అందుకేనా ముగ్గురు హీరోయిన్లు జంప్!!

Reason-Behind-Three-Heroined-Rejects-Rogue-Movie-Andhra-Talkies
'రోగ్'' సినిమా ట్రైలర్ చూశాక ఒక విషయంపై పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమాలోని హీరోయిన్లు ఇద్దరూ మామూలు హాటుగా ఘాటుగా నటించలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మన్నారా చోప్రా.. అలాగే ఏంజెలా క్రిసిలింజ్కిలూ రెచ్చిపోయారు అంతే. పెదాల ముద్దులు నుండి.. హాటుగా ఎక్స్ పోజింగ్ చేయడం వరకు.. అలాగే హీరో బిగి కౌగిట్లో నలిగిపోవడం నుండి అతను చేసే కొంటె పనులకు సహకరించడం వరకు చాలా డేర్ చేసేశారు. ఇప్పుడు సరిగ్గా ఒక విషయం గుర్తొచ్చిందండోయ్.

ముందుగా ఈ సినిమాలో చిరుత హీరోయిన్ నేహా శర్మ చెల్లెలు అయేషా చేసింది. వారం రోజులపాటు షూటింగ్ చేసిన తరువాత జంప్ అయ్యింది. తరువాత అమైరా దస్తూర్ కూడా షూట్ చేసింది. ఆమె కూడా మిడిల్ డ్రాప్. ఆ తరువాత పూజా జవేరి (ఇవాళ రిలీజైన ద్వారక సినిమాలో హీరోయిన్) హీరోయిన్ గా అంగీకరించి.. తరువాత బయటకు వచ్చేసింది. ఫైనల్ గా మన్నారా చోప్రా ఆ రోల్ లోకి దిగింది. ఇప్పుడు ట్రైలర్ చూశాక ఈ అమ్మాయిలందరూ అసలు ఎందుకు రోగ్ సినిమా నుండి ఎస్కేప్ అయ్యారో అర్ధమవుతోందిగా. మరీ ఇంత ఘాటుగా అంటే ఎలా పూరి?

చూద్దాం ఈ ఫీట్లన్నీ వెండితెరపై పండితే బాగానే ఉంటుంది. లేదంటే మాత్రం కాస్త ఇబ్బందే. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...