Showing posts with label Movie News. Show all posts
Showing posts with label Movie News. Show all posts

టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ విషాదాంతం స్టోరీ

టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ విషాదాంతం స్టోరీ

Heroin-Arthi-Agarwal-Vardhanthi--Winning-a-Cine-Life-Andhra-Talkies
టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ విషాదాంతం స్టోరీ
ఆర్తి అగర్వాల్.. తెలుగు తెరపై ఎంత వేగంగా దూసుకొచ్చిందో.. అంతే వేగంగా కనుమరుగైన హీరోయిన్. తక్కువ సమయంలోనే అగ్రహీరోలందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ అనూహ్యంగా గ్రాఫ్ పోగొట్టుకొని ప్రాణాలే కోల్పోయింది.

ఈ మధ్యలోనే ప్రేమ విఫలం కావడం.. వేరే పెళ్లి చేసుకోవడం.. వైద్య చికిత్స వికటించడంతో స్టార్ హీరోయిన్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈరోజు ఆర్తి అగర్వాల్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

అమెరికాలోని గుజరాతీ కుటుంబంలో మార్చి 5వ తేదీన ఆర్తి అగర్వాల్ జన్మించారు. తండ్రి శశాంక్ వ్యాపారవేత్త. తల్లి వీమా గృహిణి. హీరోయిన్ అవ్వాలన్న ఆశ ఆర్తి అగర్వాల్ లో ఉండేది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి అమెరికాలో పర్యటించగా.. ఆర్తిని గుర్తించి ప్రశంసించారు. బాలీవుడ్ లో ‘పాగల్ పన్’ చిత్రంతో ఆర్తి సినీ జీవితం ప్రారంభమైంది.

ఆ తర్వాత వెంకటేశ్ తో ‘నువ్వు నాకు నచ్చావ్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తరుణ్ ఎన్టీఆర్ చిరంజీవితో ‘ఇంద్ర’ ఉదయ్ కిరణ్ మహేష్ బాబుతో బాబీ బాలయ్య తో అగ్రహీరోలందరితో చేసి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ముద్ర వేసింది.

భారీ ఫైట్స్ కోసం సిద్ధమవుతున్న ఎన్టీఆర్.. తెరపై రచ్చేనట!

భారీ ఫైట్స్ కోసం సిద్ధమవుతున్న ఎన్టీఆర్.. తెరపై రచ్చేనట!

Hero-jr-NTR-preparing-for-the-big-fights-Andhra-Talkies
భారీ ఫైట్స్ కోసం సిద్ధమవుతున్న ఎన్టీఆర్.. తెరపై రచ్చేనట!
తెలుగు స్టార్ హీరోలు ఎన్టీఆర్-రామ్చరణ్ కథానాయకులుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకోవాలని సిద్ధం అవుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ డ్రామాగా బ్రిటిష్ కాలంలో జరిగిన కథతో దీన్ని రూపొందిస్తున్నారు జక్కన్న. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర రెండు వైవిధ్యమైన షేడ్స్ను కలిగి ఉంటుందని ఇదివరకే రాజమౌళి టీమ్ చెప్పింది. ఒక లుక్లో ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేయగా మూడో షెడ్యూల్ కోసం ఇంకాస్త బాడీ పెంచే పనిలో ఉన్నాడు తారక్. పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు ఎన్టీఆర్.

అయితే ఎన్టీఆర్ను సరికొత్తగా చూపించేందుకు రాజమౌళి అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని టాక్. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిపేసి ఇళ్లకే పరిమితమయ్యారు రాజమౌళి టీమ్.

