![]() |
Amitabh-Bachchan-to-donate-5-lakh-rupees-to-the-families-of-CRPF |
ఇదిలా ఉంటే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక అడుగు ముందుకు వేసి అమరులైన జవానుల కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించారు. దాడిజరిగిన ప్రదేశంలో 40 మంది జవానులు ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన ఇతర జవానులను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా శుక్రవారం సాయంత్రానికి మృతుల సంఖ్య మొత్తం 49 కి చేరింది. ఈ 49 మంది జవానుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.
ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ అధికారిక ప్రతినిథి కూడా ధృవీకరించారు. "అమితాబ్ బచ్చన్ గారు అమరుల కుటుంబాలకు ఈ విరాళాన్ని అందజేసేందుకు సరైన ప్రాసెస్ ను తెలుసుకుంటున్నారు. త్వరలోనే అమరులైన ప్రతి జవాను కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నగదు అందజేస్తారు" అని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment