెలిసేలా బహిరంగ చర్చకు తెస్తున్నారు. ఆ షో నిర్వహించే వ్యాఖ్యాతలు వారికి  నచ్చినట్లు పంచాయితీలు చేసేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో వస్తున్న అటువంటి షో లు ప్రేక్షకాదరణ పొందడం విచారకరమని ప్రముఖ రచయిత మానసిక వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు.

ఈ తరహా కార్యక్రమాల్లో వాస్తవాల గురించి ఓ న్యూస్ ఛానెల్ ఆయనను ప్రశ్నించింది. మానసికంగా ఆనందంగా ఉండే వాళ్లెవ్వరూ ఇలాంటి షోలు చూడాల్సిన అవసరం లేదని యండమూరి సమాధానమిచ్చారు. మానస వికాస నిపుణుడిగా తనకున్న అనుభవంతో టీవీ ఛానెల్స్ కు ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్నా ఇలాంటి టీవీ షోలను ప్రసారం చేయవద్దని సూచిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో ప్రేక్షకులు కూడా ఇటువంటి చెత్త  ప్రోగ్రామ్ లను చూడకుండా ఉంటే ట్యామ్ రేటింగ్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.


ఈ కుటుంబ కలహాల  షోలలో పాల్గొనే వారికి తాము తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ కూడా ఉండదని కేవలం పాపులారిటీ కోసం చేస్తుంటారని అన్నారు. ఆ టీవీ షోలలో తీర్పులిచ్చే వాళ్లు తమను మేథావులుగా భావించుకుంటారని విమర్శించారు. తీర్పులిచ్చేవాళ్ల  సీక్రెట్లన్నీ తనకు తెలుసన్నారు. హైదరాబాద్ లో వారు సంప్రదించే  సైకియాట్రిస్ట్ లందరూ తనకు ఫ్రెండ్సేనని చెప్పారు. టీవీ షోలలో తీర్పు ఇచ్చే స్థానంలో ఓ కుక్కను కూర్చోపెట్టినా అది తీర్పిచ్చేస్తూ ఉంటుందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ షో ల ఉద్దేశం ‘శవాల మీద డబ్బులు ఏరుకోవడమే’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Yandamuri-veerendranath-comments-on-TV-Shows-Andhra-Talkies-Telugu

More Read : Andhra Talkies information latest

Tags : Telugu News, Telugu Cinema News, Telugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie Reviews, Tollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

కాజల్ తన అందానికి సర్జరీ చేయించిందా?

Kajal-Agarwal-Nose-Surgery-Andhra-Talkies-Telugu
ఒక హీరోయిన్ మొదటి సినిమాలో కనిపించే తీరు ఒకలా ఉంటుంది. పదేళ్ళు నటించిన తరువాత వాళ్ళు కనిపించే తీరు వేరేలా ఉంటుంది. నటనలో కావచ్చు అందంలో కావచ్చు ఫ్యాషన్లో కావచ్చు అన్నీ స్టార్ తరహాలోనే ఉంటాయి అలానే అవుతారు. సౌత్ సినిమాలో దశాబ్ధం నుండి ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తన మొదటి సినిమాకు ఇప్పటి సినిమాలకు చాలా మారింది. అయితే ఇప్పుడు మరింత అందంగా కనిపించేందుకు ఆమె సర్జరీని ఆశ్రయించింది అంటున్నారు నెటిజన్లు.

తెలుగులో మరీ ఎక్కువ సినిమాలు లేకపోయినా తమిళ్ సినిమాలలో మంచి అవకాశాలే వస్తున్నాయి ఈ చందమమామకు. కాకపోతే ఇక్కడ ఈ మధ్య ఓ రెండు పెద్ద సినిమాలు చేసింది కాబట్టి.. వరుసగా రానాతో కళ్యాణ్ రామ్ తో చిన్న సినిమాలు బాగానే పడ్డాయ్. అయితే మళ్ళీ తన కెరియర్  స్పీడ్ ని పెంచాలి అంటే ఏదో తెలియని మ్యాజిక్ చేయాలి అని అనుకోని తన ముక్కు కొంచం మార్చుకుంది అంట. ఈ విషయం ఆమె బయటకు చెప్పకపోయినా కాజల్ ను ఈ మధ్యకాలంలో చూసిన ప్రతివారికి ఆమె ముక్కు కొత్తరకంగా ఉందనే అనిపిస్తోందని టాక్. మొన్న ఆమె షేర్లో చేసిన కళ్యాణ్ రామ్ ని ఎమ్మెల్యే సినిమా షూటింగ్ స్పాట్ స్టిల్స్ లో కూడా ముక్కు తేడాగా ఉందని అంటున్నారు నెటిజన్లు.

కాస్మటిక్ సర్జరీలు చేయించుకునే సౌత్ హీరోయిన్లు ఒకప్పుడు అరుదే కాని.. ఈ మధ్య చాలామంది ఈ కోవలోకి వచ్చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కూడా వచ్చిన కొత్తలో ఒక రకం ముక్కుతో కనిపిస్తే ఇప్పుడు మరో రకం ముక్కుతో దర్శనమిస్తోంది. కాని వీళ్ళను సర్జరీ చేయించారా అంటే మాత్రం.. ఎస్ అని ఎందుకు చెబుతారులే.

Tags : Telugu News, Telugu Cinema News, Telugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie Reviews, Tollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...