లాక్ డౌన్ రూల్ బ్రేక్ చేసిన శృంగార తార అరెస్ట్

Sexy-Heroin-Poonam-Pandey-Arrested-For-Violating-Coronavirus-Lockdown-Rules-Andhra-Talkies

లాక్ డౌన్ రూల్ బ్రేక్ చేసిన శృంగార తార అరెస్ట్

అందాల ఆరబోతలో పాశ్చాత్య ధోరణితో రచ్చిపోయే శృంగార తారగా పూనమ్ పాండే స్పీడ్ గురించి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో శ్రుతిమించిన ఫోటోషూట్లు వీడియో షూట్లను అభిమానులకు షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంది. నిరంతరం ఏదో ఒక వివాదాస్పద వ్యవహారంతో పూనమ్ టచ్ లో ఉంటుంది. రకరకాల వేడెక్కించే కామెంట్లతో నెటిజనుల నుంచి అక్షింతలు వేయించుకుంది పలుమార్లు. సోషల్ మీడియాల్లో అర్థనగ్న ప్రదర్శనలు.. వేడెక్కించే కామెంట్లు ఇవన్నీ కమర్షియల్ ప్రకటనల ఆదాయ ఆర్జన కోసం పూనమ్ ఆడిన నాటకాలు అంటూ నెటిజనులు ఇప్పటికే గ్రహించారు.

'కేజీఎఫ్'ను అక్రమంగా ప్రసారం చేసిన టీవీ ఛానల్..

'కేజీఎఫ్'ను అక్రమంగా ప్రసారం చేసిన టీవీ ఛానల్..
అసలు ఎలాంటి అంచనాలు లేకుండా దేశంలో చరిత్ర సృష్టించిన సినిమా కేజీఎఫ్. బాహుబలి తర్వాత దేశంలో సంచలనం రేపింది కేజీఎఫ్. కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందురు నిర్మించారు. 2018 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా మాములు విజయం సాధించలేదు. విడుదలైన అన్నీ బాషలలో మంచి విజయం అందుకుంది. అయితే కేజీఎఫ్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఆధిక ధరకు కొనుగోలు చేసి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచింది. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. కేజీఎఫ్ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులను ఇంతవరకు ఏ తెలుగు ఛానల్ కొనుగోలు చేయలేదట.

అయితే ప్రస్తుతం కేజీఎఫ్ సాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడానికి కొన్ని టాప్ చానెల్స్ పోటీ పడుతున్నాయట. ఇక ఈ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులు చర్చల దశలో ఉండగానే.. ఓ తెలుగు లోకల్ ఛానల్ కేజీఎఫ్ సినిమాను అక్రమంగా ప్రసారం చేసిందట. ఈ విషయాన్నీ కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. అంతేగాక ఆ ఛానల్ స్ట్రీమింగ్ స్క్రీన్ షాట్ కూడా పోస్ట్ చేశారు. ఇలా సినిమా హక్కులు చర్చల దశలో ఉండగానే అక్రమంగా ప్రసారం చేయడం పై నిర్మాతలు మండిపడుతున్నారు. ప్రసారం చేసిన ఆ లోకల్ ఛానల్ పై లీగల్ చార్జెస్ తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కేజీఎఫ్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండేసరికి సాటిలైట్ హక్కులు ఎవరు కొనలేదని టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుతం కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్2 రూపొందుతున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే కేజీఎఫ్2 భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది..

అలనాటి అందాలనటి జ్ఞాపకాలలో అమితాబ్..

Bollywood-Hero-Amitabh-in-the-memory-of-old-beauty-Andhra-Talkies
అలనాటి అందాలనటి జ్ఞాపకాలలో అమితాబ్..
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం తన మిత్రులు తోటి నటులు అయినటువంటి దివంగత అందాల తార శ్రీదేవి టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ లను గుర్తుచేసుకుంటూ వారితో కూడిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. గతంలో శ్రీదేవితో నటించిన 'ఖుదాగవా' సినిమాను గుర్తుచేసుకొని.. నేను శ్రీదేవి కలిసి నటించిన ఈ సినిమా 1992 మే8 రోజున విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలై నిన్నటికి 28 సంవత్సరాలు పూర్తయింది. ఆమె ఎంతో గొప్ప నటి. కానీ ఇలా ఇంత త్వరగా ఈ లోకాన్ని సినీ లోకాన్ని విడిచి వెళ్తుందని ఊహించలేదు. ఆమె ఖుదాగవా సినిమా టైంలో ఎంత సౌమ్యంగా ఉందో.. మరణించే వరకు అలాగే ఉందని తెలిపి ఖుదాగవా సినిమాలోని ఓ ఫోటో షేర్ చేశారు.

