తల్లిని తిట్టడమేంటి?...‘అర్జున్ రెడ్డి’పై అనసూయ ట్విట్టర్ వార్

What-about-the-mother-Anasuya-Twitter-war-on-Arjun-Reddy
ఇటీవల విడుదలైన 'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో చాలా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా ఓ వైపు సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతున్నప్పటికీ, సినిమాపై కొందరు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ చిత్రం యువతను చెడగొట్టే విధంగా ఉందని, బూతు సీన్లు, బూతు పదాలు ఉన్నాయంటూ చాలా గొడవ జరగుతోంది.
ప్రముఖ యాంకర్, నటి అనసూయ కూడా 'అర్జున్ రెడ్డి' సినిమాపై విమర్శలు చేశారు. ఈ సినిమాలో వాడిన కొన్ని బూతు పదాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో హీరో ఎవరినో తిట్టేక్రమంలో అమ్మను ఉద్దేశించి బూతు పదాలు పయోగించడంపై అనసూయ మండి పడుతున్నారు....Read More

హీరోయిన్ గా మారిన సమంత చెల్లెలు

Samantha-sister-Navika-Kotia-Turns-As-Heroine-andhra-talkies-telugu
జబర్ధస్థ్ కామెడీ షోతో కమీడియన్ గా సినిమాల్లోకి వచ్చిన షకలక శంకర్ తాజాగా హీరోగా కూడా మారాడు. శంకర్ హీరోగా నూతన దర్శకుడు సత్య దర్శకత్వంలో డ్రైవర్ రాముడు అనే  కామెడీ యాక్షన్ సినిమా రెడీ అవుతుంది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నవికా కొటియా హీరోయిన్ గా నటిస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి. అత్తారింటికి దారేది సినిమాలో సమంత - ప్రణిత చెల్లెలుగా నటించింది నవికాకోటియా. కమీడియన్ గా బిజీ అవుతున్న టైమ్ లో శంకర్ హీరోగా కూడా తన లక్ టెస్ట్ చేసుకోడానికి డ్రైవర్ రాముడు ని ట్రై చేస్తున్నాడు. గతంలో సునీల్ హీరో లాంఛింగ్ మూవీ అందాలరాముడు స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కుతుందని సినీజనాలు అంటున్నారు. శంకర్ కి ప్లస్ పాయింట్ గా నిలిచే స్పూఫ్ లతో ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని  వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా మారిన నవికకోటియా గతంలో పలు భారీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. తమిళంలో కూడా ఈ బ్యూటీ నటించింది. గతేడాది విడుదలైన విజయ్ థేరీ సినిమాలో నవికా ఓ కీలక పాత్ర పోషించింది. అలానే బుల్లితెరలో కూడా నటించిన ఎక్స్ పీరియన్స్ నవికాకు ఉంది. టీవీ నుంచి బిగ్ స్క్రీన్ కి ప్రమోట్ అయిన చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంకర్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంటూ తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న నవికా కోటియా కెరీర్ ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Read More : Andhra Talkies

Tags : Telugu NewsTelugu Cinema NewsTelugu Movie News, Telugu Film News, Tollywood News, Tollywood Latest News, Latest Tollywood News, Telugu Movie Reviews, Telugu Cinema Reviews, Tollywood Movie ReviewsTollywood Film Reviews, Andhra News, Telangana News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

వీహెచ్ కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బస్తీ మే సవాల్!

Director-Ram-Gopal-Varma-Challenges-to-V-Hanumantha-Rao-andhra-talkies-telugu
అర్జున్ రెడ్డి సినిమా  పోస్టర్లపై చెలరేగిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా పోస్టర్లు అసభ్యకరంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వాటిని చించేసిన సంగతి తెలిసిందే. దాంతో వీహెచ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మతన ఫేస్ బుక్ ఖాతాలో వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేశాడు. వర్మను హైదరాబాద్ లో అడుగుపెట్టనీయమంటూ వీహెచ్ హెచ్చరించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ వర్మ బదులిచ్చాడు.  అంతేకాకుండా తాను రేపు ఈ సినిమా చూడడానికి ప్రసాద్ ఐమ్యాక్స్ కు వెళ్తున్నానని - అక్కడ కలుద్దామని వీహెచ్ కు సవాల్ విసిరాడు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. వీహెచ్ పై వర్మ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఈ పోస్టర్ల వివాదంలో తన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని వీహెచ్ కు వర్మ సవాల్ విసిరాడు. తనను హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వనని హెచ్చరించిన వీహెచ్ పై వర్మ మండి పడ్డాడు. బస్సులపై తన సినిమా పోస్టర్లను చించేసినందుకు బదులుగా వీహెచ్ బట్టలు చింపేయాలని ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండను కోరాడు. వీహెచ్ గారికి ఆ చిత్ర నిర్మాతలు పబ్లిసిటీ కోసం డబ్బులు చెల్లించినట్లు తనకు అనుమానంగా ఉందని వర్మ సెటైర్ వేశాడు. ఈ డబ్బుల వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ జరపాలన్నాడు.

