యాక్టర్ కాబోయి డైరెక్టర్ అయ్యా

Director-Bobby-about-His-Acting-Dream-andhra-talkies-telugu.jpg
సినిమా అనేది అందమైన రంగుల ప్రపంచం. అందులో వెలిగిపోవాలని ఎందరో కలలు కంటుంటారు. సినిమాల్లో నటించాలని ఊరు వదిలి ఫిలిం నగర్ కు వచ్చినవాళ్లు ఎలాగైనా వెండితెరపై కనిపించాలని తాపత్రయపడుతుంటారు. చిన్నాచితకా పాత్రలైనా చేయడానికి రెడీ అవుతారు. కానీ తెరపై కనిపించే ఛాన్స్ వచ్చినా లాగు వేసుకోవాల్సి వస్తుందన్న కారణంతో నటించడానికి ఇష్టపడలేదంటున్నాడు యంగ్ డైరెక్టర్ బాబి.

సినిమా రచయితగా డైరెక్టర్గా కంటే నటించే ఛాన్సే బాబికి ముందు వచ్చిందట. ఆ విషయం అతడే స్వయంగా చెప్పుకొచ్చాడు.  ‘‘రైటర్ చిన్నికృష్ణ వల్ల అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రిలో యాక్టింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో బన్నీ వెనుక నలుగురైదుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో నేనూ ఒకడ్ని. సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలాసేపు బన్నీ నిక్కరుతోనే ఉంటాడు. అతడి వెనుక ఉండే నన్ను కూడా అదే వేసుకోమన్నారు. మూడో తరగతి నుంచే నేను ఫుల్ ప్యాంట్ వేసుకునే వాడిని. అలాంటిది అంత పెద్దయ్యాక లాగు వేసుకోవడం నా వల్ల కాలేదు. దాంతో ఆ సినిమా వదులుకున్నా’’ అంటూ వెండితెరపై తను నటించే అవకాశం ఎలా తప్పిపోయిందో గుర్తు చేసుకున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్ట్ చేసిన బాబి లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జైలవకుశ సినిమా తీశాడు. ఎన్టీఆర్ ను  తొలిసారి ట్రిపుల్ రోల్ లో చూపించి అతడి అభిమానులకు పండగ చేశాడు. ఈ సినిమా డైరరెక్టర్ గా బాబికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 

టాక్: రాష్ట్ర రాజధాని అమరావతిలో రామానాయుడు స్టూడియో

Suresh-Babu-To-Build-Ramanaidu-Studios-in-amaravati-Andhra-Talkies.jpg
రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి అవకాశాలు ఉన్న నగరంగా అందరూ గుర్తించినది విశాఖపట్నం. సినిమా ఇండస్ట్రీకి వైజాగ్ ఎప్పటి నుంచో ఫేవరెట్ సిటీ. సినిమా షూటింగులకు అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం ఇక్కడుంటుంది. అందుకే మూవీ మొఘల్ రామానాయుడు విశాఖలో సినిమా స్టూడియో కూడా నిర్మించారు. తాజాగా ఇండస్ట్రీలో కొంతమంది రాజధాని అమరావతిపై ఫోకస్ పెట్టారు.

అమరావతిని రానున్న రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇక్కడ పట్టు పెంచుకోగలిగితే వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడం తేలికవుతున్నది అమరావతిని ప్రిఫర్ చేస్తున్న వాళ్ల ఆలోచనగా ఉంది. ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు అమరావతిలో స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ప్రభుత్వం భూమి ఇస్తే వైజాగ్ లో తన తండ్రి రామానాయుడు కట్టిన విధంగా అమరావతిలోనూ స్టూడియో కడదామని ప్లాన్ చేస్తున్నారనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఆయనతో పాటు మరికొంతమంది సినిమా పెద్దలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి స్టూడియోల నిర్మాణానికి భూములు కావాలని కోరినట్లు తెలుస్తోంది. హీరో - ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం సినిమాపరంగా విశాఖను అభివృద్ధి చేయడమే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీని ఎక్కడ డెవలప్ చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయమేదీ తీసుకోలేదని ఫిలిం డెవలప్ కార్పొరేషన్ ఛైర్మన్ అంబికా కృష్ణ అంటున్నారు. నంది అవార్డుల ప్రకటన తర్వాత వచ్చిన వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి స్పందించడమే మేలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. నంది అవార్డుల ఫంక్షన్ తరవాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చనేది తెలుస్తోంది. 
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...