ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..
![]() |
ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్.. |
ఇంట్లోంచి బయటకు రాకండి. ఇవి మనకు కీలకమైన రోజులు అంటూ సందేశం ఇస్తుంది శ్వేత. పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆ దుస్థితి మనకు రావద్దు' అంటూ అక్కడి విషయాలను వార్తలను తన క్వారంటైన్ కాలాన్ని ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. స్వదేశానికి రాకుండా ఉండిపోయిన శ్వేత నిర్ణయాన్ని పలువురు సినీప్రముఖులు రాజకీయనేతలు అభినందిస్తున్నారు. టాలెంటెడ్ సింగర్ శ్వేతా పండిట్ బాలీవుడ్తో పాటు తెలుగు తమిళ భాషల్లోనూ తన మాధుర్యమైన గానాన్ని వినిపిస్తోంది. నాలుగేళ్ల వయసులోనే మణిరత్నం 'అంజలి' తో సినిమాల్లో పాటల ప్రయాణం మొదలుపెట్టింది. తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ తో కలిసి తొమ్మిదో యేటనే సంగీత దర్శకరాలుగా పని చేసింది. ఈమె క్షేమంగా ఉండాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment