కలవర పెడుతున్న జాన్ కొత్త అప్ డేట్

No-Bollywood-villains-for-Prabhas-this-time-Andhra-Talkies

కలవర పెడుతున్న జాన్ కొత్త అప్ డేట్

ప్రభాస్ సాహో చిత్రం విడుదలకు ముందే రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాడు. మొదట ఆ సినిమాకు జాన్ టైటిల్ అనుకున్నారు. సినిమా షూటింగ్ గత ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. గత ఏడాది ఈ సినిమా 2020 ఆరంభంలో వస్తుందని వార్తలు వచ్చాయి. 2020 వచ్చింది ఆరంభం కూడా అయిపోయింది. రెండవ నెల కాదు కదా మూడవ నెలలో కూడా వచ్చే పరిస్థితి లేదు.

సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చి ఉంటుంది. సమ్మర్ లేదా ఆ తర్వాత దసరాకు అయినా వస్తుందిలే అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ కోసం జగపతిబాబును ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందనుకుంటే జగపతిబాబును ఇప్పుడు ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయేంటి అంటూ ఫ్యాన్స్ గందర గోళంలో ఉన్నారు.



షూటింగ్ ఏ దశలో ఉందనే విషయం పై క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. జగపతిబాబు విలన్ పాత్రకు ఇప్పుడు ఎంపిక అయ్యాడు అంటే సినిమా షూటింగ్ పార్ట్ ఇంకా సగానికి పైగా ఉన్నట్లే అని.. అదే నిజం అయితే ఈ ఏడాదిలో ఈ చిత్రాన్ని ఆశించడం కష్టమే అంటున్నారు.

ఇక ఈ చిత్రానికి జాన్ కాకుండా ఓ డియర్ అనే టైటిల్ ను పెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ పిచెక్కి పోతున్నారు. ప్రభాస్ కు జోడీగా ఈ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. కృష్ణంరాజు కూడా కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు. తెలుగు తో పాటు ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...