ఇక రీసెంట్ గా ఇద్దరు టాప్ యాక్టర్లను కోల్పోయి బాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా ఆ బాధలో నుండి కోలుకోలేదు. అందులో ఇర్ఫాన్ ఖాన్ గురించి బిగ్ బి గుర్తుచేసుకుంటూ.. తనతో వర్క్ చేసిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం మే8న నేను ఇర్ఫాన్ కలిసి నటించిన 'పీకూ' సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సంతోషాన్ని పంచుకోవడానికి ప్రస్తుతం ఇర్ఫాన్ మనతో లేరు. వెరీ టాలెంటెడ్ యాక్టర్ అని చెప్పారు. ఇర్ఫాన్ కూడా ఆకస్మాత్తుగా లోకాన్ని విడిచి మనందరినీ బాధలోకి నెట్టేసి వెళ్లిపోయారు. కానీ వారి జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయంటూ బిగ్ బి తెలిపారు. అందాల నటి శ్రీదేవి ఇర్ఫాన్ ఖాన్ లతో దిగిన స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారు అమితాబ్. ఇద్దరు లెజెండ్స్ ని కోల్పోవడం బాధాకరమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సూపర్ సీనియర్లను టార్గెట్ చేసిన గోవా బ్యూటీ...!



సూపర్ సీనియర్లను టార్గెట్ చేసిన గోవా బ్యూటీ...!

Goa-Beauty-Ileana-Targets-Super-Seniors-Andhra-Talkies
సూపర్ సీనియర్లను టార్గెట్ చేసిన గోవా బ్యూటీ...!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదాలో కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలిన బ్యూటీ ఇలియానా. 'దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ - పూరి కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' సినిమాలో నటించి ఒకే సినిమాతో స్టార్ హీరోయిన్గా మారింది. ఆ సినిమాలో ఇల్లీ బేబీ తన నడుమందాలతో ఇక్కడి కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ ప్రభాస్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రవితేజ వంటి హీరోలందరి సరసన యాక్ట్ చేసింది. ఓ పక్క ఇటు తెలుగు తమిళంలో నటిస్తూనే.. మరోవైపు హిందీ సినిమాలపై కన్నేసిన ఇల్లీ బేబీ అక్కడ కూడా అదరగొట్టింది. బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువలా వచ్చి పడటంతో మన తెలుగు సినిమాలను పక్కన పెట్టేసింది. తర్వాత రోజుల్లో అక్కడ కూడా అవకాశాలు సన్నగిల్లడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూపు మళ్లించింది. ఎన్నో ఆశలతో రవితేజ హీరోగా తెరకెక్కిన 'అమర్ అక్బర్ ఆంటోని' మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆమెకు నిరాశనే కలిగించింది. దీంతో ఛాన్సెస్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించింది. ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. ఇప్పుడు ఈ గోవా బ్యూటీ తిరిగి ఫామ్ లోకి రావడానికి తెగ ట్రై చేస్తోంది.

హీరో కం విలన్ గారి 4 సినిమాలు రెడీ.. రిలీజ్ సంగతి అడక్కండి!



హీరో కం విలన్ గారి 4 సినిమాలు రెడీ.. రిలీజ్ సంగతి అడక్కండి!

4-Movies-Ready-But-No-Release-Andhra-Talkies
హీరో కం విలన్ గారి 4 సినిమాలు రెడీ.. రిలీజ్ సంగతి అడక్కండి!
ఆయనో యువ హీరో కం విలన్. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్టు రాలేదు.. కెరీర్లో బ్రేక్ కూడా రాలేదు. అలా అని అవకాశాలకు లోటేమీ లేదు. హీరోగా నటిస్తూనే విలన్ గా.. కీలకమైన క్యారెక్టర్లు వచ్చినప్పుడు ఒప్పుకుంటూ తన కెరీర్లో ముందుకు సాగిపోతున్నాడు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ హీరో నటించిన నాలుగు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడంటే కరోనా క్రైసిస్ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి.. విడుదలకు అవకాశం లేదు. కానీ ఈ హీరో నటించిన ఆ నాలుగు సినిమాలు మాత్రం డిసెంబర్ నుంచే రిలీజ్ కు నోచుకోవడం లేదట.

ఈ సినిమాల నిర్మాతలు వేసవి సీజన్ పైనే ఆశలు పెట్టుకొని ఉన్నారట. ఈ సమ్మర్ లోనే డెడ్ వీకెండ్స్ చూసుకొని.. ఈ సినిమాలను విడుదల చేసే ప్లాన్ వేసుకున్నారట. కరోనా.. లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ఆ ప్లానింగ్ కాస్త తల్లక్రిందులుగా మారింది. ఆ నిర్మాతలకు రూపాయి కూడా డా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. ఈ నిర్మాతలు రిలీజ్ డేట్ ఖరారు చేసుకునేందుకు ఛాంబర్ కు వెళ్ళిన సమయంలో "ఎందుకయ్యా ఇలాంటి సినిమాలు తీసి నష్టాలు కొని తెచ్చుకుంటారు" అని మొహం పైనే చెబుతున్నారట.

కరోనాకు కారణం 5జీ టవర్లే : హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్!



కరోనాకు కారణం 5జీ టవర్లే : హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్!

Corona-Cause-Because-Of-5G-Towers--Hollywood-Star-Andhra-talkies
కరోనాకు కారణం 5జీ టవర్లే : హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్!
కరోనావైరస్ తో ప్రపంచం వణికిపోతుంటే హాలీవుడ్ యాక్టర్ తాజాగా మరో భారీ బాంబు పేల్చాడు. భయాందోళనల మధ్య బతుకుతున్న ప్రజలు తాజాగా హాలీవుడ్ యాక్టర్ చేసిన కామెంట్లు - పోస్టులపై ఇప్పుడు దృష్టిసారించారు. కరోనావైరస్కు అసలు కారణం అదే అంటూ నటుడు ఊడీ హారెల్సన్ విసిరిన బాంబు ఏమిటంటే.. కరోనావైరస్ కు 5జీ నెట్ వర్క్ కు సంబంధం అంటగడుతూ హాలీవుడ్ యాక్టర్ హారెల్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి.

కరోనా వ్యాప్తికి అసలు కారణం 5జీ వైర్ లెస్ నెట్ వర్క్స్ అంటూ చేసిన పోస్టు సోషల్ మీడియా లో వైరల్ అయింది. అయితే ఈ పోస్టుపై కొందరు స్పందిస్తూ.. బొడిగుండుకు మోకాలుకు లింకు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కరోనావైరస్ కు అసలు కారణం 5జీ వైర్ లెస్ నెట్ వర్క్స్ ఊడీ హారెల్సన్ షేర్ చేసిన పోస్టులో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చైనాలో వుహాన్ తొలి 5జీ స్మార్ట్ సిటీగా ఎంపికైంది. దాంతో ప్రపంచంలోనే తొలి 5జీ స్మార్ట్ హైవేగా పేరుతెచ్చుకొన్నది. అంతలోనే వుహాన్ లో ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ గణనీయంగా వ్యాప్తి చెందింది అని ఊడీ హారెల్సన్ షేర్ చేసిన రిపోర్టులో పొందుపరిచాడు.

విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్న స్టార్ హీరో..?


విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్న స్టార్ హీరో..?

Popular-Hero-Upendra-Ready-For-Villain-Roles-in-Telugu-Movies-Andhra-Talkies
విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్న స్టార్ హీరో..?
కాలంతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు విలన్లుగా చేసి హీరోలు అవ్వాలని ఆశ పడేవారు. ఇప్పుడు హీరోలు విలన్ వేషాలు వేయాలని ఆశ పడుతున్నారు. స్టార్ హీరోలు సైతం ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అయితే విలన్ రోల్ అయినా ఓకే అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోగా ఒక వెలుగు వెలిగి కెరీర్ కాస్త స్లోగా ఉంటే విలన్ గా ట్రై చేయడం లేదా హీరోగా అవకాశాలున్న సమయంలోనే పక్క భాషల్లో విలన్ గా చేయడం ఈ మధ్య హీరోలకు బాగా కలిసి వస్తోంది. స్టైలిష్ విలన్స్ గా - హీరోకు ఏమాత్రం తగ్గని స్టైల్స్ అండ్ క్యారెక్టర్ వెయిట్ తోనే నెగటివ్ షేడ్స్ అద్భుతంగా పోషిస్తున్నారు. ఫేడ్ అవుట్ అయిపోయే హీరోలకు కెరీర్ మళ్లీ ప్రారంభమవుతుంటే - విలన్ గా సొంతభాషలో ప్రేక్షకులు ఒప్పుకోని హీరోలు పక్కభాషల్లో నెగటివ్ రోల్స్ లో రెచ్చిపోతున్నారు. హీరోలుగా డిజాస్టర్ల బాట పట్టి మళ్లీ విలన్ గా లైఫ్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లలో మన టాలీవుడ్ లో తారకరత్న - జగపతిబాబు లాంటి వాళ్లుంటే - ఒక భాషలో హీరోగా చేస్తూనే మరో భాషలో విలన్ గా చేస్తున్నారు ఆది పినిశెట్టి - అరుణ్ విజయ్ - ఉపేంద్ర లాంటి వారు ఉన్నారు.

ఆ హీరోయిన్లు దుకాణం సర్దాల్సిందేనా..?


ఆ హీరోయిన్లు దుకాణం సర్దాల్సిందేనా..?

Tollywood-Producers-Interested-With-New-Heroines-Andhra-Talkies
ఆ హీరోయిన్లు దుకాణం సర్దాల్సిందేనా..?
హీరోయిన్... సినిమాల్లో ఈ పదానికి చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం. నటించే సత్తా ఉన్నా సరయిన అవకాశం రాక వచ్చిన గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు కొందరయితే - సినిమాల్లో ఉండాలి అనుకుని ఫిక్స్ అయ్యి నటన సరిగా రాక వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు మరికొందరు. తమ అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో పాతుకుపోయిన వారు ఇంకొందరు. మన టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికొస్తే రోజుకో కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది. వాళ్లలో కొందరు అందం - అభినయంతో గుర్తింపు తెచ్చుకోగా - మరికొందరు ఆ ఒక్క సినిమాతోనే సరిపెట్టుకొని తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోతుంటారు. రోజకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఉండటం అంటే మాటలు కాదు.

కానీ కొంతమంది హీరోయిన్లు బ్యూటీతో పాటు తమ యాక్టింగ్ కలిపి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చిన వరుస అవకాశాలు సద్వినియోగం చేసుకోలేక - పాత్ర కంటే రెమ్యూనరేషన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చి ఇండస్ట్రీ నుండి ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. హెబ్బా పటేల్ - శ్రద్ధాదాస్ - ప్రగ్యా జైస్వాల్ - రెజీనా కసాండ్ర - అను ఇమ్మాన్యుయేల్ లాంటి హీరోయిన్లు ఈ కోవకే చెందుతారు. వీరితో పాటు ఇంకా కొంతమంది హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ నుండి తమ దుకాణం మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

నువ్వు వర్జినా అడిగిన వాడిపై హీరోయిన్ ఫైర్


నువ్వు వర్జినా అడిగిన వాడిపై హీరోయిన్ ఫైర్

The-Heroine-Fires-On-Netigen-Andhra-Talkies
నువ్వు వర్జినా అడిగిన వాడిపై హీరోయిన్ ఫైర్
సోషల్ మీడియానే ఇప్పుడు ఆయుధమైంది. దాంతో నే తమ భావాలను అందరూ వ్యక్త పరుస్తున్నారు. సినిమా ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారానే అభిమానులతో కనెక్ట్ అవుతున్నారు. చిరంజీవి కూడా తాజాగా ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ లలోకి వచ్చాడు.

అయితే హీరోయిన్లను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో రెచ్చిపోయే నెటిజన్లు కోకొల్లలు. ఈ క్రమంలోనే తాజాగా మలయాళీ హీరోయిన్ సంయుక్త మీనన్ తో ఓ నెటిజన్ అసభ్యంగా ప్రవర్తించాడు. అందరి ముందే ఆ హీరోయిన్ ను 'నువ్వు వర్జినా కాదా' అని ప్రశ్నించాడు. దీంతో షాక్ కు గురైన హీరోయిన్ సంయుక్త అతడికి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. ఓ రేంజ్ లో పైర్ అయ్యింది.

నీలాంటి వాళ్ల వల్లే అమ్మాయిలు ఆటబొమ్మలా కనిపిస్తున్నారు. మీరు వర్జినిటీ సెక్స్ ఆల్కహాల్ గురించే ఆలోచిస్తారు. మీతోనే అమ్మాయిలకు డేంజర్ అంటూ నిప్పులు చెరిగింది సంయుక్త. అనంతరం చెడామడా తిట్టేసింది. జాగ్రత్తగా ఉండు.. నీ చెంప పగులకొట్టే అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుందని సంయుక్త వార్నింగ్ ఇచ్చింది.

2016లో మలయాళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకొని అక్కడ పెద్ద హీరోయిన్ గా ఎదిగింది.తమిళనాట కూడా సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది.

రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కష్టమే...!


రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కష్టమే...!

Plans-Of-Star-Heroes-Shattered-By-Corona-Andhra-Talkies
రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కష్టమే...!
కరోనా మహమ్మారి మూలంగా అందరి తలరాతలు మారుతూ వస్తున్నాయి. డబ్బున్నోడు పేదోడు మధ్య తరగతి అని తేడా లేకుండా అందర్నీ అల్లాడిస్తున్నది. ఇంక ప్రపంచ వ్యాప్తంగా దీని వల్ల అన్ని రంగాలకు నష్టం వాటిల్లింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మన దేశంలో కూడా చాలా ప్రభావం చూపింది. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. సినీ ఇండస్ట్రీ షూటింగులు అన్నీ ఆపుకొని థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతవేసి లాక్ డౌన్ చేసుకుంది. దీంతో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాను. షూటింగులు ఆగిపోవడంతో ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మన టాలీవుడ్ లో ఈ ఏడాది అల్లు అర్జున్ బాలయ్య నిఖిల్ నాగచైతన్య లాంటి హీరోలు రెండు రెండు సినిమాలను రెడీ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వచ్చి మీద పడటంతో ఇప్పుడు అన్ని లెక్కలు మారి పోయాయి. ఒక్క సినిమా రిలీజ్ కి రెడీ చాలు అనుకుంటున్నారు.

ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..


ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..

Indian-Famous-Singer-Stucked-In-Italy-Andhra-Talkies
ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..
గాన గంధర్వుడు పండిట్ జస్రాజ్కు మనవరాలు ప్రముఖ సినీ గాయని శ్వేతా పండిట్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంది. నెలరోజుల కిందట ఇటలీకి వెళ్లిన ఆమె రోజురోజుకి అక్కడ కరోనా వ్యాప్తి పెరుగుతుండటం తో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. మన దేశంలో కరోనా ప్రభావం లేనప్పటికీ.. ఇండియాకి వచ్చే అవకాశం ఉన్నా రాలేదు. 'కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది గనక ఇటలీ నుంచి బయటికి రావడం బాధ్యతా రాహిత్యమే అవుతుందంటుంది శ్వేత. ప్రస్తుత పరిస్థితుల్లో విమాన ప్రయాణం అంత మంచిది కాదు. అందుకే నెల రోజులుగా ఇటలీలో శ్వేత ఉంటున్న ఇంట్లోంచి బయటకు రాకుండా కాలక్షేపం చేస్తుందట. ఇటలీలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్ సైరన్ వింటూ నిద్రపోయి మళ్లీ ఆ సైరన్తోనే నిద్రలేస్తున్నానంటుంది శ్వేత. అంబులెన్స్ శబ్దం తప్ప ఇంకేదీ వినిపించడం లేదట. ఫ్రెండ్స్.. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ చెప్పే సూచనలు పాటించండి.

సాయం చేయడానికి అనుష్క కి చేతులు రావా..?


.

సాయం చేయడానికి అనుష్క కి చేతులు రావా..?

