అవతార్ 2 - అవతార్ 3 కథలు లీక్

Hollywood-latest-movies-Avatar-2-and-Avatar-3-Movie-Script-Leaked-Andhra-talkies

అవతార్ 2 - అవతార్ 3 కథలు లీక్

2009లో రిలీజైంది అవతార్. 2.7 బిలియన్ డాలర్ల గ్రాస్ తో ఇప్పటికీ ఈ సినిమా నంబర్ 1 స్థానంలో నిలిచింది. అవతార్ రిలజై ఇప్పటికే 9 ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. దాదాపు పదేళ్ల తర్వాత ఈ సిరీస్లో సీక్వెల్ సినిమాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. 18 డిసెంబర్ 2020లో అవతార్ 2 - 17 డిసెంబర్ 2021న అవతార్ 3 చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయని ఇదివరకూ దర్శకదిగ్గజం - ది గ్రేట్ జేమ్స్ కామెరూన్ ప్రకటించారు. అవతార్ సినిమాలో ఒక పండోరా చూపించినందుకే అంత ఎగ్జయిట్ అయ్యారు. ముందుంది ముసళ్ల పండగ! అని అప్పట్లోనే ప్రకటించాడు. అందుకు తగ్గట్టే భారీ కాన్వాసుపై పార్ట్ 2 -3 చిత్రాల్ని పూర్తి చేస్తున్నారు.

ఇప్పటికి అవతార్ 2 - అవతార్ 3 సినిమాల చిత్రీకరణ పూర్తయింది. ఇకపై నిర్మాణానంతర పనులు పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉంది. అంటే ఇంకో రెండేళ్ల పాటు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కే కేటాయించనున్నారు. ముందుగా షూటింగ్ పూర్తవ్వగానే అవతార్ లోగోని కామెరూన్ బృందం ఆవిష్కరించింది. ఈ లోగోని `పాపిరస్` తరహాలో డిజైన్ చేయడం ఆసక్తి పెంచుతోంది. ఈ డిజైన్ లో జేక్ సుల్లీ రెట్టింపు బలం పెంచుకుని తన డేగ (పాపిరస్)పై ప్రయాణిస్తూ కనిపించాడు.

షాక్ ఇవ్వబోతున్న అనుష్క!

Sexy-Heroin-Anushka-Shetty-Future-Plans-Andhra-Talkies

షాక్ ఇవ్వబోతున్న అనుష్క!

ఎప్పుడో జనవరిలో వచ్చిన భాగమతి తర్వాత స్వీటీ అనుష్క మళ్ళి వెండితెరపై కనిపించక అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. కొత్త సినిమా తాలూకు అప్ డేట్స్ లేవు. సరే పోనీ పెళ్లి వార్తయినా తెలుస్తుందేమో అనుకుంటే అసలు మైకు ముందుకు వస్తే కదా. గత కొంత కాలంగా వెయిట్ లాస్ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి దానికి సంబందించిన శిక్షణలో బిజీగా ఉన్న అనుష్క త్వరలోనే స్వదేశానికి తిరిగి రానుంది. అందరూ ఊహిస్తున్నట్టు పెళ్లి కోసం కాదు. ఓ తమిళ సినిమాలో నటించేందుకు రెడీ అవ్వడానికి.

లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులో ఇంతకు ముందు చేయని సరికొత్త పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్. తిరిగి వచ్చాక అన్ని వివరాలు తెలియజేయబోతున్నారు. అందులో హీరో ఎవరు లాంటి విషయాలు మాత్రం ఇప్పటికి  గుట్టే. బాహుబలి తర్వాత నిజానికి అనుష్కకు లెక్కలేనన్ని ఆఫర్స్ వచ్చాయి. భాగమతి తర్వాత కూడా అంతే. కొరటాలశివ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే 152 సినిమాకు అనుష్కనే అడిగినట్టు ప్రచారం జరిగింది.

