ప్రేమతో మొదలై...మర్డర్ తో మలుపు తిరిగింది! | Start with love and turn with Murder!
మూడు నగరాలు.. రెండు ప్రేమకథలు... ఒక సంఘటన అంటూ ఆది పినిశెట్టి ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఈమధ్య కాలంలో వేరే కథానాయకుల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన ఆది పినిశెట్టి ఈసారి హీరోగా ఓ చిత్రం చేశారు. అదే... `నీవెవరో`. తాప్సి రితికాసింగ్ ఇందులో కథానాయికలు. `నిన్ను కోరి`లాంటి ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన ఎమ్.వి.వి. సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లవర్స్ అనే చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్న హరినాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.కోన వెంకట్ ఈ చిత్రం వెనక సూత్రధారి. ఆదివారమే టీజర్ విడుదలైంది. మరో మర్డర్ మిస్టరీతో సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమని టీజర్నిబట్టి అర్థమవుతోంది. ప్రేమకథతో మొదలై... ఒక సంఘటనతో మలుపు తిరుగుతుందీ కథ. మర్డర్ మిస్టరీని ఆధారంగా చేసుకొనే ఈ చిత్రం తెరకెక్కినట్టు అర్థమవుతోంది. తాప్సి రితికాల పాత్రలు కీలకమని తెలుస్తోంది. మరి ఈచిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందో చూడాలి. విజువల్స్ మ్యూజిక్ ఆకట్టుకొనేలా ఉన్నాయి.
No comments:
Post a Comment