Sexy-Heroin-Anushka-Not-Announced-Relief-Fund-for-TFI-Workers-Andhra-Talkies
సాయం చేయడానికి అనుష్క కి చేతులు రావా..?
మన టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఆకాశాన్నంటేలా ఉంటాయి. ఒక్కొక సినిమాకి రెండు నుండి మూడు కోట్లు తీసుకునే స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. కొంతమంది హీరోయిన్లు ఒక్క ఐటమ్ సాంగ్ చేస్తేనే కోటి రూపాయల దాకా డిమాండ్ చేస్తుంటారు. గెస్ట్ రోల్స్ చేయడానికి వాళ్ళు వసూలు చేసేది లక్షల్లోనే. ఇంత భారీ మొత్తంలో సంపాదించే హీరోయిన్లు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఇప్పుడు సగటు అభిమానికి వస్తున్న డౌట్. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఈ వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన పంజాను చూపెడుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. టాలీవుడ్ లోని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు హీరోలు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. కానీ ప్రణీత - లావణ్య త్రిపాఠి మినహా మిగతా హీరోయిన్లు స్పందించక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?



లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?

What-is-the-situation-of-the-film-industry-after-the-lockdown-Andhra-Talkies
లాక్ డౌన్ తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి ఏంటి.. భవిష్యత్తు ఎలా ఉంటుంది?
కోవిడ్-19 వ్యాప్తితో దాదాపుగా అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో అందరం ఒక్కసారిగా ఇంట్లో కూర్చుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. ఈ లాక్ డౌన్ ప్రతి ఒక్క సంస్థపై ఆర్థికంగా ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటలీ.. స్పెయిన్.. యూకె.. యూఎస్ఎ దేశాల్లో. కొన్ని ఇతర ఐరోపా దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.

ఈ వ్యాధి ప్రభావం మనదేశంపై కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇది కొత్త మార్పులకు దారితీయవచ్చు. ప్రస్తుతం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేందుకు ప్రజలు భయపడి ఇంట్లోనే అందుబాటులో ఉండే సినిమాలతోనో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు ప్రజలు వెళ్తారేమో కాని యావరేజ్ సినిమాలు అనే పదం ఇకపై కనిపించకపోవచ్చు

RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్!


RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్!

Director-Rajamouli-Movie-RRR-Team-Using-Lockdown-For-Movie-Promotions-Andhra-Talkies
RRR ప్రచారానికి వరంగా మారిన లాక్ డౌన్!
ఒక సినిమాను నిర్మించడం వేరు.. దానికి సరైన ప్రచారం కల్పించి ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడం వేరు. చాలామంది ఈ ప్రచారం విషయంలో వెనకబడతారు.  ఓపెనింగ్స్ లేక సినిమా హిట్ అయ్యే అవకాశాలు జారవిడుచుకుంటారు.  అయితే రాజమౌళి మార్కెటింగ్ టెక్నిక్స్ మాత్రం ఎప్పుడూ కొత్తపుంతలు తొక్కుతూ ఉంటాయి.  నిజానికి  రాజమౌళి మార్కెటింగ్ వల్లే తన సినిమాల క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది.  'బాహుబలి' సమయంలో రాజమౌళి అనుసరించిన మార్కెటింగ్ టెక్నిక్స్ చాలామందిని అబ్బురపరిచాయి.  ఇప్పుడు 'RRR' విషయంలో లో కూడా అలాంటి ఎత్తుగడతోనే ముందుకు వెళ్తున్నారు.

కరోనా దెబ్బకు షూటింగులు ఆగిపోయాయి. ప్రమోషన్లు కూడా ఆపారు. లాక్ డౌన్ కావడంతో దాదాపుగా ప్రజలంతా ఇంటిపట్టునే ఉంటూ కాలం గడుపుతున్నారు.  అయితే ఈ లాక్ డౌన్ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేందుకు రాజమౌళి టీమ్ రెడీ అయింది.  మొదట మోషన్ పోస్టర్ తో వచ్చారు. టైటిల్.. మోషన్ పోస్టర్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. నిన్న చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో విడుదల చేశారు.  ఇది కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. చరణ్ కు ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్టుకు యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ దక్కుతోంది.

మోస్ట్ పెయిడ్ హీరోయిన్స్ జాబితాలో పూజ..


మోస్ట్ పెయిడ్ హీరోయిన్స్ జాబితాలో పూజ..

