ప్రేమ కథా చిత్రం-2 ట్రైలర్ Prema Katha Chitram 2 Official Trailer | Sumanth Ashwin|Nandita Swetha

ప్రేమ కథా చిత్రం-2 ట్రైలర్ Prema Katha Chitram 2 Official Trailer | Sumanth Ashwin|Nandita Swetha


బాలీవుడ్ డైరెక్టర్లకు గట్టిగా ఇచ్చిన లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్

Bollywood-Director-Sekhar-Kapur-Comments-On-Rajamouli-and-Shankar-Andhra-Talkies
Legendary Director Sekhar Kapoor, who has been strongly given to Bollywood directors
బాలీవుడ్ ను మించిపోయేలా, హాలీవుడ్ తో సమానంగా సౌత్ ఇండియా డైరెక్టర్లు సినిమాలను తీయడం గొప్ప విషయమని లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్ వ్యాఖ్యానించారు. సౌత్ ఇండియాలోనే గొప్ప డైరెక్టర్లు ఉన్నారని, సౌత్ ఇండియా డైరెక్టర్లను చిన్న చూపు చూసేవారందరూ వాళ్ళను చూసి నేర్చుకోవాల్సినదని తన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇటీవలే శంకర్ మూవీ ‘2.0’ రిలీజై హిందీలో భారీ వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. కరణ్ జోహార్ లాంటి బాలీవుడ్ పెద్ద దర్శకుడు ‘బాహుబలి’ తమకు చెంపపెట్టు లాంటి సినిమా అని చెప్పడం విశేషం.

సందీప్ కిషన్ ఈసారి కొత్త ప్రయత్నం

Hero-Sundeep-Kishan-With-Hansika-Andhra-Talkies
Hero Sundeep Kishan With Heroin Hansika-Andhra-Talkies
సందీప్ హీరోగా కెరీర్ ఆరంభించి చాలా కాలం అయ్యింది. కాని ఇప్పటి వరకు అట్టట్ట మాత్రమే ఆకట్టుకుంటూ వస్తున్నాడు. బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ లు ఈయనకు పడటం లేదు. అప్పుడెప్పుడో పడ్డ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం తర్వాత మళ్లీ సందీప్ కిషన్ కు ఏ సినిమా కూడా సక్సెస్ ను తెచ్చి పెట్టలేక పోతున్నాయి. అయినా కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు కోహ్లీ దర్శకత్వంలో ‘నెక్ట్స్ ఏంటీ’ అనే చిత్రాన్ని చేశాడు. అడల్ట్ కంటెంట్ తో ఈ తరం యువకులను టార్గెట్ చేసి తెరకెక్కించిన ఈ చిత్రంపై సందీప్ కిషన్ చాలా నమ్మకంతో ఉన్నాడు. తమన్నా హీరోయిన్ గా నెక్ట్స్ ఏంటీ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. తాజాగా సందీప్ కిషన్ మరో సినిమా ప్రకటన వచ్చింది.

కామెడీ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న దర్శకుడు నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక చిత్రం తెరకెక్కబోతుంది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని టైటిల్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ అనే టైటిల్ తో మూవీ తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా హన్సికను ఎంపిక చేసినట్లుగా కూడా తెలుస్తోంది. తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న హన్సికను మళ్లీ ఈ చిత్రంతో సందీప్ కిషన్ తీసుకు వస్తున్నాడు.

స్టార్ హీరో కూతురి నైనా నాకు అవి తప్పలేదు : వరలక్ష్మి

Heroin-Varalakshmi-About-Bad-Incidents-Andhra-Talkies
Heroin Varalakshmi About Bad Incidents-Andhra Talkies
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లైంగిక వేదింపులు అనేవి స్వరసాదారణమైన విషయం. మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పు మాదిరిగా ఉన్న ఈ వ్యవహారం తాజాగా మీటూ ఉద్యమం నేపథ్యంలో ఒక్కసారిగా భగ్గుమంది. ఇన్నాళ్లు మౌనంగా ఉంటూ వచ్చిన వారు ఎందరో మీటూ అంటూ తమపై జరిగి జరుగుతున్న లైంగిక దాడి గురించి బయటకు చెబుతున్నారు. అయితే ఎంతో మంది లైంగిక వేదింపుల ఆరోపణలు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్నా కూడా వారసులు మాత్రం అందుకు మినహాయింపు అనుకున్నారు. వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ కు కాస్టింగ్ కౌచ్ బాధ లేదు లైంగిక వేదింపులు అసలే ఉండవని అనుకుంటాం. కాని స్టార్ హీరో శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి శరత్ కుమార్ కు కూడా లైంగిక వేదింపులు తప్పలేదట.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వరలక్ష్మి తనకు ఎదురైన లైంగిక వేదింపులను చెప్పుకొచ్చింది. చిన్నతనంలో తాను కొన్ని సార్లు లైంగిక వేదింపులకు పాల్పడ్డట్లుగా పేర్కొంది. చిన్నప్పటి విషయాన్ని పక్కకు పెడితే హీరోయిన్ అయిన తర్వాత ఒక టీవీ ఛానెల్ లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత యాంకర్ మిగతా విషయాలు బయట మాట్లాడుకుందామా అంటూ ప్రశ్నించాడు. మిగిలిన విషయాలు అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు బయట మాట్లాడుకుందా అన్నాడంటే అతడి ఉద్దశ్యం ఏంటో చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి నాతో మాట్లాడిన ఆ మాటకు తీవ్ర ఆగ్రహం కలిగింది. కాని తాను ఆ సమయంకు కాస్త సంయమనం పాటించి అక్కడ నుండి వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది.

రాజమౌళికి బై.. బై చెప్పేసిన చరణ్!!

Ram-Charan-for--RRR-Movie-Andhra-Talkies
Charan told BYE to Rajamouli !!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. గత నెలలో హైదరాబాద్ శివారులోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయిన ఈ మల్టీస్టారర్ మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు చరణ్ లు ఇద్దరు కూడా పాల్గొన్న విషయం తెల్సిందే. షూటింగ్ ప్రారంభం రోజే జక్కన్న ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు చరణ్ దర్శకుడు రాజమౌళికి షార్ట్ బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకుని ఉన్న విషయం తెల్సిందే. దీక్ష ముగింపుకు చరణ్ ఈనెల 7న శబరిమల వెళ్లనున్నాడు. అక్కడ నుండి 9వ తారీకు వరకు వచ్చేయనున్నాడు. 10వ తారీకు నుండి వెంటనే ‘వినయ విధేయ రామ’ చిత్రంలో బ్యాలన్స్ ఉన్న ఆ చివరి పాటను చేయబోతున్నాడు. ఆ పాట చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొనబోతున్నాడు. ఆ లోపు సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తుంది. దాంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాడు.

మరో 'గీత గోవిందం' కు ఛాన్స్ ఉందా? | Is there another chance for 'Geeta Govindam'?

Rashmika-Mandanna-on-About-Dear-Camrade-Movie-Andhra-Talkies
 Is there another chance for 'Geeta Govindam'?
సూపర్ హిట్ మూవీస్ సీక్వెల్స్ రావడం అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితని చెప్పనక్కర్లేదు. అదే దారిలో ‘గీత గోవిందం’ చిత్రం సీక్వెల్ కూడా వస్తుందంటూ సోషల్ మీడియాలో ఈమద్య తెగ ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ చిత్రంతో విజయ్ దేవరకొండ - రష్మికలు ఓవర్ నైట్ లో స్టార్స్ అయ్యారు. ఇలాంటి సూపర్ హిట్ మూవీకి సీక్వెల్స్ కావాలని ప్రేక్షకులు ఆశించడం చాలా కామన్. సక్సెస్ అయినంత మాత్రాన సీక్వెల్ కావాలంటే కుదరదు. సీక్వెల్ కు స్కోప్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం.

‘గీత గోవిదం’ చిత్రం కథ ఆరంభం అంతం కూడా సాఫీగా సాగిపోయింది. గీత గోవిందంలు పెళ్లి చేసుకోవడంతో సినిమా పూర్తి అయ్యింది. ఇంకా సీక్వెల్ కు కథ ఎక్కడ మిగిలి ఉంది. ఏదో క్రియేట్ చేసి సీక్వెల్ చేద్దామని ప్రయత్నిస్తే మొత్తం కంపు అయ్యే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ అలాంటి ప్రయత్నాలకు అస్సలు సపోర్ట్ చేయడని కొందరు అభిప్రాయం. అంటే ‘గీత గోవిందం’ చిత్రానికి సీక్వెల్ వచ్చే ఛాన్సే లేదు.

కొత్త జంట సరస సల్లాపం

Sexy-Heroin-Priyanka-Chopra-and-Nick-Jonas-Sizzles-on-Vogue-Magazine-Coverpage-Andhra-Talkies
Priyanka-Chopra-and-Nick-Jonas-Sizzles-on-Vogue-Magazine-Coverpage
ఏడాది కాలంగా పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా ప్రేమాయణం కల్లోలం రేపిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ మహారాణి ఎలిజబెత్ టేలర్ కి రానంత ప్రచారం.. ఏంజెలినా విడాకుల వ్యవహారానికి సైతం రానంత పాపులారిటీ వచ్చింది ఈ వ్యవహారంతో. విదేశీ గాయకుడు - నటుడు నిక్ జోనాస్ ని ప్రేమించిన ఈ భామకు యూట్యూబ్ - సామాజిక మాధ్యమాల్లో అసాధారణ ప్రచారం దక్కింది. నిన్న గాక మొన్ననే ప్రియుడు నిక్ జోనాస్ ని పీసీ మనువాడింది.

పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత అని విభజిస్తే .. ఈ జంట లైఫ్ లో ప్రతి మూవ్ మెంట్ లో రొమాన్స్ ని పీక్స్ లో ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ కి ఇచ్చిన కవర్ ఫోటోషూట్ లో కొత్త జంట విన్యాసాలు ప్రస్తుతం యువతరాన్ని మైమరిపిస్తున్నాయి. నిక్ జోనాస్ తో పీసీ హాట్ ఫోటోషూట్ ప్రస్తుతం వేడెక్కిస్తోంది.

టాలెంటుకు తగ్గ హిట్ కొడతాడా?

Bluff-Master-Movie-in-Telugu-Film-Industry-Andhra-Talkies
Bluff-Master-Movie-in-Telugu-Film-Industry-Andhra-Talkies
ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో సత్యదేవ్ ఒకడు. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాలో ఛార్మికి జంటగా నటించిన అతను తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ‘క్షణం’.. ‘ఘాజీ’ లాంటి సినిమాలతో సత్తా చాటాడు. లుక్స్ పరంగానే కాక యాక్టింగ్ లోనూ ఆకట్టుకున్న సత్యదేవ్ కు మంచి సినిమా పడితే అతడి కెరీరే మారిపోతుందన్న అంచనాలున్నాయి. ‘బ్లఫ్ మాస్టర్’ అలాంటి సినిమానే అవుతుందేమో అనిపించింది దీని టీజర్ చూస్తే. తమిళ సూపర్ హిట్ ‘శతురంగ వేట్టై’కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం టీజర్ తో బాగానే ఆకట్టుకుంది.

