హృదయాలను కలిచి వేస్తున్న సుశాంత్ లాస్ట్ పోస్ట్...!

హృదయాలను కలిచి వేస్తున్న సుశాంత్ లాస్ట్ పోస్ట్...!

Sushant-Singh-Rajput-Last-Post-in-His-Social-Media-Andhra-Talkies
ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్ ''ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ'' చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఆయన ఈ రోజు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం సినీ లోకాన్ని షాక్ కి గురి చేసింది. సుశాంత్ ముంబై బంద్రాలోని తన నివాసంలో ఫ్యాన్ కి ఉరేసుకొని బలవన్మరణం చెందినట్లు గుర్తించారు. 34 ఏళ్ళ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి యావత్ సినీ అభిమనుల హృదయాలను కలచి వేసింది. సుశాంత్ గతకొంత కాలంగా బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా అతని మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదని.. అందుకే ఉరేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు.

కాగా 2008 నుండి అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై తన హవా చూపించిన సుశాంత్ తన నటనతో డ్యాన్స్ లతో అందరినీ ఆకట్టుకున్నాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. సుశాంత్ సింగ్ జూన్ 3న ఇంస్టాగ్రామ్ లో చివరి పోస్ట్ పెట్టారు. 
2002లో మరణించిన తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఒక కవితాత్మక పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఆ పోస్టు చూసి అందరి హృదయాలు బరువెక్కుతున్నాయి. ''మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును.. అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా'' అని సుశాంత్ తన తల్లి ఫోటో షేర్ చేసారు. అప్పుడు సుశాంత్ సింగ్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...