Popular-Heroin-Pooja-on-most-paid-heroines-list-Andhra-Talkies
మోస్ట్ పెయిడ్ హీరోయిన్స్ జాబితాలో పూజ..
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలిగిపోతుంది పూజ హెగ్డే. వరుస హిట్లతో టాప్ హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాతో పాటు అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే తాజా కథనాల సమాచారం మేరకు.. ఈ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హీరోయిన్ గా నటించడానికి పూజ భారీ పారితోషికాన్ని తీసుకుంటుందట. అదికూడా హీరో అఖిల్ కంటే హీరోయిన్ పూజకే ఎక్కువ చెల్లిస్తున్నారట నిర్మాతలు బన్నీవాసు వాసు వర్మలు. ఇక హీరోకంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలోకి పూజ  చేరిందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న పూజ బ్యాంకు బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుందని గుసగుసలాడుతున్నారు. మరి పూజ ఈ సోషల్ మీడియా వార్తలపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఎద సొంపులను ఎరగా వేస్తున్న ఆదా శర్మ


ఎద సొంపులను ఎరగా వేస్తున్న ఆదా శర్మ

sexy-heroin-Adah-Sharma-Glamourous-pose-Andhra-Talkies
ఎద సొంపులను ఎరగా వేస్తున్న ఆదా శర్మ
ఆదా శర్మ...ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది హార్ట్ ఎటాక్ అనే చెప్పాలి. తన నటనతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. అల్లు అర్జున్ తో సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా నటించింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా తెలుగులో మెయిన్ హీరోయిన్ అవకాశాలైతే రాలేదనే చెప్పాలి. కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయింది. ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ అడపాదడపా చిత్రాలలో నటించింది.

 ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి పేరు ఉంది. ఈమె సినిమాలకన్నా ఎక్కువగా తన ఫోటోలతో ఫ్యాన్స్ కు మత్తెకిస్తుంది. ఎక్కువగా ఫోటోషూట్ లు చేస్తూ తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమవుతున్నారు. ఎంతో కొంత వినోదం కలిగించడం కోసం తమ సోషల్ మీడియా ద్వారా సెలెబ్రెటీలు తమ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ భామ కూడా తన అభిమానుల కోసం ఒక ఫొటో అప్ లోడ్ చేసి కుర్రకారుకు ఊపు తెప్పిస్తున్నది. ఎద సొంపులను చూపిస్తూ మత్తెక్కించే కళ్ళతో కుర్రాళ్లకు ఎర వేస్తున్నట్లు ఫొటోకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు


ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు

Gates-Are-Closed-For-Indian-Movies-Andhra-Talkies
ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు
కరోనా ధాటికి కుదేలవుతున్న రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. మిగతా రంగాల కంటే ముందు దీనిపైనే కరోనా ప్రభావం పడింది. నెల కిందట్నుంచే సినిమాల వసూళ్లు పడిపోయాయి. తర్వాత ఏకంగా థియేటర్లే మూసేశారు. షూటింగులు ఆగిపోయాయి. రిలీజ్లు ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో తెలియట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ నెలాఖరు వరకు థియేటర్లను మూసేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనూ థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ నెల రెండో అర్ధంలో అయినా పరిస్థితి మారుతుందేమో అని చూస్తున్నారు. ఇండియా లో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కనీసం మే ఆరంభం నుంచి అయినా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. వేసవిలో అత్యంత ముఖ్యమైన ఈ నెలలో అయినా వసూళ్ల పంట పండించుకోవచ్చని భావిస్తున్నారు.

బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..??


బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..??

heroin-anushka-shetty-mega-chance-so
బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..?
'బాహుబలి' సినిమాతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. కింగ్ నాగార్జున నటించిన 'సూపర్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించిన స్వీటీ శెట్టి తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అరుంధతి పంచాక్షరీ భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ మూవీల్లో నటించి తాను ఎలాంటి ఛాలెంజింగ్ పాత్ర అయిన చేయగలనని నిరూపించుకుంది. అయితే స్వతహాగా సౌమ్యురాలైన అనుష్క మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించే ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...