ఆడది అవసరం కాదు- బాలయ్య

Hero-Balakrishna-Speech-at-Aravinda-Sametha-Success-Meet-Andhra-Talkies.jpg

ఆడది అవసరం కాదు- బాలయ్య

అరవింద సమేత సక్సెస్ వేదిక ఆద్యంతం హరికృష్ణ నామస్మరణతో హోరెత్తింది. నందమూరి హరికృష్ణ జోహార్.. ఎన్టీఆర్ జోహార్ అంటూ నందమూరి హీరోలు బాలయ్య - ఎన్టీఆర్ - కల్యాణ్ రామ్ ఫ్యాన్స్ లో స్ఫూర్తి రగిలించారు. ఇదే వేదికపై ఎన్టీఆర్ సినిమా విజయాన్ని కీర్తించిన బాలయ్య హరికృష్ణతో తన అనుబంధాన్ని అన్నయ్యలోని ధీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు.

ముక్కుసూటి తత్వం ఉన్న అన్నయ్య ప్రజా శ్రేయస్సు కోసం ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టీ కి వెన్నంటి నిలిచారు. చైతన్య రథ సారథి .. నా అన్నయ్య నందమూరి హరికృష్ణ జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడం నా హృదయాన్ని ధ్రవీభవింపజేసింది... అని బాలయ్య బాధను వ్యక్తం చేశారు. లాభనష్టాలు చూడకుండా తాను అనుకున్నదాని కోసం ముక్కుసూటిగా వెళ్లేవాడు అన్నయ్య. ఆయన ఒక మొరటు మనిషి.. మనసు వెన్న. కరిగిపోయే తత్వం ఉన్నవాడు. అవన్నీ ఆయనలో ఉన్న గొప్ప అలంకారం.. నాన్న గారు తెలుగు దేశం పార్టీ పెట్టిన తొలిరోజుల్లో పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రంలో ఒక వికాసాన్ని ప్రవహింపజేసి చైతన్య రథసారథి అయ్యాడు. అందుకే ఈ సభాముఖంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నా. నాన్నగారి మరణానంతరం హిందూపురంలో రికార్డు ఓట్లతో గెలిచినవాడు అన్నయ్య. ఎమ్మెల్యే అయ్యాక రైతుల కోసం ఎంతో చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉపాధి కల్పించారు. పార్టీ తరపున బోలెడంత కృషి చేశారు... అనీ గుర్తు చేసుకున్నారు.

విషాదం నుంచి వెలుగు పంచిన తారక్!

Hero-Junior-NTR-Speech-At-Aravinda-Sametha-Success-Meet-Andhra-Talkies.jpg

విషాదం నుంచి వెలుగు పంచిన తారక్!

అరవింద సమేత- వీర రాఘవ` షూటింగ్ ముగింపులో ఉండగా తారక్ తండ్రి నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణానికి గురైన సంగతి తెలసిందే. ఆ ఘటన ఇప్పటికీ నందమూరి కుటుంబాన్ని విడిచిపెట్టడం లేదని అర్థమవుతోంది. అరవింద వేదికలపై తారక్ - కళ్యాణ్ రామ్ కన్నీళ్లతో .. దుఃఖంతో కనిపించి అభిమానుల గుండెల్ని ద్రవింపజేశారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో తారక్ ఎంతో ఎమోషన్ అయ్యాడు. నేడు శిల్పకళా వేదిక పైనా తారక్ అంతే ఎమోషనల్ గా కనిపించాడు. తమ కుటుంబంలో విషాదం ఎదురైన వేళ ఇలాంటి విజయాన్ని ఇచ్చి త్రివిక్రమ్ వెలుగును పంచాడని అన్నాడు. ఈరోజు ఈ ఆనందాన్ని మీతోనే పంచుకుంటాను. అన్నయ్య నాన్న ఉండి ఉంటే బావుండేది అన్నారు. కానీ నాన్న ఎక్కడో లేరు. ఇక్కడే ఉండి చూస్తూ ఉంటారు. నాన్నగారు లేకపోయినా తండ్రి హోదాలో ఇక్కడికొచ్చిన బాబాయ్ కి పాదాభివందనాలు.. అనీ అన్నాడు.

సైరా వార్.. 50కోట్లు ఖర్చు పచ్చి అబద్ధమా?

Rumours-on-About-megastar-chirajeevi-movie-Sye-Raa-Movie-Budget-Andhra-Talkies.jpg

సైరా వార్.. 50కోట్లు ఖర్చు పచ్చి అబద్ధమా?