అందులో సత్యదేవ్ స్క్రీన్ ప్రెజెన్స్ - యాక్టింగ్ - డైలాగ్ డెలివరీ.. అన్నీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబరు 28న ‘బ్లఫ్ మాస్టర్’ రిలీజవుతున్నట్లు ప్రకటించారు. అదే రోజు నిఖిల్ మూవీ ‘ముద్ర’ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో ఏది పైచేయి సాధిస్తుందో.. సత్యదేవ్ తన టాలెంటుకు తగ్గ హిట్ కొడతాడేమో చూడాలి. ఇంతకుముందు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ తో ‘రోమియో’ అనే సినిమా తీసిన గోపీ గణేష్ ‘బ్లఫ్ మాస్టర్’కు దర్శకత్వం వహించాయి. శ్రీదేవి మూవీస్ - అభిషేక్ పిక్చర్స్ బేనర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందిత శ్వేత సత్యదేవ్ కు జోడీగా నటించిందీ చిత్రంలో. రకరకాల ఆర్థిక మోసాలు చేసే బతికే మాయల మరాఠీ పాత్రలో సత్యదేవ్ నటించాడిందులో. తమిళంలో ‘ఖాకి’ దర్శకుడు వినోద్ వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. అతడికదే తొలి సినిమా.

వ్యవస్థలో పురుగులపై శంకర్ కు ఎంత కోపమో!

Director-Shankar-on-ABout-Robo-2-0-Movie-Andhra-Talkies
Director-Shankar-on-ABout-Robo-2-0-Movie-Andhra-Talkies
సూపర్ స్టార్ రజనికాంత్ శంకర్ ల విజువల్ వండర్ 2.0 ధియేటర్లలో రచ్చ చేయడం మొదలు పెట్టింది. ఏ రేంజ్ హిట్ ఎలాంటి వసూళ్లు వస్తాయి అనేది తేలడానికి టైం పడుతుంది కాని కించిత్ కూడా పోటీ లేని లాంగ్ వీకెండ్ ని తలైవా ఫుల్ గా వాడుకోబోతున్నాడు. ఇక శంకర్ దర్శకత్వం గ్రాఫిక్స్ పరంగా అద్భుతంగా ఉన్నా థీమ్ ని ప్రెజెంట్ చేయడంలో మునుపటి స్థాయిని చూపలేకపోయాడన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.

ఇకపోతే శంకర్ లో సామాజిక స్పృహ ఎంత ఉందో మరోసారి 2.0 లో బయట పడింది. అదెలా అంటారా. మీరే చూడండి. మొదటి సినిమా జెంటిల్ మెన్ మొదలుకుని ఇవాల్టి 2.0 దాకా తన సినిమాల్లో హీరోలు వ్యవస్థకు చీడపురుగుల్లా మారి డబ్బు కోసం దిగజారిన వాళ్ళను హత్య చేయడం కామన్ గా కనిపిస్తుంది. జెంటిల్ మెన్ లో ముఖ్య మంత్రి-ప్రేమికుడులో గవర్నర్- భారతీయుడులో ప్రభుత్వాధికారులు- ఒకే ఒక్కడులో మాజీ సిఏం-ఐలో పెద్ద మల్టీ మిలియనీర్ ఇలా అందరు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు ఎంత తప్పు చేసినా వదలకూడదు అనేది శంకర్ సిద్దాంతంగా చూపిస్తాడు.

అన్నంత పనీ చేసిన తమిళ్ రాకర్స్

Robo-2-0-Movie-Leaked-On-day-1-Andhra-Talkies
Robo-2-0-Movie-Leaked-On-day-1-Andhra-Talkies
దాదాపు 600 కోట్ల బడ్జెట్ వెచ్చించి - నాలుగేళ్ల పాటు.. వందలాది మంది టెక్నీషియన్లు రేయింబవళ్లు శ్రమిస్తే .. రూపొందిన సినిమా 2.0. ఇలాంటి సినిమాని పైరసీకారులు లీక్ చేసినా చూడకండి. థియేటర్లకు వచ్చి సినిమాని బతికించండి అని ప్రాధేయ పడింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ సందేశం వైరల్ అవుతోంది. ఉదయం ఆట పడింది మొదలు.. తమిళనాడు వ్యాప్తంగా రజనీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక అద్భుతాన్ని చూశామన్న ఆనందంతో డప్పులు వాయిస్తూ మతాబులు - తారా జువ్వలు వెలిగించి సంబరాలు చేసుకుంటున్నారు. అన్నిటికీ మించి భారత దేశంలో సైతం ఇక మీదట అవెంజర్స్ - బ్లాక్ పాంథర్ - బ్యాట్ మేన్ - స్పైడర్ మేన్ లాంటి గొప్ప సినిమాల్ని తీయగలిగే సత్తా ఉందని శంకర్ నిరూపించారన్న ప్రశంసలు దక్కుతున్నాయి. 2.0కి సమీక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చినా 3డి విజువల్స్ - టెక్నికాలిటీస్ పరంగా ఎంతో గొప్ప స్టాండార్డ్స్ని ఆవిష్కరించిందన్న ప్రశంసలు దక్కాయి.

డిసెంబర్ 21 - అంతా కొత్త సినిమాల మోత! | December 21 - All the new movies!

21-december-21-all-new-movies-andhra-talkies
December 21 - All the new movies!
ఒకే రోజు రెండు మూడు సినిమాలు విడుదల కావడం చాలా సాధారణం అయిపోయింది. వసూళ్ల పరంగా ఒకదాని మీద మరొకటి ప్రభావం చూపిస్తుందని తెలిసినా కూడా నిర్మాతలకు వేరే ఆప్షన్ ఉండటం లేదు. ఇప్పుడు వదిలేస్తే మరో వారానికి పోటీ పెరగడమో లేదా హాలిడే సీజన్ ని మిస్ కావడమో జరుగుతుంది. అందుకే సై అంటే సై అంటూ బరిలో దూకుతున్న వాళ్లే ఎక్కువ. ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్ 21 అన్ని క్రేజే సినిమాలతో చాలా హాట్ గా మారేలా ఉంది.

శర్వానంద్-సాయి పల్లవి కాంబోలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు మీద ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందించిన మొదటి టాలీవుడ్ స్పేస్ థ్రిల్లర్ అంతరిక్షం కూడా అదే డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇదే హోరా హోరి అనుకుంటే కన్నడ స్టార్ యష్ హీరోగా రూపొందిన శాండల్ వుడ్ మోస్ట్ కాస్ట్లీ మూవీ కేజీఎఫ్ కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. యష్ కి ఇక్కడ ఇమేజ్ లేకపోయినా కోలార్ బంగారు గనుల నేర సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ ఇక్కడి ప్రేక్షకులకు సైతం ఆకట్టుకుంటోంది. టాక్ పాజిటివ్ గా ఉంటే పోటీ  టఫ్ గానే ఉంటుంది.

శ్రీదేవి సీక్రెట్స్ బయట పెట్టనున్న "అతిలోక సుందరి శ్రీదేవి కథ" పుస్తకం | Sridevi Secrets is a book of the "Athiloka Sundari Sridevi" book

Athiloka-Sundari-Sridevi-Book-on-Secrets-in-Sridevi-Life-Andhra-Talkies
Sridevi Secrets is a book of the "Athiloka Sundari Sridevi" book
అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం గురించి తెలిసిందే. దుబాయ్ లో చుట్టాల పెళ్లికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆ ఘటనను శ్రీదేవి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి. కాలంతో పాటే మరపు. శ్రీదేవి తర్వాత వారసురాలు జాన్వీలోనే తనని చూసుకుంటున్నారు ఫ్యాన్స్. జాన్వీ ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసి కథానాయికగా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ సన్నివేశంలో శ్రీదేవి సీక్రెట్స్ ని రివీల్ చేస్తూ ఓ పుస్తకం లాంచింగ్ కి రెడీ అవుతుండడం ఫిలింనగర్ సర్కిల్స్ లో చర్చకొచ్చింది.

అతిలోక సుందరి శ్రీదేవి కథ` పేరుతో ఈ పుస్తకాన్ని సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించారు. మద్రాసు పరిశ్రమ నుంచి హైదరాబాద్ లో టాలీవుడ్ వేళ్లూనుకునే క్రమంలో ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ - శోభన్ బాబు వంటి స్టార్ల సరసన శ్రీదేవి నటించారు. ఎన్నో క్లాసిక్ హిట్స్ లో గొప్ప అభినయనేత్రిగా నిరూపించుకున్నారు. ఆ సమయంలోనే శ్రీదేవిని పలుమార్లు పసుపులేటికి ఇంటర్వ్యూలు చేశారు. శ్రీదేవి కెరీర్ ఆద్యంతం అత్యంత సన్నిహితంగా మెలిగిన జర్నలిస్టు ఆయన. శ్రీదేవికి సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాలు ఆయనకు తెలుసు. వాటన్నిటినీ గుదిగుచ్చి ఇప్పుడు పుస్తకంగా ఆవిష్కరిస్తున్నారు. శ్రీదేవి కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ హీరో మిధున్ చక్రవర్తిని పెళ్లాడిందన్న పుకార్లు షికారు చేశాయి. అసలు అందులో నిజం ఎంతో తెలియాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. అలాగే చిరంజీవి హీరోగా ఓ సినిమా నిర్మించాలన్న కోరిక శ్రీదేవికి ఉండేది. కానీ అది నెరవేరకపోవడానికి కారణమేంటో ఈ పుస్తకంలో వెల్లడించారని తెలుస్తోంది. బోనీతో పెళ్లి సహా ఇంకా ఎన్నో టాప్ సీక్రెట్స్ ని ఈ బుక్ లో రివీల్ చేశారట.

అస్సలు టెన్షన్ వద్దు.. 'అత్తారింటికి దారేది' ఆగదు

Vantha-Rajavathaan-Varuven-Release-Date-Simbu-STR-Statement-Andhra-Talkies
Vantha-Rajavathaan-Varuven-Release-Date-Simbu-STR-Statement-Andhra-Talkies
తమిళ స్టార్ హీరో శింబు ఎంత వివాదాస్పదుడు అయినా కూడా ఆయనకు భారీ ఫ్యాన్స్ ఉంటారు. శింబు యాటిట్యూడ్ కారణంగా అభిమానించే వారు ఎంతో మంది ఉంటారు. ఈమద్య కాలంలో సూపర్ హిట్ లు ఏమీ లేకున్నా కూడా శింబును ఆయన ఫ్యాన్స్ అభిమానిస్తూనే ఉంటారు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘నవాబ్’ చిత్రంతో శింబు ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ప్రస్తుతం శింబు హీరోగా ‘అత్తారింటికి దారేది’ చిత్రం తమిళంలో రీమేక్ అవుతుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ చిత్రంను అడ్డుకుంటామని గతంలో శింబుతో సినిమా చేయాలని అడ్వాన్స్ ఇచ్చిన ఒక నిర్మాత హెచ్చరిస్తున్నాడు.

