వారసత్వ సంపదగా 800కోట్లు కొల్లగొట్టిన హీరో..
వారసత్వ సంపదగా 800కోట్లు కొల్లగొట్టిన హీరో.. |
అవును. ప్రస్తుతం పటౌడీల వంశ వారసుడు సైఫ్ మాత్రమే. పటౌడీల వంశంలోని పూర్వికులు దశాబ్దాల క్రిందట భారతదేశంలో పరిపాలన సాగించినప్పుడు పేరు ప్రఖ్యాతలతో పాటు ఆస్తులను కూడా సంపాదించి పెట్టారు. స్వాతంత్ర్యానికి ముందు చివరిగా పటౌడీల వంశ రాజు ఇఫ్తీకర్ అలీఖాన్. ఆయన పరిపాలనలో ఆస్తులతో పాటు భారీ అంతస్తులను కూడా నిర్మించారు. అందులో ఒకటి గుర్గావ్ లోని పటౌడీ ప్యాలెస్. రాజవంశీయుల ప్యాలెస్ కాబట్టి సుమారుగా 15ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని సమాచారం.
అద్భుతమైన నిర్మాణ శైలితో పదుల సంఖ్యలో గదులు కలిగి ఉన్నట్లు చెప్తున్నారు. పటౌడీలకు ఆ ప్యాలెస్ వారసత్వంగా వస్తున్న సంపద. దాని విలువ 800కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతటి విలువ కలిగిన పటౌడీ ప్యాలెస్ రీసెంట్ గా సైఫ్ అలీఖాన్ కు వారసత్వ సంపదగా దక్కింది. ఇంతకాలం ఆ ప్యాలెస్ లో కొన్ని సినిమా షూటింగులు కూడా జరిగాయట. మరి సినిమాలలోనే కాదు సైఫ్ ఆస్తుల పరంగా కూడా సంపన్నుడయ్యాడని అందరూ భావిస్తున్నారు. ఏదైతేనేం కోట్లు కొల్లగొట్టిన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం రాజరిక పట్టాభిషేకం పొందినట్లే.
No comments:
Post a Comment