సైరా` చిత్రానికి అన్ లిమిటెడ్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నామని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేత రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ సినిమాకి దాదాపు 200 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారని - కేవలం వార్ సన్నివేశాలకే రూ.50 కోట్లు వెచ్చించారన్న ప్రచారం సాగింది. అయితే ఇటీవల సామాజిక మాధ్యమాల్లో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో తరహాలో ప్రచారం చేస్తుండడంతో అందరిలో ఒకటే కన్ఫ్యూజన్ నెలకొంది.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విరోచిత పోరాటాల్ని ఇండియన్ సినిమా హిస్టరీలో మునుపెన్నడూ చూడని తీరుగా బెస్ట్ వార్ ఎపిసోడ్స్ చూపించాలన్న ప్లాన్ అయితే ఉంది. ఆ క్రమంలోనే జార్జియాకు వెళ్లింది సైరా యూనిట్. అక్కడ ఏకంగా 50కోట్లు ఖర్చు చేస్తూ భారీ పోరాట సన్నివేశాల్ని తీస్తున్నారన్న ప్రచారం తొలుత సాగింది. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నది ఒక కొత్త వాదన తెరపైకొచ్చింది. కేవలం వార్ ఎపిసోడ్స్ కు ఖర్చు చేసేది 50 కోట్లు అనుకుంటే - ఇందులో క్లైమాక్స్ కలుపుకుని సినిమా మొత్తంలో నాలుగు వార్ ఎపిసోడ్స్ వస్తాయిట. ప్రథమార్థంలో రెండు ద్వితీయార్థంలో రెండు భారీ వార్ సీక్వెన్సులు ఉంటాయని తెలుస్తోంది. వీటన్నిటికీ కలిపి 50కోట్ల బడ్జెట్ అని ఒక వాదన వినిపిస్తోంది. ఇక 200కోట్ల బడ్జెట్ లో మెగాస్టార్ పారితోషికం 30కోట్లు - యాక్షన్ ఎపిసోడ్స్ 50 కోట్లు మినహాయిస్తే 120 కోట్ల మేర సినిమా మొత్తానికి ఖర్చవుతుందని చెబుతున్నారు.

నా ఆర్మీ గురించి పూజా చెప్పగానే ఏడ్చేశాను : కౌశల్

Bigg-Boss-Winner-Kaushal-on-about-Kaushal-Army-Andhra-Talkies

నా ఆర్మీ గురించి పూజా చెప్పగానే ఏడ్చేశాను : కౌశల్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ కు ఈ విజయం అంత సునాయాసంగా రాలేదు అని షో చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. మొదటి వారం నుండి అతడు పడ్డ కష్టంకు సరైన ప్రతిఫలం దక్కింది అంటూ ఆయన అభిమానులు అంటున్నారు. బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ పేరును ప్రకటించిన వెంటనే భావోద్వేగంకు గురయ్యాడు. విజేతగా నిలిచిన కౌశల్ కు ఆయన ఆర్మీ అన్నపూర్ణ స్టూడియో నుండి పెద్ద ర్యాలీని నిర్వహించింది. ఈ కార్యక్రమం అనంతరం కౌశల్ మాట్లాడుతూ తనతో పోటీ పడ్డ ఇంటి సభ్యుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారిలో ఒక్క శ్యామల తప్ప మిగిలిన అంతా కూడా నన్ను టార్గెట్ చేశారు. ఇంట్లోంచి పంపించేందుకు శ్యామల తప్ప అందరు ప్రయత్నించారు అంటూ కౌశల్ అన్నాడు. నన్ను ఎలిమినేట్ చేయాలని బాబు గోగినేని శపథం చేశారు. అయితే నేను సింపుల్ గా నామినేట్ చేశాను. మీరు మాత్రం ఆయన్ను ఎలిమినేట్ చేసేందుకు ఎక్కువగానే కష్టపడ్డారు. తాను ఎప్పుడు కూడా తనీష్ తనకు పోటీగా భావించలేదు అన్నాడు. తనీష్ ఎక్కువగా దీప్తి సునయనకు పాంపరింగ్ చేయడంలోనే సరిపోయింది. అందుకే అతడు నాకు పోటీ అనుకోలేదు.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...