శింబు కొన్నాళ్ల క్రితం ‘అన్భనవన్ అసరదవన్ అదన్గదవన్’(అఅఅ) చిత్రం చేసేందుకు నిర్మాతల వద్ద అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ చిత్రం షూటింగ్ కొంత పూర్తి అయిన తర్వాత ఏదో కారణం వల్ల సినిమా నుండి శింబు తప్పుకున్నాడట. శింబు ఆ సినిమా నుండి తప్పుకోవడంతో నిర్మాతలు ఆర్థికంగా నష్టపోయాం అంటూ చట్టపరమైన చర్యలకు సిద్దం అయ్యారట. తమ బ్యానర్ లో మొదలు పెట్టిన ‘అఅఅ’ చిత్రంను పూర్తి చేసిన తర్వాతే శింబు మరే సినిమాను అయినా విడుదల చేసుకోవాలంటూ ఆ నిర్మాతలు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

తెలుగు చిత్రపరిశ్రమ గ్రేట్ నటుడు కోట శ్రీనివాసరావు బయోగ్రఫీ | Tollywood Great Actor Kota Srinivasarao Biography In Book Andhra Talkies

Tollywood-Great-Actor-Kota-Srinivasa-Rao-Biography-In-Book-Andhra-Talkies
Kota Srinivasarao Biography 
నాలుగు దశాబ్ధాల నటజీవితంతో సుదీర్ఘ అనుభవం ఉన్న నటుడు కోట శ్రీనివాసరావు. 76 వయసులోనూ ఆయన అంతే ఉత్సాహంగా కనిపిస్తారు. ఉన్న మాటను ఉన్నదున్నట్టు ముక్కుసూటిగా మాట్లాడుతూ నిరంతరం చర్చల్లో నిలుస్తుంటారు. పరభాషా నటుల ప్రాపకాన్ని సహించలేని కోట దానిపై పలుమార్లు విరుచుకుపడిన సంగతిని గుర్తు చేసుకోవాలి. నవరసాల్ని అలవోకగా పోషించే గ్రేట్ ఆర్టిస్టు. అందుకే కోట అంటే తెలుగువారికి ఎనలేని గౌరవం. విలనీకి రావు గోపాల్ రావ్ తర్వాత అంతటి అర్థం చెప్పిన మహానటుడు ఆయన.

మోడ్రన్ సినిమాల్లో కుప్పిగంతులు.. ఆర్టిస్టుల వెకిలితనాన్ని ఆయన తనదైన శైలిలో విమర్శిస్తుంటే చాదస్తం కోట అని అన్నవాళ్లు.. ఉడుక్కునేవాళ్లకు కొదవేం లేదు. నాటి సినిమాల సెట్స్లో ఉండే వాతావరణ ఇప్పుడు లేదని దర్శకనిర్మాతల్ని - తోటి ఆర్టిస్టుల్ని ఆయన చురకలు వేయడంతో ఈ పేరొచ్చిందేమో బహుశా. ఏదేమైనా వందలాది చిత్రాల్లో నటించిన కోట ఇతరులతో పోటిస్తే ఎంతో విలక్షణుడు. హీరోయిన్ ముందు హీరో కోతిలా గెంతుతూ ఉంటాడు. కిందపడి గిలగిల కొట్టుకుంటుంటాడు. అదేం డాన్స్ అంటే.. ఫ్లోర్ డ్యాన్సులంటారు. మామూలుగా మన ఇళ్ళల్లో అమ్మాయిల ముందు అబ్బాయిలు గెంతుతారా.. గెంతరు కదా. పద్ధతిగా.. హుందాగా నడుచుకుంటారు. కానీ సినిమాల్లో అలా ఎందుకుంటారో? అలాగే ప్రతి పాటకూ బ్యాగ్రౌండ్ లో 50 మంది డ్యాన్సర్లుంటారు. ఇంతమంది అవసరమా అనిపిస్తుంది. గత సినిమాలలో హీరో జైలు కెళితే మాసిన గడ్డంతో దర్శకులు చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ గడ్డంతో కనిపిస్తున్నారు. ముఖమంతా గడ్డముంటే హీరో ఎలా అవుతాడు? అని చురకలు వేశారాయన. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో.

అవును.. అయితే తప్పేంటీ? | Yes .. but wrong?

అవును.. అయితే తప్పేంటీ? | Yes .. but wrong?

Akshara-hassan-Selfies-Andhra-Talkies
అవును.. అయితే తప్పేంటీ? | Yes .. but wrong?
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతుర్లు ఇద్దరు కూడా చాలా స్వాతంత్య్రంగా తండ్రి హెల్ప్ లేకుండా సినిమా ఇండ్రస్టీలో ఎంట్రీ ఇచ్చారు. శృతిహాసన్ ఇప్పటికే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. చిన్నమ్మాయి అక్షర హాసన్ దర్శకత్వ శాఖలో చేస్తూ హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అక్షర హాసన్ కు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేశాయి. లో దస్తుల్లో ఆమె తీసుకున్న సెల్ఫీ లు వివాదాస్పదం అయ్యాయి. ఆ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయి ఫొటోలపై అక్షర రియాక్షన్ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు.

తాజాగా అక్షర హాసన్ ఆ విషయమై స్పందించింది. ఆ ఫొటోలు లీక్ అవ్వడం నాకు ఆశ్చర్యంను కలిగించింది. నేను చేయాల్సిన ఒక సినిమా కోసం తీసుకున్న స్టిల్స్ అవి. వాటిని నేను ప్రొఫెషనల్ గానే తీశాను తప్ప మరే ఉద్దేశ్యం లేదు. లీక్ అయిన ఫొటోల గురించి మరీ ఇంతగా ఎందుకు చర్చ జరుపుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ ఫొటోల్లో ఉన్న తప్పేంటీ అంటూ అక్షర ప్రశ్నించింది. మళ్లీ అవసరమైతే అలాంటి ఫొటోలు నేను తీసుకుంటాను అందుకు నేను ఏమాత్రం వెనుకాడను అంది.

పిల్లల ఫిలిం డెబ్యూ పై ఓపెన్ అయిన అమీర్ | Amir, who is open on a children's film debut

పిల్లల ఫిలిం డెబ్యూ పై ఓపెన్ అయిన అమీర్ | Amir, who is open on a children's film debut

Aamir-Khan-Son-and-Daughter-Debut-Andhra-Talkies
అమీర్ ఖాన్ కు బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పేరు. సినిమాల విషయంలో అమీర్ పడే తపన సంగతి అందరికీ తెలిసిందే. కానీ తన కుటుంబసభ్యుల గురించి చాలా అరుదుగా మాత్రమే మాట్లాడతాడు. రీసెంట్ గా అమీర్ ఖాన్ కాఫీ విత్ కరణ్ చాట్ షో లో పాల్గొన్నాడు.  తన పిల్లల సినిమా ఎంట్రీ గురించి ఓపెన్ అయ్యాడు.

కొడుకు జునైద్..కూతురు ఐరా కు సినిమాల్లోకి రావాలనే ఉందని వెల్లడించాడు. జునైద్ కి యాక్టర్ కావాలని.. డైరెక్షన్ కూడా చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు. కానీ తను ఎంచుకున్న మార్గం పూలబాట ఏమీ కాదని ఒక క్లిష్టమైన దారి అని ముందే హెచ్చరించాడట. అమీర్ ఖాన్ కొడుగ్గా తనకు పోలికలు ఎదురవుతాయని వాటన్నిటికి సిద్దంగా ఉండాల్సిందే అని చెప్పేశాడట.   కుమారుడికి తనవైపు నుండి ఎటువంటి సపోర్ట్ ఇవ్వనని తేల్చేశాడు. కూతురి విషయంలో కూడా తన వైఖరి ఏమీ మారదని అన్నాడు.  వాళ్ళే కష్టపడి తమకు కావాల్సింది సాధించుకోవాలని.. నేను వారికి సపోర్ట్ ఇవ్వడం సినిమాకు.. ప్రేక్షకులకు అన్యాయం చేయడమే అన్నాడు.

తన కూతురు సినిమాలో ఏ డిపార్ట్మెంట్ అంటే ఇష్టపడుతుందో తనకు ఇంకా తెలియదని అన్నాడు. ఇక వాళ్ళిద్దరికీ ఫీడ్ బ్యాక్ ఇచ్చే విషయంలో కూడా నిక్కచ్చిగా ఉంటానని చెప్పాడు. తన కొడుక్కి అర్హత లేదు అంటే ఆ విషయంలో తను సపోర్ట్ ఇవ్వడం జరగదని అన్నాడు.  చూస్తుంటే.. మరీ కఠినాత్ముడైన తండ్రిలా ఉన్నాడే..!

అవతార్ 2 - అవతార్ 3 కథలు లీక్

Hollywood-latest-movies-Avatar-2-and-Avatar-3-Movie-Script-Leaked-Andhra-talkies

అవతార్ 2 - అవతార్ 3 కథలు లీక్

2009లో రిలీజైంది అవతార్. 2.7 బిలియన్ డాలర్ల గ్రాస్ తో ఇప్పటికీ ఈ సినిమా నంబర్ 1 స్థానంలో నిలిచింది. అవతార్ రిలజై ఇప్పటికే 9 ఏళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. దాదాపు పదేళ్ల తర్వాత ఈ సిరీస్లో సీక్వెల్ సినిమాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. 18 డిసెంబర్ 2020లో అవతార్ 2 - 17 డిసెంబర్ 2021న అవతార్ 3 చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయని ఇదివరకూ దర్శకదిగ్గజం - ది గ్రేట్ జేమ్స్ కామెరూన్ ప్రకటించారు. అవతార్ సినిమాలో ఒక పండోరా చూపించినందుకే అంత ఎగ్జయిట్ అయ్యారు. ముందుంది ముసళ్ల పండగ! అని అప్పట్లోనే ప్రకటించాడు. అందుకు తగ్గట్టే భారీ కాన్వాసుపై పార్ట్ 2 -3 చిత్రాల్ని పూర్తి చేస్తున్నారు.