మీలో శృంగార కళ ఉండాలంటే ఈ 10 లక్షణాలు అవసరం.

గర్భవతి కావడం వల్లనే హడావుడిగా ఆ హీరోయిన్ వివాహం చేసుకుంది?

Is-the-heroine-married-as-she-was-pregnant
బాలీవుడ్ బ్యూటీ రియా సేన్ వివాహం మూడురోజుల క్రితం పుణెలో జరిగిన సంగతి తెలిసిందే. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ శివం తివారీని ఆమె పెళ్లాడారు. పెళ్లి ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. వివాహం జరిగిన విషయం రెండు రోజుల తర్వాత రియా సోదరి రైమా సేన్ సోషల్ మీడియా ద్వారా ఫోటోలు రిలీజ్ చేసే వరకు ఎవరికీ తెలియదు. ఇంత రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? కనీసం సినీ ఇండస్ట్రీ వారిని కూడా పిలవక పోవడాని కాకరణం ఏమిటి అనే సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది...Read More

రెండు తరాలైనా తరగని ఆస్తి మాది: మహానటి సావిత్రి ఆస్తులపై కూతురు హాట్ కామెంట్!

Two-types-of-renewable-property-are-ours-Mahanata-Savitri-is-a-daughter-Hot-comment
మహానటి 'సావిత్రి' గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉ న్నాయి. స్టార్ హీరోయిన్ గా ఉన్నపుడు బాగా సంపాదించిన ఆమె తర్వాత తాగుడుకు బానిసగా మారి జీవితం చివరి దశలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో గడిపిందని, అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బు లేక దీనమైన స్థితిలో మరణించిందని అంటుంటారు. అయితే ఈ ప్రచారం అంతా అబద్ధమని అంటున్నారు సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి. అమ్మ ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొలేదని, ఆమె సంపాదించిన డబ్బుతోనే తాము ఇప్పటికీ సుఖంగా బతుకుతున్నామని తెలిపారు...Read More

దేశం వర్థిల్లాలి... రోమాలు నిక్కబొడుస్తాయ్: ఒక్కడు మిగిలాడు ట్రైలర్

The-country-should-dance-the-hair-nickboodstoy-The-one-left-was-a-trailer
మంచు మనోజ్ కథానాయకుడిగా అజయ్ ఆండ్ర్యూస్ 'ఒక్కడు మిగిలాడు' సినిమాను తెరకెక్కించాడు. "దేశం వర్థిల్లాలి" అంటూ ఆవేశంగా కనిపించబోతున్న మనోజ్ ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ గా .. ఓ స్టూడెంట్ గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో మనోజ్ జోడీగా అనీషా ఆంబ్రోస్ నటించింది. వివరాలలోకి వెళితే...Read More

వేషాల కోసం పడకగదికి రమ్మన్నారు...నిరాకరించినందుకు అలా చేశారు..శ్రద్దాదాస్ (ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)

Come to bed for the masculinity ... to refuse to do so .. sraddhadas (exclusive interview)
సినీ పరిశ్రమలో సత్తా ఉన్న యాక్టర్లలో శ్రద్ధా దాస్ ఒకరు. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఆర్య - 2, కరుణాకరన్ దర్శకత్వంలో డార్లింగ్ , దిల్ రాజు మరో చరిత్ర చిత్రాల్లో నటించారు. పదేళ్ల కెరీర్‌లో పలు భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆమె నటించిన బాబూ మొషాయ్ బందూక్ బాజ్ చిత్రం సెన్సార్ కోరల్లో ఇరుక్కుంది. పలు సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 48 కట్స్ సూచించింది. దాంతో సెన్సార్ బోర్డుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పిల్మీబీట్ తెలుగు శ్రద్దాదాస్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలు....Read More

‘స్పైడర్’ హిందీ రిలీజ్ అడ్డుకుంటున్నది ఎవరో తెలుసా?

Do-you-know-who-spider-hinders-the-Hindi-release
మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'స్పైడర్'. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలో రిలీజ్ చేయాలని ముందే నిర్ణయించారు. అయితే హిందీ రిలీజ్ మీద చిత్ర యూనిట్ కాస్త డౌట్‌ఫుల్‌గా ఉన్నట్లు సమాచారం. ఏఆర్ మురుగదాస్ సినిమాలకు హిందీలో మంచి డిమాండ్ ఉంది. అదే సమయంలో మహేష్ బాబుకు కూడా అక్కడ గుర్తింపు ఉంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నప్పటికీ మహేష్ బాబు అడ్డు చెబుతున్నట్లు తెలుస్తోంది...Read More

వారెవ్వా! సన్నీలియోన్ అంటే ఏమనుకున్నారు?

Sunny-Leone-Receives-a-Jaw-dropping-Welcome-In-Kochi-Andhra-Talkies-telugu
ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక ఫొటో హల్ చల్ చేస్తోంది. ఒక సిటీలోని పెద్ద ఫ్లై ఓవర్ కింద ఒక కారు చుట్టేసి వేలల్లో జనం కనిపిస్తున్నారు. ఇటు అటు చాలా దూరం పాటు ఇసుకేస్తే రాలనంతగా జనాలు మూగి ఉన్నారు. ఆ ఫొటో చూపించి.. కార్లో ఉన్న సెలబ్రెటీ ఎవరో చెప్పుకోండి చూద్దా అంటే. సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. విజయ్.. అజిత్.. మహేష్ బాబు అంటూ పెద్ద పెద్ద స్టార్ల పేర్లు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఆ కార్లో ఉన్న వ్యక్తి సన్నీ లియోన్. ఆమెను చూడ్డానికే కొచ్చి జనాలు అంతగా ఎగబడ్డారు. ఈ ఫొటో ఒక్కటి చాలు సన్నీలియోన్ కు ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పడానికి.

గతంలోనూ ఒకసారి కొచ్చికి వెళ్లి సందడి చేసిన సన్నీ.. తాజాగా మరోమారు అక్కడికి వెళ్లింది. ‘ఫోన్ 4 డిజిటల్ హబ్’ అనే షో రూం ఆవిష్కరణ కోసం కొచ్చిలో అడుగుపెట్టిన సన్నీకి అక్కడి జనం బ్రహ్మరథం పట్టారు. వేలాది మంది కారును చుట్టుముట్టేశారు. కారు ముందుకు కదలనివ్వలేనంతగా మూగిపోయారు. ఏరియల్ వ్యూలో ఈ ఫొటో చూస్తే వారెవా అనిపిస్తోంది. సన్నీ లియాన్ ఫాలోయింగ్ మజాకా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు జనాలు. సన్నీ కూడా తన మీద కుర్రాళ్లలోని అభిమానం చూసి మురిసిపోతూ.. థ్యాంక్ యు కొచ్చి అంటూ క్యాప్షన్ పెట్టి ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసుకుంది.

భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌.. బతికున్నారా లేదా?

Indian freedom fighter Netaji Subhash Chandra Bose...Have you survived?
భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘బోస్‌- డెడ్‌/ఎలైవ్‌’. పుల్కిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రీల్‌ లైఫ్‌ బోస్‌గా బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌ నటిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్‌ ఈ రోజు విడుదల చేశారు. రేపు 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ టీజర్‌ను రాజ్‌కుమార్‌ రావ్‌ ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. టీజర్‌లో యువకుడిగా ఉన్నప్పుడు బోస్‌ ఎలా ఉండేవారో చూపిస్తూ ‘బోస్‌..బోస్‌’ అంటూ వస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌ పాట ఆకట్టుకుంటోంది. బోస్‌ ఎలా చనిపోయారు? ఆయన మరణం ఎందుకింత చర్చనీయాంశంగా మారింది? అన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్‌ 18న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు.
Indian freedom fighter Netaji Subhash Chandra Bose...Have you survived?

స్త్రీలు సిగరెట్ తాగితే తప్పేముంది? అంటున్న భామ

Girls-Who-Smoke-Are-Not-Characterless-Says-Kriti-Sanon-Andhra-Talkies-Telugu
చాలా మంది హీరోయిన్స్ స్టార్ హీరోస్ తో నటించడానికి చాలా ఇష్టపడతారు. అందుకు వారు ఎంతో కష్టపడి చిన్న తరహా సినిమాలతో క్లిక్ అయితేనే స్టార్ హీరోస్ తో ఛాన్సులను దక్కించుకుంటారు. కానీ కొందరు హీరోయిన్లు మొదటి ఛాన్సులలోనే నెంబర్ వన్ లాంటి హీరోలతో జోడి కడతారు. అలా ఛాన్సులు దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు క్రితి సనన్. మొదటి సినిమాతోనే మహేష్ బాబు "1 నేనెక్కడినే" వంటి భారీ సినిమాలో మెరిసింది. అయితే ఆ సినిమా ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదు.

కానీ హిందీలో చిన్న హీరోలతో జోడికట్టి పర్వాలేదనిపించింది. కానీ ఆ సంతోషం కూడా ఎన్నో రోజులు నిలవలేదు ఈ క్రితి సనన్ కి. ఆమె రీసెంట్ గా నటించిన "రాబ్తా" సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు కొత్త తరహాలో ఓ రొమాంటిక్ కామెడీ కథతో కూడిన "బరేలీ కి బార్ఫి" అనే సినిమాతో  రాబోతుంది.  అయితే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని ఘాటు కామెంట్స్  చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత రోజుల్లో మహిళల పట్ల చూపిస్తున్న ఒక చిన్నచూపు తనకు నచ్చడం లేదట. ముఖ్యంగా అమ్మాయిలు కాస్త మోడెర్న్ గా కనిపించినా తప్పుగా చూస్తున్నారని చెప్పింది. అంతే కాకుండా టాటూలు వేసుకున్న మహిళలను సిగరెట్ - మద్యం అలవాట్లు ఉన్న మహిళలను పూర్తిగా క్యారెక్టర్ లేదని నిర్దారించడం సరైనది కాదని చెబుతోంది. అయితే ఈ అమ్మడు ఇలా మాట్లాడటానికి కారణం "బరేలీ కి బార్ఫి" అనే సినిమాలో అలాంటి పాత్రలోనే నటించిందట. ఆ సినిమాలో సిగరెట్ కూడా తాగిందట. దీంతో మహిళలకు చెడు అలవాట్లు ఉన్నంత మాత్రాన తప్పుగా చూడవద్దని హితబోధ చేస్తోంది.

అయితే ఈ సినిమాపై ఈ అమ్మడు భారీ ఆశలే పెట్టుకుందన్నమాట. కాకపోతే ఇలా సినిమా కోసం ఉద్దేశ్యాలను చెప్పడం బాగానే ఉంది కాని.. అలాంటి ఆదర్శాలే పక్కోళ్ళ ప్రియుళ్లను దొబ్బేసేటప్పుడు కూడా ఉండాలని జనం చెవులు కొరుక్కుంటున్నారు. 

కొరటాల మాటలు మనం ఆలోచించాల్సిన విషయమే

Director-Koratala-Siva-Comments-on-Present-Politics-Andhra-Talkies
సమాజానికి ఓ మంచి సందేశం ఇస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సవకుండా సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం  డైరెక్టర్ కొరటాల శివ స్పెషాలిటీ. రైటర్ గా మొదలెట్టి డైరెక్టర్ గా టర్న్ అయిన కొరటాల శివ మొదటి సినిమా మిర్చి నుంచి ప్రతి సినిమాలోనూ సొసైటీకి పనికొచ్చే ఏదో ఒక విషయం చెబుతూనే వచ్చాడు.

‘ఊరి నుంచి ఎంతో తీసుకున్నాం. తిరిగి ఇచ్చేయకపోతే లావైపోతాం’ అంటూ శ్రీమంతుడులో మహేష్ బాబుతో చెప్పించిన డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. సొంత ఊరికి ఎంతో కొంత మేలు చేసేందుకు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. కొరటాల శివ లేటెస్ట్ గా తీసిన జనతా గ్యారేజ్ సినిమా మొత్తం పర్యావరణ పరిరక్షణ చుట్టూ సాగుతోంది. మొక్కలు కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ సినిమాలో బలంగానే వినిపించాడు. రీసెంట్ గా కొరటాల శివ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. ‘రాజకీయాలు రానురాను దారుణాతిదారుణంగా దిగజారిపోతున్నాయి. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో. దేవుడు కూడా దీని నుంచి కాపాడలేడు. మనం కాపాడుకోగలం.. మనం మాత్రమే కాపాడుకోగలం’ అంటూ బలమైన సందేశాన్ని వినిపించాడు.

రాజకీయ పరిస్థితులను చూసి ఆవేదన చెంది సరిపెట్టుకోకుండా పదిమందిలో ఆలోచన పెంచేలా కొరటాల శివ పెట్టిన ట్వీట్ అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగేది ప్రజలేనన్న నిజం అందరూ గుర్తెరగాలన్న ఆవేదన కొరటాల మాటల్లో కనిపిస్తోంది.  మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం కొరటాల శివ తీస్తున్న భరత్ అనే నేను సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్నదే కావడం విశేషం. బాలీవుడ్ భామ కియారీ అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...