ఇప్పటికి అవతార్ 2 - అవతార్ 3 సినిమాల చిత్రీకరణ పూర్తయింది. ఇకపై నిర్మాణానంతర పనులు పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉంది. అంటే ఇంకో రెండేళ్ల పాటు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కే కేటాయించనున్నారు. ముందుగా షూటింగ్ పూర్తవ్వగానే అవతార్ లోగోని కామెరూన్ బృందం ఆవిష్కరించింది. ఈ లోగోని `పాపిరస్` తరహాలో డిజైన్ చేయడం ఆసక్తి పెంచుతోంది. ఈ డిజైన్ లో జేక్ సుల్లీ రెట్టింపు బలం పెంచుకుని తన డేగ (పాపిరస్)పై ప్రయాణిస్తూ కనిపించాడు.

షాక్ ఇవ్వబోతున్న అనుష్క!

Sexy-Heroin-Anushka-Shetty-Future-Plans-Andhra-Talkies

షాక్ ఇవ్వబోతున్న అనుష్క!

ఎప్పుడో జనవరిలో వచ్చిన భాగమతి తర్వాత స్వీటీ అనుష్క మళ్ళి వెండితెరపై కనిపించక అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. కొత్త సినిమా తాలూకు అప్ డేట్స్ లేవు. సరే పోనీ పెళ్లి వార్తయినా తెలుస్తుందేమో అనుకుంటే అసలు మైకు ముందుకు వస్తే కదా. గత కొంత కాలంగా వెయిట్ లాస్ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి దానికి సంబందించిన శిక్షణలో బిజీగా ఉన్న అనుష్క త్వరలోనే స్వదేశానికి తిరిగి రానుంది. అందరూ ఊహిస్తున్నట్టు పెళ్లి కోసం కాదు. ఓ తమిళ సినిమాలో నటించేందుకు రెడీ అవ్వడానికి.

లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులో ఇంతకు ముందు చేయని సరికొత్త పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్. తిరిగి వచ్చాక అన్ని వివరాలు తెలియజేయబోతున్నారు. అందులో హీరో ఎవరు లాంటి విషయాలు మాత్రం ఇప్పటికి  గుట్టే. బాహుబలి తర్వాత నిజానికి అనుష్కకు లెక్కలేనన్ని ఆఫర్స్ వచ్చాయి. భాగమతి తర్వాత కూడా అంతే. కొరటాలశివ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే 152 సినిమాకు అనుష్కనే అడిగినట్టు ప్రచారం జరిగింది.

ఆడది అవసరం కాదు- బాలయ్య

Hero-Balakrishna-Speech-at-Aravinda-Sametha-Success-Meet-Andhra-Talkies.jpg

ఆడది అవసరం కాదు- బాలయ్య

అరవింద సమేత సక్సెస్ వేదిక ఆద్యంతం హరికృష్ణ నామస్మరణతో హోరెత్తింది. నందమూరి హరికృష్ణ జోహార్.. ఎన్టీఆర్ జోహార్ అంటూ నందమూరి హీరోలు బాలయ్య - ఎన్టీఆర్ - కల్యాణ్ రామ్ ఫ్యాన్స్ లో స్ఫూర్తి రగిలించారు. ఇదే వేదికపై ఎన్టీఆర్ సినిమా విజయాన్ని కీర్తించిన బాలయ్య హరికృష్ణతో తన అనుబంధాన్ని అన్నయ్యలోని ధీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు.

ముక్కుసూటి తత్వం ఉన్న అన్నయ్య ప్రజా శ్రేయస్సు కోసం ఆవిర్భవించిన తెలుగు దేశం పార్టీ కి వెన్నంటి నిలిచారు. చైతన్య రథ సారథి .. నా అన్నయ్య నందమూరి హరికృష్ణ జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడం నా హృదయాన్ని ధ్రవీభవింపజేసింది... అని బాలయ్య బాధను వ్యక్తం చేశారు. లాభనష్టాలు చూడకుండా తాను అనుకున్నదాని కోసం ముక్కుసూటిగా వెళ్లేవాడు అన్నయ్య. ఆయన ఒక మొరటు మనిషి.. మనసు వెన్న. కరిగిపోయే తత్వం ఉన్నవాడు. అవన్నీ ఆయనలో ఉన్న గొప్ప అలంకారం.. నాన్న గారు తెలుగు దేశం పార్టీ పెట్టిన తొలిరోజుల్లో పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రంలో ఒక వికాసాన్ని ప్రవహింపజేసి చైతన్య రథసారథి అయ్యాడు. అందుకే ఈ సభాముఖంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నా. నాన్నగారి మరణానంతరం హిందూపురంలో రికార్డు ఓట్లతో గెలిచినవాడు అన్నయ్య. ఎమ్మెల్యే అయ్యాక రైతుల కోసం ఎంతో చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉపాధి కల్పించారు. పార్టీ తరపున బోలెడంత కృషి చేశారు... అనీ గుర్తు చేసుకున్నారు.

విషాదం నుంచి వెలుగు పంచిన తారక్!

Hero-Junior-NTR-Speech-At-Aravinda-Sametha-Success-Meet-Andhra-Talkies.jpg

విషాదం నుంచి వెలుగు పంచిన తారక్!

అరవింద సమేత- వీర రాఘవ` షూటింగ్ ముగింపులో ఉండగా తారక్ తండ్రి నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణానికి గురైన సంగతి తెలసిందే. ఆ ఘటన ఇప్పటికీ నందమూరి కుటుంబాన్ని విడిచిపెట్టడం లేదని అర్థమవుతోంది. అరవింద వేదికలపై తారక్ - కళ్యాణ్ రామ్ కన్నీళ్లతో .. దుఃఖంతో కనిపించి అభిమానుల గుండెల్ని ద్రవింపజేశారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో తారక్ ఎంతో ఎమోషన్ అయ్యాడు. నేడు శిల్పకళా వేదిక పైనా తారక్ అంతే ఎమోషనల్ గా కనిపించాడు. తమ కుటుంబంలో విషాదం ఎదురైన వేళ ఇలాంటి విజయాన్ని ఇచ్చి త్రివిక్రమ్ వెలుగును పంచాడని అన్నాడు. ఈరోజు ఈ ఆనందాన్ని మీతోనే పంచుకుంటాను. అన్నయ్య నాన్న ఉండి ఉంటే బావుండేది అన్నారు. కానీ నాన్న ఎక్కడో లేరు. ఇక్కడే ఉండి చూస్తూ ఉంటారు. నాన్నగారు లేకపోయినా తండ్రి హోదాలో ఇక్కడికొచ్చిన బాబాయ్ కి పాదాభివందనాలు.. అనీ అన్నాడు.

సైరా వార్.. 50కోట్లు ఖర్చు పచ్చి అబద్ధమా?

Rumours-on-About-megastar-chirajeevi-movie-Sye-Raa-Movie-Budget-Andhra-Talkies.jpg

సైరా వార్.. 50కోట్లు ఖర్చు పచ్చి అబద్ధమా?

సైరా` చిత్రానికి అన్ లిమిటెడ్ బడ్జెట్ ఖర్చు చేస్తున్నామని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేత రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ సినిమాకి దాదాపు 200 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారని - కేవలం వార్ సన్నివేశాలకే రూ.50 కోట్లు వెచ్చించారన్న ప్రచారం సాగింది. అయితే ఇటీవల సామాజిక మాధ్యమాల్లో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో తరహాలో ప్రచారం చేస్తుండడంతో అందరిలో ఒకటే కన్ఫ్యూజన్ నెలకొంది.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విరోచిత పోరాటాల్ని ఇండియన్ సినిమా హిస్టరీలో మునుపెన్నడూ చూడని తీరుగా బెస్ట్ వార్ ఎపిసోడ్స్ చూపించాలన్న ప్లాన్ అయితే ఉంది. ఆ క్రమంలోనే జార్జియాకు వెళ్లింది సైరా యూనిట్. అక్కడ ఏకంగా 50కోట్లు ఖర్చు చేస్తూ భారీ పోరాట సన్నివేశాల్ని తీస్తున్నారన్న ప్రచారం తొలుత సాగింది. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నది ఒక కొత్త వాదన తెరపైకొచ్చింది. కేవలం వార్ ఎపిసోడ్స్ కు ఖర్చు చేసేది 50 కోట్లు అనుకుంటే - ఇందులో క్లైమాక్స్ కలుపుకుని సినిమా మొత్తంలో నాలుగు వార్ ఎపిసోడ్స్ వస్తాయిట. ప్రథమార్థంలో రెండు ద్వితీయార్థంలో రెండు భారీ వార్ సీక్వెన్సులు ఉంటాయని తెలుస్తోంది. వీటన్నిటికీ కలిపి 50కోట్ల బడ్జెట్ అని ఒక వాదన వినిపిస్తోంది. ఇక 200కోట్ల బడ్జెట్ లో మెగాస్టార్ పారితోషికం 30కోట్లు - యాక్షన్ ఎపిసోడ్స్ 50 కోట్లు మినహాయిస్తే 120 కోట్ల మేర సినిమా మొత్తానికి ఖర్చవుతుందని చెబుతున్నారు.

నా ఆర్మీ గురించి పూజా చెప్పగానే ఏడ్చేశాను : కౌశల్

Bigg-Boss-Winner-Kaushal-on-about-Kaushal-Army-Andhra-Talkies

నా ఆర్మీ గురించి పూజా చెప్పగానే ఏడ్చేశాను : కౌశల్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ కు ఈ విజయం అంత సునాయాసంగా రాలేదు అని షో చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. మొదటి వారం నుండి అతడు పడ్డ కష్టంకు సరైన ప్రతిఫలం దక్కింది అంటూ ఆయన అభిమానులు అంటున్నారు. బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ పేరును ప్రకటించిన వెంటనే భావోద్వేగంకు గురయ్యాడు. విజేతగా నిలిచిన కౌశల్ కు ఆయన ఆర్మీ అన్నపూర్ణ స్టూడియో నుండి పెద్ద ర్యాలీని నిర్వహించింది. ఈ కార్యక్రమం అనంతరం కౌశల్ మాట్లాడుతూ తనతో పోటీ పడ్డ ఇంటి సభ్యుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారిలో ఒక్క శ్యామల తప్ప మిగిలిన అంతా కూడా నన్ను టార్గెట్ చేశారు. ఇంట్లోంచి పంపించేందుకు శ్యామల తప్ప అందరు ప్రయత్నించారు అంటూ కౌశల్ అన్నాడు. నన్ను ఎలిమినేట్ చేయాలని బాబు గోగినేని శపథం చేశారు. అయితే నేను సింపుల్ గా నామినేట్ చేశాను. మీరు మాత్రం ఆయన్ను ఎలిమినేట్ చేసేందుకు ఎక్కువగానే కష్టపడ్డారు. తాను ఎప్పుడు కూడా తనీష్ తనకు పోటీగా భావించలేదు అన్నాడు. తనీష్ ఎక్కువగా దీప్తి సునయనకు పాంపరింగ్ చేయడంలోనే సరిపోయింది. అందుకే అతడు నాకు పోటీ అనుకోలేదు.

'బిగ్ బాస్' విన్నర్.. ముందే బయటికి

Bigg-Boss-Winner-Kaushal-Andhra-Talkies.jpg

'బిగ్ బాస్' విన్నర్.. ముందే బయటికి

అనుకున్నదే జరిగింది. ‘బిగ్ బాస్’ రెండో సీజన్ విజేతగా కౌశలే నిలిచాడు. సంచలనాలకు తావేమీ లేకుండా అతడికే ట్రోఫీని కట్టబెట్టారు. ఐతే ‘బిగ్ బాస్’ షోలో రాత్రి తొమ్మిది గంటలకు విజేతను ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ముందే విజేత ఎవరో వెల్లడైపోయింది. విన్నర్ ట్రోఫీతో కౌశల్ ఉన్న ఫొటోలు.. వీడియోలు ముందే బయటికి వచ్చేశాయి. విన్నర్ ట్రోఫీ చేతబట్టి హౌస్ మేట్లందరితో కలిసి కౌశల్ సెల్ఫీ తీసుకున్న పొటో రాత్రి ఏడున్నర ప్రాంతంలోనే సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఇది కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది.

సినిమా పరిశ్రమలో ఇంకెందరు తనుశ్రీలు ఉన్నారో?

Casting-Couch-Existance-in-Film-Industry-Andhra-talkies.jpg

సినిమా పరిశ్రమలో ఇంకెందరు తనుశ్రీలు ఉన్నారో?

ఇప్పుడు బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది. నటుడు నానా పాటేకర్ తో పాటు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మీద చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. నానా తనతో చాలా అసభ్యంగా ప్రవర్థించాడు అనేదే తనుశ్రీ ప్రధాన ఆరోపణ. ఎప్పుడో 2008లో జరిగితే ఇప్పుడెందుకు బయట పెట్టడం అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరికేసింది. అదే సంవత్సరమే సినీ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు తనుశ్రీ ఫిర్యాదు చేసినట్టు ఆధారాలు ఉన్నాయట. నానా లాంటి పెద్ద పలుకుబడి ఉన్న నటుడి మీద చర్యలు తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు కాబట్టి అప్పట్లో అది అంతకు మించి ముందుకు సాగలేదు.

హిందీ తెలుగు తమిళ్ లో కొన్ని సినిమాలు చేసాక తనుశ్రీ ఆధ్యాత్మికత వైపు వెళ్లిపోయింది. అందులోనే సన్యాసినిగా స్థిరపడిందనే అనుకున్నారు అందరు. కానీ అనూహ్యంగా తనుశ్రీ ఇప్పుడు వెలుగులోకి వచ్చి సంచలన ఆరోపణలు చేయడంతో తనకు మద్దతు ఇచ్చేవారు వ్యతిరేకించేవారు ఇద్దరూ తయారయ్యారు. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో అంతు చిక్కడం లేదు కానీ ఇప్పుడు చాలా విషయాలు చర్చలోకి వస్తున్నాయి.

సెట్లో మందు కొట్టిన నాగ్?

Naturural-Hero-Nani-On-About-Tollywood-Hero-Nagarjuna-in-Devadas-Movie-Andhra-Talkies.jpg

సెట్లో మందు కొట్టిన నాగ్? 

దేవదాస్’ టీంను మంచు లక్ష్మీప్రసన్న ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో ఆమె సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా నాగార్జున లక్ష్మి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలతో ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ‘‘సినిమాలో మీరెప్పుడూ చేతిలో మందు గ్లాసులో ఉంటారని విన్నాను. షూటింగ్ టైంలో నిజంగానే మందు కొట్టారా’’ అని లక్ష్మి ప్రశ్నించగా..  ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ ‘‘అవును మందు సిప్ చేసే వాడిని. సాయంత్రం షూటింగ్ ఉన్నపుడు కొంచెం కొంచెం మందు సిప్ చేసేవాడిని’’ అని నాగార్జున సమాధానం ఇచ్చాడు. దీనికి మంచు లక్ష్మి ఆశ్చర్య పోగా.. ‘‘నాకు చెప్పుంటే నేను కూడా జాయిన్ అయ్యేవాడిని కదా’’ అంటూ నాని కామెంట్ చేయడం గమనార్హం.

ఘంటసాల బయోపిక్..గొడవ మొదలైంది

Controversy-on-Old-Singer-Ghantasala-Biopic-Andhra-talkies.jpg

ఘంటసాల బయోపిక్..గొడవ మొదలైంది

ఈ రోజుల్లో ఒక సినిమా విషయంలో వివాదం మొదలైతే పబ్లిసిటీ పరంగా అది మంచికే అనుకుంటున్నారు. అందులోనూ అంతగా బజ్ లేని సినిమాలకు ఇలాంటివి చాలా అవసరమని భావిస్తున్నారు. ఇటీవలే ‘ఈ మాయ పేరేమిటో’ అనే చిన్న సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అసలేమాత్రం బజ్ లేని ఆ సినిమా గురించి ఈ వివాదం వల్లే జనాలకు తెలిసింది. కానీ ఆ గొడవ సినిమాకు ఏమాత్రం ప్లస్ అయిందన్నది సందేహమే.

ఇప్పుడు సెట్స్ మీద ఉన్న ఓ చిన్న సినిమా విషయంలో గొడవ మొదలైంది. ఇటీవలే దిగ్గజ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఘంటసాల పాత్రలో ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య నటిస్తున్నాడు. ఆయన సతీమణి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదుల నటిస్తోంది. ఐతే ఈ సినిమా విషయంలో ఘంటసాల కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

డ్యాన్స్ భంగిమల పేరు చెప్పి వేధించాడట!

Femina-miss-india-univers-Tanushree-Dutta-Says-She-Was-Abused-by-an-Actor-Andhra-Talkies

డ్యాన్స్ భంగిమల పేరు చెప్పి వేధించాడట!

2004 లో ఫెమినా మిస్ ఇండియా యునివర్స్ అయిన తనుశ్రీ దత్తా బాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో నటించింది.  ఇక తెలుగులో బాలయ్య సరసన 'వీరభద్ర'(2005) అనే సినిమాలో కూడా నటించింది.  దాదాపు ఏడెనిమిదేళ్ళ నుండి సినిమాల్లో  నటించడం లేదు.  రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన ఈ బాలీవుడ్ హీరోయిన్ అసలు గుర్తుపట్టలేనంతగా లావుగా మారింది.

తనకు గతంలో ఎదురైన వేధింపులపై పెదవి విప్పింది.  సినిమా ఇండస్ట్రీలో వేధింపులు నిజమేనని అందులో దాచిపెట్టాల్సిన విషయం ఏమీ లేదని చెప్పండి. తనకు కూడా అలాంటి వేధింపులు ఎదురయ్యాయని.. 2008 లో ఒక సినిమా షూటింగ్ సమయంలో సహనటుడు డ్యాన్స్ భంగిమలు నేర్పిస్తానని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. ఇక ఆ నటుడి పేరు మాత్రం వెల్లడించలేదు.  తను మాత్రమే కాదు ఇండస్ట్రీ చాలామంది హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితే ఉందని చెప్పింది.

అక్కినేని కోడలు నేచురల్ క్వీన్

chitu-wife-heroin-Samantha-In-Glamourous-Outfit-Andhra-Talkies.jpg

అక్కినేని కోడలు నేచురల్ క్వీన్

పెళ్లయితే ఏంటట? ఇటీవలి కాలంలో పలువురు కథానాయికల నుంచి ఎదురవుతున్న ఎదురు ప్రశ్న ఇది. నిజమే పెళ్లయితే ఏంటట? స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు పాతరేయాలా?  వాటిని హరించేది పెళ్లి ఎలా అవుతుంది? అన్నది వారి ఉద్ధేశం కావొచ్చు. ఈ విషయంలో ఒక్కో కథానాయికను ఒక్కోలా డిఫైన్ చేయొచ్చు.

ఇక అక్కినేని కోడలు సమంత వైఖరి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. వివాహానంతరం సామ్ స్వేచ్ఛ స్వాతంత్య్రం సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిచ్చింది. మామ గారు కింగ్ నాగార్జున - హబ్బీ యువసామ్రాట్ నాగచైతన్య సమంత కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో సాయపడుతున్నారు. బోలెడంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. భర్త సపోర్టు లేనిదే ఏదీ కుదరదని ఇటీవలే సామ్ ఓ బహిరంగ వేదికపైనే అన్నారు. ఆ సపోర్ట్ తోనే రంగుల ప్రపంచంలో తనకు కావాల్సిన విధంగా తనని ఆవిష్కరించుకుంటున్నారు సమంత.

మళ్లీ టాలీవుడ్ ను టెన్షన్ పెడుతున్న రజినీ | Rajini is tensioning again with Tollywood

Rajinikanth-Peta-Movie-Released-During-Sankranti-Andhra-Talkies

మళ్లీ టాలీవుడ్ ను టెన్షన్ పెడుతున్న రజినీ | Rajini is tensioning again with Tollywood

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం విడుదల విషయంలో అప్పుడు గందరగోళం నెలకొన్న విషయం తెల్సిందే. తెలుగులో పెద్ద హీరోల సినిమాల విడుదల తేదీ ఫిక్స్ అయిన తేదీలో ‘కాలా’ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగు నిర్మాతలు ‘కాలా’ విడుదల విషయంలో ధనుష్ తో కూడా చర్చలు జరపడం జరిగింది. ముందు నుండి ప్లాన్ చేసుకున్న తెలుగు సినిమాల విడుదల తేదీల్లో గందరగోళం ఏర్పడినది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి క్రియేట్ అవుతుంది.

ప్రస్తుతం రజినీకాంత్ ‘పేట’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. తమిళ ఆడియన్స్ లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రంను సంక్రాంతికి విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్లో చిత్రీకరణ పూర్తి చేసి జనవరిలో రెండవ వారంలో సినిమాను విడుదల చేసేందుకు చకచక వర్క్ జరుగుతుందని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇటీవలే చెప్పినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నాన్న లైఫ్ అలా కాదు..అందుకే బయోపిక్ వద్దు

Nagarjuna-Opens-about-ANR-Biopic-Andhra-Talkies

నాన్న లైఫ్ అలా కాదు..అందుకే బయోపిక్ వద్దు

బాలీవుడ్ లో గత కొంత కాలంగా కొనసాగుతున్న బయోపిక్ ల సందడి ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా కొనసాగుతోంది. ఇప్పటికే ‘మహానటి’ చిత్రంతో సావిత్రి జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు అశ్వినీదత్ తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. బయోపిక్ ఇప్పటి వరకు అతి పెద్ద విజయంగా ‘మహానటి’ నిలిచింది. ప్రస్తుతం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నందమూరి తారక రామారావు - వైఎస్ రాజశేఖర్ రెడ్డి - కత్తి కాంతారావు - కొండ మురళి ఇంకా పలువురి బయోపిక్ లు వస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఏయన్నార్ బయోపిక్ గురించి గత కొంత కాలంగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.

సోషల్ మీడియాలో ఏయన్నార్ బయోపిక్ గురించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వచ్చాయి. గతంలో పలు సార్లు నాగార్జున ఆ వార్తలను కొట్టి పారేశాడు. తాజాగా ఏయన్నార్ బయోపిక్ పై ఫుల్ క్లారిటీని అక్కినేని నాగార్జున ఇవ్వడం జరిగింది. నాన్న గారి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచన తనకు లేదని మరెవ్వరైనా ఆ ఆలోచనతో వచ్చినా కూడా తాము ఆసక్తి చూపించడం లేదంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బయోపిక్ లు తెరకెక్కుతున్న వ్యక్తులకు ఏయన్నార్ గారి జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుందని నాగార్జున అన్నాడు.

10 కోట్ల వ్యూస్ తో రంగమ్మా మంగమ్మా రచ్చ...రచ్చ! | Rangamma Mangamma Racha with 10 Crore Views

100-Million-views-for-Rangamma-Mangamma-song-Andhra-Talkies

10 కోట్ల వ్యూస్ తో రంగమ్మా మంగమ్మా రచ్చ...రచ్చ! | Rangamma Mangamma Racha with 10 Crore Views

దేవీ శ్రీప్రసాద్ ట్యూన్ చేస్తే చాలు ఆ పాట చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక దేవీ సంగీతం అందించిన సినిమాకు సుకుమార్ పిక్చరైజేషన్.. చరణ్ - సమంతాలాంటి లీడ్ యాక్టర్స్ తోడైతే ఆ పాట దుమ్ముదులపకుండా ఉంటుందా? 'రంగస్థలం' పాటలు సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.  ఇక అందులో 'రంగమ్మా మంగమ్మా' సాంగ్ తాజాగా 100 మిలియన్(10 కోట్లు) వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.

లహరి మ్యూజిక్ ద్వారా ఈ పాట ఫుల్ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేయగా ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను దాటింది.. 2.8 లక్షల లైక్స్ వచ్చాయి.  అతి తక్కువ సమయంలో ఇలా 100 మిలియన్ వ్యూస్ సాధించడం మరో విశేషం.  దేవీ ట్యూన్ తో పాటుగా.. చంద్రబోస్ క్యాచీ లిరిక్స్.. MM మానసి గానం..  చరణ్ ను ఆటపట్టిస్తూ సమంతా చేసిన అల్లరి ఈ పాటకు ఈ రికార్డును సాధించి పెట్టాయనడం లో సందేహం లేదు.

ఎన్టీఆర్' ను అమెజాన్ కొనేసింది. | Amazon has bought 'NTR'.

Amazon-Bags-Balakrishna-NTR-Biopic-Digital-Rights-andhra-talkies

ఎన్టీఆర్' ను అమెజాన్ కొనేసింది. | Amazon has bought 'NTR'.

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ పై బయోపిక్ తెరకెక్కిస్తున్నారు అనగానే అందరిలోనూ ఒకటే ఆసక్తి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ నేషనల్ ఫిగర్ కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు జాతీయ స్థాయిలోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ రాజకీయ చరిత్రతో పాటు - కాంగ్రెస్ కుహానా రాజకీయాల్ని - నాదెండ్ల వెన్నుపోటు రాజకీయాల్ని చూపిస్తారని ప్రచారమైంది. దీంతో ఇంకా ఇంకా ఉత్కంఠ రెయిజ్ అయ్యింది. సరిగ్గా ఇదే పాయింట్ ఎన్టీఆర్ బయోపిక్ కి మార్కెట్ పరంగా హైప్ పెంచేలా చేసింది. ఈ సినిమాని తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.

అవకాశాలు లేక బిక్షమెత్తుతున్న టాప్ డైరెక్టర్!

Opportunities-or-Bailing-Top-Director

అవకాశాలు లేక బిక్షమెత్తుతున్న టాప్ డైరెక్టర్!

బండ్లు ఓడలు - ఓడలు బండ్లు అవ్వడం అనేది సినిమా పరిశ్రమలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నిర్మాతల విషయంలో ఇది జరుగుతుంది. ఒక్క సినిమా హిట్ అయితే నిర్మాత స్థాయి అమాంతం పెరుగుతుంది. అదే సినిమా ఫ్లాప్ అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నిర్మాతలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. తాజాగా తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సెంథిల్ నాథన్ సినిమాల్లో ఆఫర్ లేక పోవడంతో కలత చెంది కంచి దేవాలయం వద్ద బిక్షాటనం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలిసిన పలువురు తమిళ సినీ ప్రముఖులు ఆయన్ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... అప్పట్లో ఎంజీఆర్ వంటి స్టార్ తో సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు జంబులింగం తనయుడు సెంథిల్ నాథన్. తండ్రి బాటలో సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన సెంథిల్ నాథన్ మొదట సహాయ దర్శకుడిగా పలు చిత్రాలకు వర్క్ చేశాడు. ఆ తర్వాత 20 చిత్రాలకు దర్శకుడిగా కూడా చేశాడు. అందులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక 2009వ సంవత్సరంలో ఉన్నై నాన్ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఆ సినిమా విడుదల కాలేదు. దాంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత బుల్లి తెరకు ఎంట్రీ ఇచ్చాడు.

మహేష్ - కొరటాల ఏంటిలా? | Mahesh - Koratala What is this?

Mahesh-Koratala-What-is-this?

మహేష్ - కొరటాల ఏంటిలా? | Mahesh - Koratala What is this?

మహేష్ - కొరటాల కాంబినేషన్ అనగానే `శ్రీమంతుడు` గుర్తుకొస్తుంది. ఆ వెంటనే `భరత్ అనే నేను` మైండ్ లోకొస్తుంది.  మహేష్ చేత ఊళ్లను దత్తత తీస్కునేలా చేశాడు. ఆ తర్వాత సీఎంగానూ ప్రమాణ స్వీకారం చేయించిన ఘనుడు కొరటాల శివ. రచయితగా - దర్శకుడిగా - దార్శనికుడిగా అన్ని కోణాల్లోనూ మెప్పు పొందాడు. ప్రస్తుత సమాజానికి ఎలాంటి సినిమా చూపిస్తే మంచిది? అన్నది కూడా కొరటాలకు బాగా తెలుసు. అన్ని కమర్షియల్ హంగులతో పాటు చక్కని సందేశం ఇవ్వాలి. సంఘంలో మార్పు కోరాలి. అలా చేస్తేనే ప్రేక్షకులు మెచ్చుకుంటారని పదే పదే ప్రూవ్ చేస్తున్నాడు. రాజమౌళి తర్వాత అపజయం అన్నదే లేని ఏకైక దర్శకుడిగా కొరటాల పేరు మార్మోగిపోతోంది.

అందుకే ఆ ఇద్దరూ ఓచోట కనిపించారు అనగానే బోలెడన్ని సందేహాలు. అసలింతకీ మహేష్ తో కొరటాల ఏం సంభాషిస్తున్నారు ఈ సీన్లో? అంటే ఇదంతా `అభి బస్` వాణిజ్య ప్రకటన కోసం చేసిన సెటప్. మహేష్ - వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో ఈ ప్రకటనను రూపొందించారు కొరటాల. రీసెంటుగానే షూటింగ్ పూర్తి చేశారు.  త్వరలోనే ఇది ఎయిర్ లోకి రానుంది. ఆ క్రమంలోనే మహేష్ ఫోటోలు అంతర్జాలంలోకి వచ్చాయి.

హరికృష్ణగారిలో తెలియని మరొక కోణం - తన తండ్రిని అమితంగా ప్రేమించే ఒక అద్బుతమైన కొడుకు | Another angle that is not known in Harikrishna is a wonderful son who loves his father very much

Hari krishana and NTR.jpg

హరికృష్ణగారిలో తెలియని మరొక కోణం - తన తండ్రిని అమితంగా ప్రేమించే ఒక అద్బుతమైన కొడుకు

నేటితరం ఎందరికో నందమూరి హరికృష్ణగారు ఒక సాధరణ రాజకీయనేతగానో లేక కొన్ని సినిమాలలో నటించిన నటుడిగానో లేక అన్నగారు NTR తనయుడిగానో తెలుసుండొచ్చు... కొంతమంది ఒక ఫెయిల్యూర్ సన్ అని అవహేళన చేయొచ్చు. But, he born to the Legend and he gave birth to the Legend.

* తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా దేశంలో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగినా కొటానుకోట్లు కూడ పెట్టుకోటం చేతకాని అమాయకపు కొడుకు.
* తన తండ్రికోసం తన 30 ఏళ్ల జీవితం అంకితం చేసి తండ్రి కి రక్షణ గా తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకున్నకొడుకు.
* తన తండ్రికోసం లక్ష కిలోమీటరులు ప్రచారవాహనం (చైతన్యరథం) నడిపిన రథసారథి.
* రోజుకు కేవలం 6 గంటలు రెస్ట్ తీసుకుంటూ వెన్నెముకనొప్పితో బాధ పడ్డా, కాళ్లకి బొబ్బలుకట్టినా చైతన్యరథం steering ని వదలని stubborn పర్సనాలిటీ.
* పెళ్ళై పిల్లలున్నా వారి అచ్చటముచ్చట చూసే అవకాశాన్ని తన తండ్రితో గడపటంకోసం త్యాగం చేసిన తండ్రి పిచ్చోడు.
* కోడికూయక మునుపే తండ్రిని మేలుకొలిపి నగరం నిద్రపోయాక తన తండ్రి తరువాత నిదురించే కొడుకు.
* తన కంటే బాగా తన తండ్రిని వేరెవరు అంత బాగ చూసుకోలేరేమో అనే సందేహంతో నిత్యం శివునికి నందిలా తండ్రి చేయి వీడని కొడుకు.
* తండికి జీవితాంతం రుణపడున్న కొడుకులు ఎందరో ఉంటారు.. కొట్లమందికి ఆరాధ్యుడైన తన తండ్రి తనకే రుణపడేలా చేసుకున్న ఆయన నడవడిక ప్రతి కొడుకుకి స్పూర్తిదాయకం.

తండ్రిని అందరు ప్రేమిస్తారు ఆరాధిస్తారు... అతని లా తండ్రిసేవలో తరించి తండ్రిని ప్రాణసమానంగా పూజించటం నేటితరంలో ఎవరికి సాధ్యం కాదు...
అందుకే
ఒక సుప్రీం జడ్జ్
ఉప రాష్ట్రపతి
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ఒక గవర్నర్, 
మూడు రాష్ట్రాల కాబినెట్ మినిస్టర్స్,
MLA లు, ఎంపీలు
వందల మంది రాజకీయ నాయకులు నటులు ప్రముఖులు
వెలాది అభిమానుల కన్నీళ్ళు

చెప్తుంది....అతని ప్రయాణం లొని లొతు అతని జీవితం లొని కమిట్మెంట్.
Your soul May Rest In Peace Sri Nandamuri Hari Krishna.

నందమూరి హరికృష్ణ గారి చివరి కోరిక తీరుద్దాం: హీరో మంచు మనోజ్ | Nandamuri Harikrishna's last wish will be: Hero Manchu Manoj

nandamuri-harikrishnas-last-wish-will-be-Hero-Manchu-Manoj

నందమూరి హరికృష్ణ గారి చివరి కోరిక తీరుద్దాం: హీరో మంచు మనోజ్ | Nandamuri Harikrishna's last wish will be: Hero Manchu Manoj

నందమూరి హరికృష్ణ గారి చివరి కోరిక తీరుద్దాం అంటూ మంచు మనోజ్ పిలుపునివ్వడంతో పలువురు ఫ్యాన్స్ తమవంతు బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు వస్తున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడానికి ముందు అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేరళ వరద విషాదం నేపథ్యంలో తన అరవై రెండవ పుట్టినరోజు జరుపుకోవడం లేదని, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా తన పుట్టినరోజు వేడుక జరుపవద్దని సూచించారు. తన పుట్టినరోజు సందర్భంగా పెట్టే ఖర్చును కేరళ వరద బాధితుల కోసం ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

చివరికోరిక తీరుద్దాం: మంజు మనోజ్ ఈ విషయమై మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ.... ‘హరికృష్ణగారి చివరి కోరిక తీరుద్దాం. ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపకుండా అందుకు పెట్టే ఖర్చును కేరళ వరద బాధితులకు విరాళంగా ఇద్దామని సూచించారు

బిడ్డకు తల్లి పాలిస్తున్నా విమర్శలేనా?

Lisa-Haydon-recalls-how-she-was-trolled-for-her-breastfeeding-picture-Andhra-Talkies.jpg

బిడ్డకు తల్లి పాలిస్తున్నా విమర్శలేనా?

బాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్ లీసా హెడెన్. ఈమె హిందీలో పలు చిత్రాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది. ఈమె ఎక్కువగా బోల్డ్ పాత్రలు చేయడం వల్ల ప్రేక్షకులు ఆమె ఏం చేసినా కూడా ఆ యాంగిల్ లోనే చూస్తున్నారు. ఈమె సంవత్సరం క్రితం తన కన్న కొడుకు జాక్కు పాలు ఇస్తూ ఫొటో తీయించుకుంది. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పిల్లలకు తల్లి పాలు ఎంత ముఖ్యమో చెబుతూ లీసా హెడెన్ కామెంట్ పెట్టింది. నలుగురిలో ఉన్నా కూడా చంటి బిడ్డకు పాలు ఇచ్చేందుకు తల్లిగా సంకోచించాల్సిన అవసరం లేదు అంటూ లీసా ఆ ఫొటో ద్వారా చెప్పాలని చూసింది.

లీసా ఒకటి అనుకుంటే జనాలు మరోటి అర్థం చేసుకున్నారు. తల్లి ప్రేమను బిడ్డకు పాల రూపంలో అందించాలని బిడ్డ ఆరోగ్యంగా జీవించేందుకు తల్లి పాలు ముఖ్యం అంటూ లీసా చెప్పాలనుకోగా జనాలు మాత్రం అందులో కూడా మరో యాంగిల్ ను వెదికి విమర్శలు చేయడం ప్రారంభించారు. సంవత్సర కాలంగా లీసాను విమర్శలతో జనాలు ముంచెత్తుతూనే ఉన్నారు. పశువులు మాత్రమే ఎక్కడ పడితే అక్కడ తమ పిల్లలకు పాలు ఇస్తాయి నువ్వు ఏమైనా పశువువా అందరి ముందు పాు ఇచ్చేందుకు అంటూ లీసాపై విమర్శలు వెళ్తు వెత్తాయి. ఇప్పటికి కూడా లీసా సోషల్ మీడియాలో పిల్లాడికి పాలు ఇస్తున్న ఫొటో పెట్టట్లేదు - పాలు ఇవ్వడం మానేశావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

శిష్యుడు చూపించిన దారిలో వెళ్తున్న వర్మ!! | Verma going on the path shown by the disciple !!

Ram-Gopal-Varma-Bhairava-Geetha-First-Look-Andhra-Talkies.jpg

శిష్యుడు చూపించిన దారిలో వెళ్తున్న వర్మ!! | Verma going on the path shown by the disciple !!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్మ శిష్యులు చాలా మంది ఉంటారు. కెరీర్ ఆరంభం నుండి కూడా వర్మ ఎంతో మంది శిష్యులను దర్శకులుగా తయారు చేశాడు. ఇతర దర్శకుల వద్ద కంటే వర్మ వద్ద శిష్యరికం చేస్తే వెంటనే డైరెక్టర్ అవ్వొచ్చు అనేది అప్పట్లో ఒక టాక్ ఉండేది. ఎంతో మంది దర్శకులను తన కంపెనీ నుండి తీసుకు వచ్చిన వర్మ తన కాన్సెప్ట్ లతో ఎంతో మంది దర్శకులుగా పరిచయం అయ్యేందుకు హెల్ప్ చేయడం జరిగింది. కొన్ని సార్లు తన శిష్యుల నుండి నిర్మొహమాటంగా స్క్రిప్ట్ ను తీసుకుని సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ ఉంది. తాజాగా తన శిష్యుడు తెరకెక్కించిన సినిమాను వర్మ కాపీ కొట్టినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వర్మ శిష్యుడు అజయ్ భూపతి తాజాగా ‘ఆర్ ఎక్స్100’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రం విభిన్నమైన ప్రేమ కథతో పాటు - రొమాంటిక్ సీన్స్ ఎక్కువ మొతాదుతో తెరకెక్కడం జరిగింది. దాంతో ఆ చిత్రానికి యూత్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. తాజాగా వర్మ నిర్మించిన ‘భైరవగీత’ అదే కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూస్తుంటే అనిపిస్తుంది.

అదంతా ఫేక్ అంటున్న అందాల రాక్షసి | That's all the fake!

అదంతా ఫేక్ అంటున్న అందాల రాక్షసి | That's all the fake!

'గీత గోవిందం' హిట్ అయింది.  దానికి కొన్ని నెలల ముందు 'తొలిప్రేమ' హిట్ అయింది. రెండిటికీ లింకేమీ లేదు.  కానీ రెండు హిట్లే.   'గీత గోవిందం' సినిమాను చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేసినట్టుగా పరశురామ్ - హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ చెప్పారు.   ఆ తర్వాత టాలీవుడ్ లో గట్టిగా వినిపించిన టాక్ ఏంటంటే 'తొలిప్రేమ'... 'గీత గోవిందం' సినిమాలను లావణ్య త్రిపాఠి రిజెక్ట్ చేసిందని.

ఈ విషయం లావణ్య వరకూ వెళ్ళడంతో ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించింది. 'ఫేక్ న్యూస్ అలెర్ట్' అంటూ ట్వీట్ చేసింది.  అంతేకాదు మరొక ట్వీట్ లో "కొన్ని రూమర్ల విషయంలో కామ్ గా ఉన్నానంటే దానర్థం నాగురించి ఏదిపడితే అది మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని కాదు" అంటూ  ఒక ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది.  దీనర్థం లావణ్య ఈ రెండిటినీ మిస్సవ్వలేదు.  మరి ఈ జనాలు అందాల రాక్షసికి కోపం వచ్చే రూమర్లు ఎందుకు పుట్టిస్తున్నారు?

కొత్త భామతో మణిరత్నం మాయ.. | Maniratnam Maya with new aunt

Lavanya-Responds-on-about-Rumours-She-Missed-Geeatha-Govindam-and-Tholi-PRema-Andhra-Talkies.jpg

కొత్త భామతో మణిరత్నం మాయ.. | Maniratnam Maya with new aunt

మణిరత్నం.. విలక్షణ ప్రేమ కథలకు పెట్టింది పేరు. ఎన్నో కళాత్మక చిత్రాలను తీసిన ఆయనకు ఇటీవల బ్యాడ్ టైం నడుస్తోంది. ఆయన తొలి చిత్రాలన్నీ బాక్సాఫీస్ హిట్స్.. ‘మౌనరాగం’ నుంచి చివరగా తీసిన ‘చెలియా’ వరకు ప్రతి సినిమాలోనూ కథానాయకుల పాత్రల్ని బాగా డిజైన్ చేశారు. మణి సినిమాలో నటించే హీరో హీరోయిన్లకు బాగా పేరొస్తుంది. అంతటి దిగ్గజ డైరెక్టర్ తో పనిచేయాలని ఒక్కసారైనా ప్రతి హీరో హీరోయిన్ ఆరాటపడుతుంటారు..

తాజాగా చాలా గ్యాప్ తర్వాత మణిరత్నం మరో మూవీని తీస్తున్నారు. ఇందులో శింబు - అరవింద్ స్వామి - విజయ్ సేతుపతిలు హీరోలుగా నటిస్తున్నారు. హీరోయిన్లుగా అదితిరావు హైదరీ - జ్యోతిక - ఐశ్వర్యా రాజేశ్ ఎంపికయ్యారు. మరో హీరోయిన్ పాత్ర కోసం వర్ధమాన మోడల్ డయానా ఎరప్పాను ఎంపిక చేశారు.

తెలుగు డబ్బింగ్ సినిమాలే చూడడానికి బాగున్నాయి. | Telugu dubbing movies are good to see.

తెలుగు డబ్బింగ్ సినిమాలే చూడడానికి బాగున్నాయి. | Telugu dubbing movies are good to see.

ఈమధ్య కాలంలో వస్తున్న తెలుగు మూవీస్ చూస్తుంటే ఇంతకూ ముందుకు చూసినటువంటి ఐదారు సినిమాలు గుర్తుకొస్తున్నాయి. ఏ సినిమా చూసినా విపరీతమైన బోరు కొడుతుంది. నచ్చే సినిమాలు, మనసుకు హత్తుకునే సినిమాలు చాలా వరకూ అడుగంటిపోయాయి. 

ఇటువంటి చెత్త సినిమాలు చూసే బదులు తెలుగు డబ్బింగుతో వస్తున్న హాలీవుడ్ సినిమాలే బాగుంటున్నాయి.

షోయబ్ ను సానియా పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం అదేనట! | Sania is the leading cause of her marriage to Shoaib!

Shoaib-and-I-didnt-marry-to-unite-India-Pakistan--Sania-Mirza-Andhra-Talkies.jpg

షోయబ్ ను సానియా పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం అదేనట! | Sania is the leading cause of her marriage to Shoaib!

అది ఆటైనా.. మరేదైనా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. దేశంలో మరే క్రీడాకారినికి లేనంత స్టార్ డమ్.. సెలబ్రిటీ స్టేటస్ సానియా మీర్జా సొంతంగా చెప్పాలి. ఆమెకు సంబంధించిన వార్తలకు మీడియాలో లభించే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దేశంలో ఇంతమంది క్రీడాకారులు ఉన్నా.. టీమిండియాలోని కొందరు క్రికెటర్ల తర్వాత.. ఆ స్థాయిలో సెలబ్రిటీ స్టేటస్ సానియా సొంతం.

ఆ మధ్యన పాక్ క్రికెటర్ షోయాబ్ మాలిక్ ను పెళ్లాడిన సానియా.. తాజాగా గర్భవతి అన్న విషయం తెలిసిందే. త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న ఆమె.. తాజాగా ఒక పత్రిక కోసం ఫోటో షూట్ లో పాల్గొన్నారు.ఈ  సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

అల్లు అరవింద్ నైరాశ్యంలోకి వెళ్లి ఇండస్ట్రీని వదిలేస్తాన్నాడట! | Allu Aravind went into the state of negligence and left the industry!

Allu-Aravind-Upset-with-Geetha-Govindam-Leakage-Andhra-Talkies.jpg

అల్లు అరవింద్ నైరాశ్యంలోకి వెళ్లి ఇండస్ట్రీని వదిలేస్తాన్నాడట! | Allu Aravind went into the state of negligence and left the industry!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిర్మాతగా కొనసాగుతున్నాడు అల్లు అరవింద్. ఇప్పటికీ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. యువ నటీనటులు.. దర్శకులతో సినిమాలు చేస్తూ.. మంచి విజయాలు అందుకుంటూ సాగిపోతున్నారాయన. మున్ముందు ఆయన నుంచి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. అలాంటి నిర్మాత ఇటీవల సినీ రంగాన్ని వదిలేయాలన్న నైరా శ్యంలోకి వెళ్లారట. అందుక్కారణం ‘గీత గోవిందం’ సినిమా పైరసీ బారిన పడటమేనట. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు విడుదలకు ముందే ఆన్ లైన్లో లీకైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆవేదనతో ఇండస్ట్రీకి దూరం కావాలనుకున్నారట.

గతం గతః అంటున్న అరవింద! | The past is going to last!

Pooja-Hegde-Ignores-Her-Debut-Movie-Andhra-Talkies

గతం గతః అంటున్న అరవింద! | The past is going to last!

పెద్ద హిట్లు లేకపోయినా టాప్ స్టార్ల సినిమాల్లో అవకాశం సాధించడం చాలా తక్కువ మంది బ్యూటీలకు మాత్రమే సాధ్యమవుతుంది.  బెంగళూరు బ్యూటీ పూజా అలాంటి లక్కీ హీరోయినే.  తెలుగులో ఒకరి అరా సినిమాల్లో నటించిన సమయంలోనే అశుతోష్ గోవారికర్ దర్శత్వంలో తెరకెక్కిన హృతిక్ రోషన్ సినిమా 'మొహెంజోదారో' సినిమాలో అవకాశం సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది.  కాకపొతే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఇక కెరీర్ దాదాపుగా ముగిసినట్టే అని కామెంట్స్ వినిపించాయి.  కానీ అల్లు అర్జున్ సినిమా 'డీజే' లో అవకాశం సాధించింది.  'డీజె' సినిమాలో తన గ్లామర్ షో తో అందరి దృష్టిని ఆకర్షించి వరసగా ఆఫర్లు అందుకుంది.

'శ్రీనివాస కళ్యాణం' షూటింగ్ లో ఆ రోజు.. | That day in 'Srinivasa Kalyanam' shooting

Satish-Vegesna-On-About-Srinivasa-Kalyanam-Movie-Andhra-Talkies

'శ్రీనివాస కళ్యాణం' షూటింగ్ లో ఆ రోజు.. | That day in 'Srinivasa Kalyanam' shooting

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో పని చేసే ప్రతి దర్శకుడూ చాలా సౌకర్యంగా ఉంటాడన్న అభిప్రాయాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. స్క్రిప్టు దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనూ రాజు ప్రమేయం ఉన్నప్పటికీ దర్శకుల్ని ఆయన బాగా గౌరవిస్తాడని అంటారు. రాజుతో పని చేసిన ప్రతి దర్శకుడూ ఆయన గురించి పాజిటివ్ గానే మాట్లాడతారు. ఐతే రాజుతో ‘శతమానం భవతి’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన సతీశ్ వేగేశ్నకు ఆయనతో ‘శ్రీనివాస కళ్యాణం’ షూటింగ్ సందర్భంగా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందట. సినిమాలో ఛండీగఢ్ నేపథ్యంలో సాగే సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా ఇద్దరికీ ఒక రోజు తేడా వచ్చిందట. ఛండీగఢ్ లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ కు సంబంధించి ఓ సన్నివేశం తీస్తుండగా.. రాజు వచ్చి సీన్ పేపర్లో డైలాగులపై అభ్యంతర పెట్టాడట.

ఏమిటీ వైపరిత్యం శ్రీనివాసా ?

Trade-Analysts-on-About-Srinivasa-Kalyanam-Movie-Andhra-Talkies.jpg

ఏమిటీ వైపరిత్యం శ్రీనివాసా ?

అనుకున్నట్టే శ్రీనివాస కళ్యాణం ఈ మధ్య టాలీవుడ్ కు బొత్తిగా కలిసి రాని నెగటివ్ పెళ్లి సెంటిమెంట్ బాటలోనే వెళ్తోంది. మొదటి షో నుంచే యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాకపోవడం ఒక ఎత్తైతే దిల్ రాజు సినిమాలు మెల్లగా పుంజుకుంటాయి అనే వాదనకు వ్యతిరేకంగా అంతకంతా సోషల్ మీడియాలో సైతం విమర్శలు రావడం ఖంగారు కలిగించే విషయమే. నిజానికి దిల్ రాజు మాత్రమే కాదు నితిన్ అభిమానులు కూడా దీనికి భారీ ఓపెనింగ్స్ ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. బిసి సెంటర్స్ లో ఇలాంటి ఫామిలీ మూవీస్ కి ఫస్ట్ డే వీక్ గా ఉండటం సహజం కాబట్టి వాటిని పక్కన పెట్టినా కీలకమైన వైజాగ్-విజయవాడ లాంటి చోట్ల కూడా ఉదయం ఆటకు కొన్ని థియేటర్స్ లో ఫుల్ రికార్డ్ కాలేదని ట్రేడ్ టాక్. ఓ సినిమా హాల్ లో 320 కెపాసిటీ ఉంటే కేవలం 70 టికెట్లు మాత్రమే తెగాయి అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గురువారం కాబట్టి అలా వచ్చి ఉండొచ్చు అని అనుకోవడనికి లేదు. బాగుంది అంటే మధ్యాహ్నం  నుంచే వసూళ్లు అనూహ్యంగా పెరగడం హిట్ అయిన సినిమాల విషయంలో చూస్తూనే ఉన్నాం. దానికి మహానటి మంచి ఉదాహరణ. బుధవారం రిలీజ్ అయినా బ్రహ్మరధం దక్కింది.

'ఎన్టీఆర్' లో నటించడం గొప్ప అనుభూతి:విద్యా బాలన్

Very-excited-about-NTR-biopic--says-Vidya-Balan-Andhra-Talkies.jpg

'ఎన్టీఆర్' లో నటించడం గొప్ప అనుభూతి:విద్యా బాలన్

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా `ఎన్టీఆర్ `బయోపిక్ తెరెకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ బయోపిక్ పై భారీ అంచనాలున్నాయి. బాలకృష్ణ నటిస్తూ సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న `ఎన్టీఆర్ `లో కీలక పాత్రల కోసం టాలీవుడ్ బాలీవుడ్ లోని ప్రముఖ నటులను ఏరికోరి ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్`సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ నటిస్తోంది. తొలిసారిగా తెలుగులో నటిస్తోన్న విద్యాబాలన్ కు....బాలకృష్ణ కుటుంబం సాదర ఆహ్వానం పలికి చీర కూడా బహూరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బయోపిక్ పై తొలిసారిగా విద్యాబాలన్ స్పందించింది. ఈ చిత్రంలో నటించడం ఓ గొప్ప అనుభూతని చెప్పింది. చిత్ర యూనిట్ చాలా బాగా ప్రొఫెషనల్ గా పనిచేస్తోందని అభిప్రాయపడింది. `మాల్టా` ఫిల్మ్ ఫెస్టివల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపకైన విద్యాబాలన్....మీడియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

రానా చంద్రబాబుగా ముస్తాబు | Rana chose to be Chandrababu

Rana-To-Play-ChandrababU-Naidu-Role-in-NTR-Biopic-Andhra-Talkies.jpg

రానా చంద్రబాబుగా ముస్తాబు | Rana chose to be Chandrababu

అంతా అనుకుంటున్నట్టుగానే చంద్రబాబు నాయుడు పాత్రలో రానా సందడి చేయబోతున్నారు.  చారిత్రాత్మకమైన `ఎన్టీఆర్` బయోపిక్ లో కీలకమైన బాబు పాత్ర చేయాల్సిందే అని రానాని దర్శకుడు క్రిష్ పట్టుబట్టడంతో ఆయన ఓకే చెప్పేశారు. ఇటీవలే రానాపై టెస్ట్ షూట్ కూడా చేశారు. చంద్రబాబు మేనరిజమ్స్ తో పాటు - ఆయనలా గెటప్ వేసుకొని రిహార్సల్స్ చేశాడట రానా.  ఆ గెటప్ లో రానా కనిపించిన విధానం క్రిష్ కి బాగా నచ్చిందట. గెటప్ పరంగా  మరికొన్ని మెరుగులు దిద్దుకొని రానా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.

సినిమాలో చంద్రబాబుగా రానా మూడు కీలకమైన సన్నివేశాల్లో కనిపిస్తాడట. ఆ సన్నివేశాల్లో ఒకటి పెళ్లి నేపథ్యంలో సాగుతుంది. మిగతావి ఎన్టీఆర్ తో సాన్నిహిత్యానికి సంబందించినవీ అలాగే  రాజకీయ వ్యవహారాలతో పాటు కుటుంబానికి సంబంధించిన సన్నివేశాల్లో రానా కనిపించబోతున్నాడు. చంద్రబాబు  మంత్రి అయ్యాకే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకొన్నారు. అందుకే పెళ్లి నేపథ్యంలో సన్నివేశాల్ని కాస్త భారీగానే తీయబోతున్నారట. అయితే అప్పటివాతావరణాన్ని ప్రతిబింబించేలాగే ఆ సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...